IPL : ఐపీఎల్ టు టీమ్ఇండియా.. ఈసారి వీరికి అవకాశం దక్కేనా..?
ఈ ఐపీఎల్(IPL 2023) సీజన్లో పలువురు అన్క్యాప్డ్ ప్లేయర్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. భవిష్యత్లో టీమ్ఇండియాకు ఎంపికయ్యే అవకాశాలను మెరుగుపరచుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్ : ఐపీఎల్(IPL) క్రికెట్ స్వరూపాన్నే మార్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న ఈ మెగా టోర్నీ.. ఎందరో యువకుల్లోని ప్రతిభను వెలుగులోకి తెచ్చింది. ఇందులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన చాలా మందికి జాతీయ జట్టు(Team India)లోనూ చోటు దక్కింది. గతంలో చెన్నై ఆటగాళ్లు శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్ అలా వచ్చినవారే. ఈ సీజన్లోనూ అలా మంచి ప్రదర్శన ఇస్తూ అందరి దృష్టిలో పడ్డ అన్క్యాప్డ్ ఆటగాళ్లు(uncapped players) ఉన్నారు. భవిష్యత్లో టీమ్ఇండియా జట్టులోకి వచ్చే అవకాశం ఉన్న ఆ ఆటగాళ్లపై ఓ లుక్కేస్తే..
- యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) : ఈ సీజన్లో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి ఆటతీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆదివారం ముంబయితో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఓటమిపాలైనప్పటికీ.. అతడి సెంచరీ (124; 62 బంతుల్లో 16×4, 8×6)యే మ్యాచ్కు హైలైట్గా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటి వరకూ ఓ అన్క్యాప్డ్ ప్లేయర్ నమోదు చేసిన అత్యధిక స్కోరు ఇది. ఇక ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ.. ఆరెంజ్ క్యాప్ రేసులోనూ నిలిచాడు. మే 2 నాటికి 428 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇందులో మూడు అర్థ శతకాలు, ఒక శతకం ఉంది. ఇతడి ప్రతిభను మెచ్చుకున్న పలువురు మాజీలు.. ఈ సీజన్ అనంతరం టీమ్ఇండియాలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొనియాడుతున్నారు.
- రింకు సింగ్ (Rinku Singh) : ఆఖరి ఓవర్లో ఒత్తిడిని అధిగమించి.. వరుసగా ఐదు సిక్స్లు బాది కోల్కతాకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన రింకు అద్భుత ఇన్నింగ్స్ను ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేం. అతడి ఇన్నింగ్స్ చూసిన తర్వాత ఐపీఎల్లో ఏదైనా సాధ్యమే.. చివరి బంతి వరకూ ఓటమిని అంగీకరించకూడదు అనే పరిస్థితి వచ్చింది. ఈ ఒక్క ఇన్నింగ్స్తోనే అందరి దృష్టిలో పడ్డ ఈ ఆటగాడు.. తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. 151 స్ట్రైక్ రేట్తో ఇప్పటి వరకూ ఆడిన 9 మ్యాచ్ల్లో 270 పరుగులు చేశాడు. ఇందులో 19 సిక్స్లు, 15 ఫోర్లు ఉన్నాయి. టీమ్ఇండియా లోయర్ ఆర్డర్లో ఫైర్పవర్ కావాలనుకుంటే.. రింకు ఆ ప్లేస్కు సరిగ్గా సరిపోతాడని విశ్లేషకులు భావిస్తున్నారు.
- తిలక్ వర్మ (Tilak Varma) : ఐపీఎల్ ఆడుతున్న అన్క్యాప్డ్ ప్లేయర్లలో ఎక్కువగా చర్చ జరుగుతున్న ఆటగాళ్లలో మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఒకడు. ముంబయి జట్టులో అతడి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. గత ఏడాది ముంబయి తరఫున అరంగ్రేటం చేశాడు ఈ కుర్రాడు. 2022వ సీజన్లో పేలవ ప్రదర్శనతో ముంబయి తీవ్రంగా నిరాశపర్చినప్పటికీ.. ఆ జట్టులో తిలక్ మంచి ప్రదర్శనతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆడిన తొలి సీజన్లో మొత్తం 397 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఈ సీజన్లోనూ ముంబయికి కీలక బ్యాటర్గా మారాడు. ఈ ఏడాది ఆడిన తొలి మ్యాచ్లోనే 84 పరుగులతో బెంగళూరుపై విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకూ 8 మ్యాచ్లు ఆడి మొత్తం 248 పరుగులు చేశాడు. అతడి హార్డ్ హిట్టింగ్ పవర్ టీమ్ఇండియాకు పనికివస్తుందని పలువురు భావిస్తున్నారు.
- తుషార్ దేశ్పాండే (Tushar Deshpande): ఈ జాబితాలో ఉన్న ఏకైక బౌలర్ దేశ్పాండేనే. ఈ చెన్నై బౌలర్ ఈ సీజన్లో రాణిస్తున్నాడు. ఇప్పటి వరకూ 9 మ్యాచ్లు ఆడి 17 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేస్లోనూ నిలిచాడు. అప్పడప్పుడూ ఎక్స్పెన్సివ్గా మారుతున్నా.. ధోనీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ధోనీ సారథ్యంలో మరింత మెరుగవుతున్నాడు.
- సాయి సుదర్శన్ (Sai Sudharsan) : గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ ఈ సీజన్లో ఇప్పటి వరకూ 5 మ్యాచ్లు ఆడి 176 పరుగులు చేశాడు. అతడి ఆటతీరుపై పలువురు ప్రంశంసలు కురిపిస్తున్నారు. భవిష్యత్లో సాయి.. టీమ్ఇండియాలో భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ జట్టు సారథి హార్దిక్ పాండ్య కూడా మెచ్చుకున్నాడు.
వీరే కాకుండా కోల్కతా మిస్టరీ స్పిన్నర్ సుయాశ్ శర్మ, సన్రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఇక చెన్నై స్టార్ ఓపెనర్ రుత్రాజ్ గైక్వాడ్, శివమ్ దూబే లాంటి ఆటగాళ్లు ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. గతంలో వీరు టీమ్ఇండియాకు ఆడినవారే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్