IPL 2024: ఐపీఎల్ వేలం సందడి.. ఎప్పుడు ఉండొచ్చంటే?
అంతర్జాతీయ స్థాయిలో టీ20 క్రికెట్కు గ్లామర్ తీసుకొచ్చిన టోర్నీ ఐపీఎల్. మరి అలాంటి ఐపీఎల్ 2024 కోసం ఆటగాళ్ల వేలం కూడా పెద్ద సంచలనమే అవుతుంది.
(ఫొటో: బీసీసీఐ ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ అభిమానులు ఇప్పుడు వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) మూడ్ను ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) వచ్చే ఏడాది ఈవెంట్కు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. పీటీఐ కథనాల ప్రకారం.. ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్ మెగా వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే ఎడిషన్ కోసం ఫ్రాంచైజీలు వెచ్చించే సొమ్ము కూడా మరికొంత పెరిగే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి.
‘‘పది జట్లు పాల్గొనే ఐపీఎల్ వేలానికి సంబంధించిన ప్రక్రియ నిర్వహణ చాలా క్లిష్టమైంది. ఒకే చోట వందల సంఖ్యలో హోటల్ గదులు, సదుపాయాలు కల్పించడం కూడా కష్టమైన విషయం. బీసీసీఐ అధికారులు, ఫ్రాంచైజీలకు సంబంధించిన ప్రతినిధులు, బ్రాడ్కాస్ట్ సిబ్బంది... ఇలా చాలామంది ఉంటారు. అందుకే దుబాయ్ను వేదికగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక గతేడాది ఆటగాళ్లను కొనుగోలు చేసుకునేందుకు ప్రతి ఫ్రాంచైజీకి రూ.95 కోట్ల వరకు ఉండేవి. ఇప్పుడా సొమ్మును మరో రూ. 5కోట్లు పెంచేందుకూ ఆలోచన చేస్తున్నాం. అంటే 2024 సీజన్ కోసం నిర్వహించే వేలంలో ఫ్రాంచైజీలు రూ. 100 కోట్ల వరకు తమ సొమ్మును వెచ్చించేందుకు అవకాశం దక్కనుంది’’ అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
మహిళా లీగ్ కోసం వేలం..
మహిళల ప్రీమియర్ లీగ్ 2024 కోసం వేలం నిర్వహించేందుకూ సన్నాహలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా క్రికెటర్ల కోసం డిసెంబర్ 9న ఆ వేలం ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకూ ఐపీఎల్ లేదా బీసీసీఐ అధికారికంగా స్పందించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల