IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్.. రెండు బెర్తుల కోసం ఐదు టీమ్లు.. ఏ జట్టు పర్సంటేజీ ఎంతంటే?
మెగా లీగ్ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఐదు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు జట్లు ప్లేఆఫ్స్కు చేరాయి. మరో రెండు బెర్తుల కోసం ఐదు జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రెండు టీమ్ల అవకాశాలు దాదాపు ఒక్కశాతం కంటే తక్కువే. మిగిలిన మూడు జట్ల ఛాన్స్లు ఎంత పర్సంటేజీలు ఉన్నాయనేది ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ స్పెషల్గా పోస్టు చేసింది.
- హైదరాబాద్: ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న జట్టు హైదరాబాద్. గతేడాది దారుణమైన ఆట తీరుతో ఇబ్బందిపడిన ఎస్ఆర్హెచ్ సంచలనాలకు వేదికగా మారింది. ఇప్పటివరకు 12 మ్యాచుల్లో 7 విజయాలు సాధించి.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆఖరి రెండు మ్యాచుల్లోనూ గెలిస్తే 18 పాయింట్లు అవుతాయి. గుజరాత్, పంజాబ్తో ఆడాల్సిఉంది. మరోవైపు రాజస్థాన్ (16) తన చివరి రెండు మ్యాచుల్లోనూ ఓడిపోతే సెకండ్ ప్లేస్ ఖాయం. అప్పుడు క్వాలిఫయర్ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ప్లేఆఫ్స్కు చేరుకొనేందుకు ఎస్ఆర్హెచ్కు 87.3 శాతం అవకాశం ఉంది.
చెన్నై: బలమైన రాజస్థాన్ను ఓడించడంతో చెన్నై ప్లేఆఫ్స్ రేసులో కొనసాగుతోంది. తన చివరి మ్యాచ్లో బెంగళూరును ఓడిస్తే ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్లేఆఫ్స్ బెర్తును దక్కించుకుంటుంది. ఒకవేళ ఓడినా.. అవకాశాలు ఉన్నాయి. అవన్నీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం 13 మ్యాచులను ఆడిన సీఎస్కే ఏడు విజయాలు సాధించి 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. నెట్ రన్రేట్ (+0.528) ఎక్కువగా ఉండటం కలిసొచ్చే అంశం. స్టార్స్పోర్ట్స్ లెక్క ప్రకారం చెన్నైకి 72.7 శాతం అవకాశం ఉంది. చివరి మ్యాచ్ బెంగళూరుతోనే కావడంతో ఉత్కంఠ మరింత ఎక్కువగా ఉంది. ఆ జట్టు కూడా ప్లేఆఫ్స్ రేసులో ఉంది.
- బెంగళూరు ఓడితే.. అంతే..: వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడిన జట్టు చివరివరకూ ప్లేఆఫ్స్ రేసులో ఉంటుందని అనుకోగలరా? కానీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఉంది. గత ఐదు మ్యాచుల్లో గెలిచి నాకౌట్ రేసును ఆసక్తికరంగా మార్చింది. ప్రస్తుతం 13 మ్యాచుల్లో ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. చివరి మ్యాచ్ చెన్నైతో తలపడనుంది. ఇందులో ఎవరు గెలిస్తే... వారికే ఎక్కువ ఛాన్స్ ఉంది. అయితే, సీఎస్కేతో పోలిస్తే ఆర్సీబీకి ఓటింగ్లో 39.3 శాతమే వచ్చింది.
- ఒక్క శాతం కంటే తక్కువే: దిల్లీ, లఖ్నవూ జట్లలో ఎవరు ప్లేఆఫ్స్కు వచ్చినా అది సంచలనమే అవుతుంది. దిల్లీ 14 మ్యాచులు ఆడి ఏడు విజయాలు సాధించింది. 14 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. కానీ, ఆర్సీబీ, సీఎస్కే, ఎస్ఆర్హెచ్తోపాటు లఖ్నవూ నుంచీ ఆ జట్టుకు ముప్పు ఉంది. నెట్ రన్రేట్ (-0.377) తక్కువగా ఉండటం డీసీకి ప్రతికూలంగా మారింది. మరోవైపు లఖ్నవూ కూడా భారీ విజయం సాధిస్తేనే ప్లేఆఫ్స్ అవకాశం ఉంటుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం దిల్లీకి 0.7 శాతం, లఖ్నవూకు 0.2 శాతం ఛాన్స్ ఉంది. ఇప్పటికే టోర్నీ నుంచి గుజరాత్, ముంబయి, పంజాబ్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత