Dinesh Karthik: పంతా..? కార్తీకా..? టీ20 ప్రపంచకప్లో ఎవరు?
ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక టీమ్ఇండియాలో సరైన ఫినిషర్ ఎవరనే విషయంపై సందిగ్ధత నెలకొంది. రిషభ్ పంత్ ఆ సమయంలో టెస్టుల్లో పలు అద్భుతమైన ప్రదర్శనలు చేయడంతో...
ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక టీమ్ఇండియాలో సరైన ఫినిషర్ ఎవరనే విషయంపై సందిగ్ధత నెలకొంది. రిషభ్ పంత్ ఆ సమయంలో టెస్టుల్లో పలు అద్భుతమైన ప్రదర్శనలు చేయడంతో ఆ లోటును భర్తీ చేశాడని అంతా అనుకున్నారు. నిజంగానే అతడు సుదీర్ఘ ఫార్మాట్లో అదరగొట్టాడు కూడా. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ పొట్టి ఫార్మాట్లోనే ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. పంత్ ఇప్పటిదాకా అంతర్జాతీయ టీ20ల్లో టీమ్ఇండియా తరఫున తనదైన ముద్ర వేయలేకపోయాడు.
అభిమానులు ఎవరివైపు?
భారత జట్టు మిడిల్ ఆర్డర్ వైఫల్యమే కొన్నాళ్లుగా కీలకపోరుల్లో ఓటములకు ప్రధాన కారణంగా మారింది. గతేడాది టీ20 ప్రపంచకప్లోనూ ఇదే విషయం స్పష్టమైంది. దీంతో సరైన ఫినిషర్ దొరికితే తప్ప ఐసీసీ టోర్నీల్లో జట్టు కష్టాలు తొలగిపోయేలా కనిపించడం లేదు. అయితే, ఇటీవల భారత టీ20 లీగ్ 15వ సీజన్లో దినేశ్ కార్తీక్ బెంగళూరు తరఫున ఫినిషర్గా అద్భుత పాత్ర పోషించాడు. దీంతో దక్షిణాఫ్రికాతో పాటు ఐర్లాండ్ పర్యటలోనూ రెండు టీ20ల సిరీస్కు ఎంపికయ్యాడు. మరోవైపు పంత్ టీ20 లీగ్లో అంతగా మెరవకపోవడం.. తాజా సిరీస్లో బ్యాట్స్మెన్గా విఫలమవ్వడం అభిమానులను కలవరపెడుతోంది. దీంతో రాబోయే టీ20 ప్రపంచకప్లో అతడి కన్నా డీకేకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిస్తున్నారు.
డీకే పరిస్థితి ఎలా ఉంది?
దినేశ్ కార్తీక్ 2006 డిసెంబర్లో టీమ్ఇండియా తరఫున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ అతడు ఆడింది కేవలం 36 మ్యాచ్లే. ధోనీ రాకతో డీకేకు అవకాశాలు తగ్గాయి. దీంతో అడపాదడపా అవకాశాలు వచ్చినా వాటిని పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే, 2018లో నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో చివర్లో బంగ్లాదేశ్పై సంచలన బ్యాటింగ్ చేసి ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. దాంతో 2019 వన్డే ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ, ఆ సిరీస్లో కూడా పెద్దగా అవకాశాలు రాకపోయినా సెమీ ఫైనల్ లాంటి కీలకపోరులో జట్టు అవకాశం ఇచ్చింది. కానీ, టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలినట్టే డీకే కూడా విఫలమయ్యాడు. దీంతో జట్టులో కనుమరుగయ్యాడు. ఇప్పుడు అనూహ్యంగా రెచ్చిపోతూ మళ్లీ రాబోయే ప్రపంచకప్పై ఆశలు పెంచుతున్నాడు.
డీకే గణాంకాలు ఎలా ఉన్నాయి?
ఇక దినేశ్ కార్తీక్ టీ20 గణాంకాల విషయానికొస్తే అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఆడింది తక్కువ మ్యాచ్లే. దాంతో చేసిన పరుగులు 491 కూడా తక్కువగానే ఉన్నాయి. అయితే, సగటు 35.07గా నమోదవ్వగా.. స్ట్రైక్రేట్ 146.13 సాధించాడు. మొన్ననే తొలి అర్థశతకం సాధించి టీమ్ఇండియా తరఫున అత్యధిక వయసులో ఈ ఘనత సాధించిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. అలాగే భారత టీ20 లీగ్లో ఈ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన డీకే 330 పరుగులు చేశాడు. సగటు 55 కాగా, స్ట్రైక్రేట్ 183.33గా నమోదైంది. అలాగే తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్లోనూ 46 సగటుతో 158 స్ట్రైక్రేట్తో దంచికొడుతున్నాడు. దీన్నిబట్టే అతడు ఇప్పుడెలా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఛేదనల్లో అతడి సగటు 65.25గా చాలా మెరుగ్గా ఉంది. ఇవి మాత్రమే కాకుండా బెంగళూరు తరఫున వికెట్ కీపర్గానూ ఆకట్టుకున్నాడు.
పంత్ పరిస్థితి ఏంటి?
పంత్ టీమ్ఇండియా తరఫున 2017లో టీ20 క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 47 మ్యాచ్లు ఆడి 740 పరుగులే చేశాడు. ధనాధన్ బ్యాటింగ్ చేయగల అతడు కేవలం 3 అర్ధశతకాలే సాధించాడు. అత్యధిక స్కోర్ 65 నాటౌట్. సగటు 23.12, స్ట్రైక్రేట్ 123.95గా ఉన్నాయి. ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్లో నాలుగు మ్యాచ్లు ఆడినా ఒక్కదాంట్లోనూ మెరిసింది లేదు. పేలవ షాట్లతో అనసవరంగా వికెట్ కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఈ సిరీస్లో మొత్తం 57 పరుగులే చేసిన అతడు 14.25 సగటు, 105.59 స్ట్రైక్రేట్తో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో టీ20 క్రికెట్లో పంత్ ఇంకా తనదైన ముద్రవేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. అతడి ఆటలో నిలకడలేమే ప్రధానంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చూసినా పంత్ కన్నా డీకేనే మెరుగ్గా ఉన్నాడు.
మాజీలు ఏమంటున్నారు?
అయితే, ఇటీవల దినేశ్ కార్తీక్ ఆటతీరు చూసిన పలువురు మాజీలు అతడు కచ్చితంగా ప్రపంచకప్లో ఉండాలని అంటున్నారు. దిగ్గజ బ్యాట్స్మన్ సునీల్ గావస్కర్ డీకే కచ్చితంగా మెల్బోర్న్కు వెళ్లే టీమ్ఇండియా విమానంలో ఉండాలన్నాడు. లేకపోతే తనకు పెద్ద ఆశ్చర్యం కలుగుతుందని చెప్పాడు. అలాగే పార్థీవ్ పటేల్ ఇటీవల ఓ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ డీకే లాంటి అనుభవజ్ఞుడికి బౌలింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థి బౌలర్లు తప్పులు చేస్తారని అన్నాడు. అంటే అతడి బ్యాటింగ్ శైలి ఎలా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక పాక్ మాజీ కీపర్ రషీద్ లతీఫ్ సైతం డీకే బ్యాటింగ్ తీరును మెచ్చుకుంటున్నాడు. టీ20 లీగ్లో బెంగళూరు తరఫున అదరగొట్టిన అతడు ఫినిషర్గా మంచి పేరు తెచ్చుకున్నాడని కితాబిచ్చాడు. ప్రపంచంలో చాలా కొద్ది మంది వికెట్ కీపర్లే ఇలాంటి స్థానాల్లో రాణిస్తారని అభిప్రాయపడ్డాడు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే కచ్చితంగా డీకే ప్రపంచకప్లో ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఐర్లాండ్ పర్యటన తర్వాత టీమ్ఇండియాకు ఇంగ్లాండ్, వెస్టిండీస్లతో టీ20 మ్యాచ్లు ఉన్నాయి. వాటిల్లోనైనా పంత్ సత్తా చాటుతాడో లేదో చూడాలి.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం