Dinesh Karthik: పంతా..? కార్తీకా..? టీ20 ప్రపంచకప్లో ఎవరు?
ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక టీమ్ఇండియాలో సరైన ఫినిషర్ ఎవరనే విషయంపై సందిగ్ధత నెలకొంది. రిషభ్ పంత్ ఆ సమయంలో టెస్టుల్లో పలు అద్భుతమైన ప్రదర్శనలు చేయడంతో...
ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక టీమ్ఇండియాలో సరైన ఫినిషర్ ఎవరనే విషయంపై సందిగ్ధత నెలకొంది. రిషభ్ పంత్ ఆ సమయంలో టెస్టుల్లో పలు అద్భుతమైన ప్రదర్శనలు చేయడంతో ఆ లోటును భర్తీ చేశాడని అంతా అనుకున్నారు. నిజంగానే అతడు సుదీర్ఘ ఫార్మాట్లో అదరగొట్టాడు కూడా. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ పొట్టి ఫార్మాట్లోనే ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. పంత్ ఇప్పటిదాకా అంతర్జాతీయ టీ20ల్లో టీమ్ఇండియా తరఫున తనదైన ముద్ర వేయలేకపోయాడు.
అభిమానులు ఎవరివైపు?
భారత జట్టు మిడిల్ ఆర్డర్ వైఫల్యమే కొన్నాళ్లుగా కీలకపోరుల్లో ఓటములకు ప్రధాన కారణంగా మారింది. గతేడాది టీ20 ప్రపంచకప్లోనూ ఇదే విషయం స్పష్టమైంది. దీంతో సరైన ఫినిషర్ దొరికితే తప్ప ఐసీసీ టోర్నీల్లో జట్టు కష్టాలు తొలగిపోయేలా కనిపించడం లేదు. అయితే, ఇటీవల భారత టీ20 లీగ్ 15వ సీజన్లో దినేశ్ కార్తీక్ బెంగళూరు తరఫున ఫినిషర్గా అద్భుత పాత్ర పోషించాడు. దీంతో దక్షిణాఫ్రికాతో పాటు ఐర్లాండ్ పర్యటలోనూ రెండు టీ20ల సిరీస్కు ఎంపికయ్యాడు. మరోవైపు పంత్ టీ20 లీగ్లో అంతగా మెరవకపోవడం.. తాజా సిరీస్లో బ్యాట్స్మెన్గా విఫలమవ్వడం అభిమానులను కలవరపెడుతోంది. దీంతో రాబోయే టీ20 ప్రపంచకప్లో అతడి కన్నా డీకేకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిస్తున్నారు.
డీకే పరిస్థితి ఎలా ఉంది?
దినేశ్ కార్తీక్ 2006 డిసెంబర్లో టీమ్ఇండియా తరఫున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ అతడు ఆడింది కేవలం 36 మ్యాచ్లే. ధోనీ రాకతో డీకేకు అవకాశాలు తగ్గాయి. దీంతో అడపాదడపా అవకాశాలు వచ్చినా వాటిని పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే, 2018లో నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో చివర్లో బంగ్లాదేశ్పై సంచలన బ్యాటింగ్ చేసి ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. దాంతో 2019 వన్డే ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ, ఆ సిరీస్లో కూడా పెద్దగా అవకాశాలు రాకపోయినా సెమీ ఫైనల్ లాంటి కీలకపోరులో జట్టు అవకాశం ఇచ్చింది. కానీ, టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలినట్టే డీకే కూడా విఫలమయ్యాడు. దీంతో జట్టులో కనుమరుగయ్యాడు. ఇప్పుడు అనూహ్యంగా రెచ్చిపోతూ మళ్లీ రాబోయే ప్రపంచకప్పై ఆశలు పెంచుతున్నాడు.
డీకే గణాంకాలు ఎలా ఉన్నాయి?
ఇక దినేశ్ కార్తీక్ టీ20 గణాంకాల విషయానికొస్తే అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఆడింది తక్కువ మ్యాచ్లే. దాంతో చేసిన పరుగులు 491 కూడా తక్కువగానే ఉన్నాయి. అయితే, సగటు 35.07గా నమోదవ్వగా.. స్ట్రైక్రేట్ 146.13 సాధించాడు. మొన్ననే తొలి అర్థశతకం సాధించి టీమ్ఇండియా తరఫున అత్యధిక వయసులో ఈ ఘనత సాధించిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. అలాగే భారత టీ20 లీగ్లో ఈ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన డీకే 330 పరుగులు చేశాడు. సగటు 55 కాగా, స్ట్రైక్రేట్ 183.33గా నమోదైంది. అలాగే తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్లోనూ 46 సగటుతో 158 స్ట్రైక్రేట్తో దంచికొడుతున్నాడు. దీన్నిబట్టే అతడు ఇప్పుడెలా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఛేదనల్లో అతడి సగటు 65.25గా చాలా మెరుగ్గా ఉంది. ఇవి మాత్రమే కాకుండా బెంగళూరు తరఫున వికెట్ కీపర్గానూ ఆకట్టుకున్నాడు.
పంత్ పరిస్థితి ఏంటి?
పంత్ టీమ్ఇండియా తరఫున 2017లో టీ20 క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 47 మ్యాచ్లు ఆడి 740 పరుగులే చేశాడు. ధనాధన్ బ్యాటింగ్ చేయగల అతడు కేవలం 3 అర్ధశతకాలే సాధించాడు. అత్యధిక స్కోర్ 65 నాటౌట్. సగటు 23.12, స్ట్రైక్రేట్ 123.95గా ఉన్నాయి. ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్లో నాలుగు మ్యాచ్లు ఆడినా ఒక్కదాంట్లోనూ మెరిసింది లేదు. పేలవ షాట్లతో అనసవరంగా వికెట్ కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఈ సిరీస్లో మొత్తం 57 పరుగులే చేసిన అతడు 14.25 సగటు, 105.59 స్ట్రైక్రేట్తో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో టీ20 క్రికెట్లో పంత్ ఇంకా తనదైన ముద్రవేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. అతడి ఆటలో నిలకడలేమే ప్రధానంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చూసినా పంత్ కన్నా డీకేనే మెరుగ్గా ఉన్నాడు.
మాజీలు ఏమంటున్నారు?
అయితే, ఇటీవల దినేశ్ కార్తీక్ ఆటతీరు చూసిన పలువురు మాజీలు అతడు కచ్చితంగా ప్రపంచకప్లో ఉండాలని అంటున్నారు. దిగ్గజ బ్యాట్స్మన్ సునీల్ గావస్కర్ డీకే కచ్చితంగా మెల్బోర్న్కు వెళ్లే టీమ్ఇండియా విమానంలో ఉండాలన్నాడు. లేకపోతే తనకు పెద్ద ఆశ్చర్యం కలుగుతుందని చెప్పాడు. అలాగే పార్థీవ్ పటేల్ ఇటీవల ఓ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ డీకే లాంటి అనుభవజ్ఞుడికి బౌలింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థి బౌలర్లు తప్పులు చేస్తారని అన్నాడు. అంటే అతడి బ్యాటింగ్ శైలి ఎలా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక పాక్ మాజీ కీపర్ రషీద్ లతీఫ్ సైతం డీకే బ్యాటింగ్ తీరును మెచ్చుకుంటున్నాడు. టీ20 లీగ్లో బెంగళూరు తరఫున అదరగొట్టిన అతడు ఫినిషర్గా మంచి పేరు తెచ్చుకున్నాడని కితాబిచ్చాడు. ప్రపంచంలో చాలా కొద్ది మంది వికెట్ కీపర్లే ఇలాంటి స్థానాల్లో రాణిస్తారని అభిప్రాయపడ్డాడు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే కచ్చితంగా డీకే ప్రపంచకప్లో ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఐర్లాండ్ పర్యటన తర్వాత టీమ్ఇండియాకు ఇంగ్లాండ్, వెస్టిండీస్లతో టీ20 మ్యాచ్లు ఉన్నాయి. వాటిల్లోనైనా పంత్ సత్తా చాటుతాడో లేదో చూడాలి.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్