IPL 17: మెరుపులు కొన్ని.. తడబాట్లు మరికొన్ని.. ఒక్కో జట్టుది ఒక్కో కథ
ఐపీఎల్ టోర్నీ ముగిసింది. కోల్కతా విజేతగా నిలిచింది. హైదరాబాద్ రన్నరప్తో సరిపెట్టుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు రెండు నెలలపాటు సాగిన ఐపీఎల్ ముగిసింది. కొన్ని జట్లు అంచనాలకు మించి రాణించగా.. మరికొన్ని చివర్లో తడబడ్డాయి. ఇంకొన్ని ఎప్పటిలానే నిరాశపరిచాయి. ఇలా ఒక్కో జట్టుది ఒక్కో కథ. ఏదైతేనేం.. ఈ టోర్నీ కోట్లాది క్రీడాభిమానులకు ఎన్నో మధురానుభూతులను పంచింది.
కోల్‘కథా’ మారింది..
గత కొన్ని సీజన్లుగా పెద్దగా ఆకట్టుకోలేని జట్టు. ఈ టోర్నీకి ముందు పెద్దగా అంచనాలు లేని జట్టు. అయితే.. వరుస విజయాలతో ఫైనల్కు దూసుకొచ్చి కప్ను ఎగరేసుకుపోతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇలా కోల్కతా ‘కథ’ను మార్చిన క్రెడిట్ మాత్రం జట్టును వెనకుండి నడిపించిన మాస్టర్ మైండ్ గంభీర్కే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కెప్టెన్ శ్రేయస్ కూడా బ్యాటింగ్తోపాటు సారథిగానూ కీలక పాత్ర పోషించాడు.
చివరి మెట్టుపై బోల్తా.. హైదరా‘బాధ’
పాయింట్ల పట్టికలో చివరిలో ఉండి గత కొన్ని సీజన్లుగా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన ఎస్ఆర్హెచ్ జట్టుకు ఈసారి దూకుడును తీసుకొచ్చింది కెప్టెన్ పాట్ కమిన్సే. ఓ బలమైన సారథి ఉంటే జట్టు ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో చెప్పడానికి చక్కటి ఉదాహరణ. ఆరంభంలో బీభత్సమైన బ్యాటింగ్తో రికార్డులను తిరగరాస్తూ చెలరేగిన కమిన్స్ సేన.. ఫైనల్స్లో చివరి మెట్టుపై తడబడింది. కప్ గెలవకపోయినా తన ఆటతీరుతో అభిమానుల మనసులు గెలుచుకుంది.
ఆ ‘రాజ’సం ఏది..?
ఎప్పుడో తొలి ఐపీఎల్ టోర్నీని ముద్దాడిన జట్టు అది. ఈసారైన కప్ అందిస్తుందా.. అని అభిమానుల ఎదురుచూపులు.. అందుకు తగ్గట్టే ఆడిన మొదటి 9 మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలతో రాజస్థాన్ రాజసం ప్రదర్శించింది. ఆ తర్వాత వరుస అపజయాలతో చతికిలబడింది. ప్లేఆఫ్స్ చేరినా క్వాలిఫయర్ 2లో ఓటమితో నిష్క్రమించింది.
ఓటములతో డీలాపడి.. ఉవ్వెత్తున ఎగసిపడి..
ఆర్సీబీ ఈసారి ప్లేఆఫ్స్నకు చేరడమే ఓ అద్భుతం. వరుస ఓటములతో డీలాపడిన ఆ జట్టు తిరిగి పుంజుకున్న తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్లే ఆఫ్స్ వరకూ వచ్చినా.. రాజస్థాన్ చేతిలో ఓటమి తప్పలేదు. టోర్నీ మొదట్లో నిరాశపరిచినా.. ఆఖర్లో మాత్రం అభిమానులను ఆకట్టుకుందనే చెప్పాలి.
ధోనీ కోసమే..
ఐదు సార్లు ఛాంపియన్లుగా నిలిచిన చెన్నై ఈ సారి ప్లేఆఫ్స్ చేరనప్పటికీ.. ధోనీ ఆటతీరు ఆ జట్టు అభిమానులను మైమరపించింది. కేవలం మహీని చూడడానికే పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియాలకు తరలివచ్చారు. ఇన్నింగ్స్ చివర్లో వచ్చి అతడు కొట్టిన సిక్స్లు చూసి మురిసిపోయారు.
దిల్లీకి పంత్ బలం..
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషభ్ పంత్.. తిరిగి మైదానంలోకి అడుగుపెడతాడా..? అసలు బ్యాటింగ్ చేస్తాడా..? కీపింగ్ చేయగలుగుతాడా..? ఇలా ఎన్నో అనుమానాలు. అయితే.. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ పంత్.. మునుపటి మెరుపులు మెరిపించాడు. దిల్లీ ఈ సీజన్లో నిరాశపరిచినా ఆ జట్టుకు ప్రధాన ఆకర్షణ పంతే.
లఖ్నవూ ఆ లక్కేది..
గత సీజన్లో అద్భుత ఆటతీరుతో టాప్ 4లో నిలిచిన లఖ్నవూ ఈ సారి తీవ్రంగా నిరాశపరిచిందనే చెప్పాలి. ఆ టీమ్ ఆటతీరు కంటే.. కెప్టెన్కు, జట్టు యజమానికి మధ్య జరిగినే వాదనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గుజరాత్.. మెరుపులేవీ..
ఆడిన తొలి టోర్నీలో కప్ కొట్టి.. ఆ తర్వాత సీజన్లో రన్నరప్గా నిలిచిన జట్టు అది. ఈ సారి అలాంటి ప్రదర్శన చూస్తామని భావించిన అభిమానులను పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచి తీవ్రంగా నిరాశపరిచింది గుజరాత్. కొత్త కెప్టెన్ గిల్ కూడా ఆ జట్టును ముందుకు తీసుకెళ్ల లేకపోయాడు.
వీళ్లు ‘కింగ్స్’ అయ్యేదెప్పుడు..?
ఒక్కసారి కూడా కప్ గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. ఈసారి దీనిపై ఎలాంటి అంచనాలు లేనప్పటికీ.. కొద్దోగొప్పో రాణిస్తుందనుకున్నారు. శిఖర్ ధావన్ గాయంతో వెనుదిరగడం ఆ జట్టుకు పెద్ద లోటు. సామ్ కరన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా.. ఆ జట్టు అదృష్టాన్ని మార్చలేకపోయాడు.
కొంపముంచిన కెప్టెన్సీ మార్పు..
ఈ ఐపీఎల్ సీజన్లో ఏ జట్టుపై జరగని చర్చ ఒక్క ముంబయిపైనే జరిగింది. దీనికి కారణం కెప్టెన్సీ మార్పు. రోహిత్ను కాదని హార్దిక్ పాండ్యకు సారథ్య బాధ్యతలు అప్పగించడం ఆ జట్టుకు కలిసి రాలేదు సరికదా.. టీమ్లో అంతర్గత విభేదాలకు దారి తీసింది. దీంతో ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపం ఏర్పడి.. జట్టు ఫలితాలపైనా ప్రభావం చూపించింది. చివరికి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి