Pat Cummins: అంతర్జాతీయ క్రికెట్ గుత్తాధిపత్యానికి ఐపీఎల్ ముగింపు పలికింది : ఆసీస్ కెప్టెన్
ఐపీఎల్పై కీలక వ్యాఖ్యలు చేశాడు ఆసీస్(Australia) కెప్టెన్ పాట్ కమిన్స్(Pat Cummins). ఆటలో అది ఏవిధంగా మార్పులు తీసుకువచ్చిందో వివరించాడు.
ఇంటర్నెట్ డెస్క్ : ఐపీఎల్(IPL 2023) ముగియడంతో.. తాజగా డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final) కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. దిగ్గజ జట్లైన ఆస్ట్రేలియా, భారత్(Australia vs India) ఈ టెస్టు మహా సమరంలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆసీస్(Australia) కెప్టెన్ పాట్ కమిన్స్(Pat Cummins).. ఐపీఎల్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో ఐపీఎల్ ఎన్నో మార్పులు తీసుకు వచ్చిందన్నాడు.
ఆటగాళ్ల సమయంపై అంతర్జాతీయ క్రికెట్ గుత్తాధిపత్యానికి ఐపీఎల్ ముగింపు పలికిందని కమిన్స్ పేర్కొన్నాడు. ఫ్రాంఛైజీ క్రికెట్ కంటే.. జాతీయ జట్టు కోసం ప్రధాన్యత ఇచ్చేలా ఆటగాళ్లను ఒప్పించడం సవాల్గా మారనుందని అభిప్రాయపడ్డాడు. లాభదాయక టీ20 లీగ్ల కారణంగానే న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రక్ట్ను కూడా ట్రెంట్ బౌల్ట్ వద్దన్నాడన్న విషయాన్ని కమిన్స్ అంగీకరించాడు. దశాబ్దం క్రితమే ఐపీఎల్ క్రికెట్ రూపురేఖలను మార్చివేసిందని చెప్పాడు.
‘గతంలో ఉన్న మాదిరిగా ఇప్పుడు ఆటగాళ్ల సమయంపై అంతర్జాతీయ క్రికెట్కు గుత్తాధిపత్యం లేదు. దశాబ్దం క్రితమే దీనిని ఐపీఎల్ మార్చివేసింది. దీని గురించి మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక నా జట్టు సహచరులు ఇతర విషయాలకంటే జాతీయ జట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటాను. అయితే, ఎక్కువ లాభదాయకత ఉండే ఫ్రాంఛైజీ లీగ్ల కారణంగా ఇది సవాలుతో కూడుకున్న అంశం’ అని కమిన్స్ పేర్కొన్నాడు.
‘ఆస్ట్రేలియా తరఫున ఆడటం ప్రత్యేకం. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా జాతీయ జట్టుకు ఆడాలి. ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలి. దీని గురించి మనం చాలా లోతుగా ఆలోచించాలి. కొన్నేళ్లు గడిస్తే.. 12 నెలల అంతర్జాతీయ క్యాలెండర్ కొద్దిగా భిన్నంగా కనిపించవచ్చు’ అని కమిన్స్ వివరించాడు. ఇక క్రికెట్ సాకర్ మార్గంలో వెళ్తోందని.. జాతీయ జట్టుకు ఆడేందుకు ఫ్రాంఛైజీల నుంచి అనుమతులు అవసరమయ్యే పరిస్థితులు వస్తాయని తాను నమ్ముతున్నట్లు చెప్పాడు.
ఇక WTC Final కోసం తాను ఎదురుచూస్తున్నట్లు కమిన్స్ చెప్పాడు. గత ఎడిషన్లో ఫైనల్ వరకూ వెళ్లిన ఇండియాతో తాము తలపడబోతున్నామన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.