IPL 2023: మిగిలిన మూడు ఎవరికి..? ఐపీఎల్ ప్లేఆఫ్స్ లెక్కలు ఇలా..
ఐపీఎల్ 2023 సీజన్ (IPL 2023) మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. అంతకుమించేలా ప్లేఆఫ్స్ రేసు కొనసాగుతోంది. గుజరాత్ అగ్రస్థానంతో తొలి బెర్తును ఖరారు చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. ఈ రేసులో చెన్నై, లఖ్నవూ ముందుండగా.. ముంబయి, రాజస్థాన్కు జట్లకు తక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్లో (IPL 2023) లీగ్ స్టేజ్ చివరి దశకు చేరింది. ఇప్పటికే అన్ని జట్లూ పదమూడేసి మ్యాచ్లు ఆడేశాయి. మే 21తో లీగ్ స్టేజ్ ముగుస్తుంది. తాజాగా సన్రైజర్స్పై బెంగళూరు (SRH vs RCB) అద్భుత విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసును మరింత రసవత్తరంగా మార్చింది. నాలుగు ప్లేఆఫ్స్ బెర్తుల్లో ఒకటి గుజరాత్ పేరిట ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. ఇక మిగిలిన మూడింటి కోసం ఐదు జట్ల మధ్యే తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఆయా జట్ల అవకాశాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..
- చెన్నై సూపర్ కింగ్స్: గుజరాత్ తర్వాత పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో చెన్నైసూపర్ కింగ్స్ ఉంది. ప్రస్తుతం 15 పాయింట్లతో ఉన్న చెన్నై మే 20న (శనివారం) దిల్లీ క్యాపిటల్స్తో తలపడాల్సి ఉంది. ఆ మ్యాచ్లో చెన్నై గెలిస్తే 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు అవుతుంది. ఒకవేళ ఓడినా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే, ముంబయి, బెంగళూరు తమ చివరి మ్యాచుల్లో ఓడిపోవాలి.
- లఖ్నవూ సూపర్ జెయింట్స్: కెప్టెన్ కేఎల్ రాహుల్ లేకపోయినా.. కీలక సమయంలో విజయాలు నమోదు చేసి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. ప్రస్తుతం 15 పాయింట్లతో నెట్రన్రేట్ కాస్త తక్కువ ఉండటం వల్ల మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆఖరి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్పై గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం. చెన్నై జట్టు పరిస్థితే లఖ్నవూకూ వర్తిస్తుంది. ఓడితే ఇతర జట్ల ఫలితాల కోసం వేచి చూడాలి. మే 20న కోల్కతాతో లఖ్నవూ తలపడనుంది.
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రాజస్థాన్ను భారీ తేడాతో ఓడించి.. తాజాగా హైదరాబాద్పై గెలిచి ప్లేఆఫ్స్ రేసులోకి బెంగళూరు దూసుకొచ్చింది. ప్రస్తుతం 14 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ను చివరి మ్యాచ్లో ఓడిస్తే ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పుడు 16 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంటుంది. చెన్నై, లఖ్నవూ, ముంబయి తమ చివరి మ్యాచుల్లో ఓడిపోతే బెంగళూరు రెండో స్థానంలోకీ వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ బెంగళూరు ఓడినా ప్లేఆఫ్స్ ఛాన్స్ ఉంది. అప్పుడు ముంబయి, రాజస్థాన్ తమ చివరి మ్యాచుల్లో ఓడిపోవాలి.
- ముంబయి ఇండియన్స్: గత మ్యాచ్లో లఖ్నవూ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయిన ముంబయి ఇండియన్స్ (14 పాయింట్లు) ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. హైదరాబాద్పై (మే 21న) ముంబయి భారీ విజయం సాధించినా.. బెంగళూరుతో నాలుగో స్థానం కోసం పోటీ తప్పదు. ముంబయి గెలిచి.. తన ఆఖరి మ్యాచ్లో బెంగళూరు ఓడితే మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా రోహిత్ సేన ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. అప్పుడు ముంబయి ఖాతాలో 16 పాయింట్లు, బెంగళూరు ఖాతాలో 14 పాయింట్లే ఉంటాయి. ఒకవేళ చివరి మ్యాచ్లో ముంబయి ఓడితే మాత్రం దాదాపు ఇంటిముఖం పట్టినట్లే. నెట్రన్రేట్ కారణంగా బెంగళూరు, రాజస్థాన్ జట్లలో ఒకటి నాలుగో స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది.
- రాజస్థాన్ రాయల్స్: ఇవాళ పంజాబ్ కింగ్స్తో రాజస్థాన్ తన చివరి మ్యాచ్లో తలపడనుంది. ఇందులో విజయం సాధిస్తే రాజస్థాన్ ఖాతాలో 14 పాయింట్లు వచ్చి చేరతాయి. రన్రేట్ ఎలాగూ ప్లస్లో ఉంది. ఇలాంటి సమయంలోనూ రాజస్థాన్కు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేం. ముంబయి, బెంగళూరు తమ చివరి మ్యాచుల్లో ఓడితే.. మూడు జట్లూ పద్నాలుగేసి పాయింట్లతో ఉంటాయి. మెరుగైన నెట్రన్రేట్ ఉన్న జట్టు ముందడుగు వేస్తుంది. రాజస్థాన్ మంచి రన్రేట్తో పంజాబ్ను ఓడిస్తే.. ఆ జట్టే నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్లోకి వెళ్తుంది. ఇక ఈ రోజు జరిగే మ్యాచ్లో పంజాబ్, రాజస్థాన్ ఎవరు ఓడినా.. ఆ జట్టు ఇంటిముఖం పట్టక తప్పదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.