IND vs ENG: అండర్సన్ vs కోహ్లీ.. ఇదే చివరి పోరా?
అతడు పరుగుల రారాజు అయితే, ఇతడు వికెట్ల వీరుడు. అతడు చూడచక్కని డ్రైవ్ షాట్లు ఆడితే.. ఇతడు బెంబేలెత్తించే బంతులేస్తాడు...
అతడు పరుగుల రారాజు అయితే.. ఇతడు వికెట్ల వీరుడు. అతడు చూడచక్కని డ్రైవ్ షాట్లు ఆడితే.. ఇతడు బెంబేలెత్తించే బంతులేస్తాడు. అతడు టీమ్ఇండియా బ్యాటింగ్కు వెన్నెముకలా నిలిస్తే.. ఇతడు ఇంగ్లాండ్ బౌలింగ్కే వన్నె తెస్తాడు. వాళ్లిద్దరే విరాట్ కోహ్లీ, జేమ్స్ అండర్సన్. దశాబ్దకాలంగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తుండగా.. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరూ తలపడేది ఇదే చివరి మ్యాచ్ అయ్యేలా కనిపిస్తోంది. దీంతో ఇప్పటివరకు ఎవరి ఆధిపత్యం ఎలా సాగిందో ఓ లుక్కేద్దాం.
ఆరంభమైందిలా..
తొలిసారి విరాట్, అండర్సన్ టెస్టుల్లో పోటీ పడింది 2012లో. అప్పుడు ఇంగ్లాండ్ భారత పర్యటనకు వచ్చినప్పుడు తొలిసారి అండర్సన్ కింగ్ కోహ్లీని ఔట్ చేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ (6) పరుగులకే పెవిలియన్ చేరాడు. అండర్సన్ వేసిన బంతి బ్యాట్ అంచున తాకుతూ వెళ్లి స్లిప్లో ఉన్న గ్రేమ్ శ్వాన్ చేతుల్లో పడింది. ఔట్సైడ్ స్వింగ్ వేసిన బంతితో ఇంగ్లాండ్ పేసర్ బోల్తా కొట్టించాడు. అప్పటి నుంచి మొదలైంది ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు. ఇది జరిగి దశాబ్దకాలం కావస్తున్నా ఇంకా కొనసాగుతోంది.
అండర్సన్ చావుదెబ్బ..
కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చాక తొలిసారి విఫలమైంది 2014 ఇంగ్లాండ్ పర్యటనలో. ఆ సిరీస్లో మొత్తం 5 మ్యాచ్లు ఆడిన అతడు కేవలం 134 పరుగులే చేశాడు. ఒక్క అర్ధ శతకం కూడా చేయలేకపోయాడు. ఆ పర్యటనలో మానసికంగానూ కుంగిపోయాడు. మరీ ముఖ్యంగా అండర్సన్ బౌలింగ్లో నాలుగు సార్లు పెవిలియన్ చేరడం చర్చనీయాంశమైంది. అన్నీ ఔట్సైడ్ ఎడ్జ్ బంతులకే ఔటవ్వడం మరింత గమనార్హం. పేస్ బౌలింగ్కు అనుకూలించే పిచ్లపై అండర్సన్ ఔట్ స్వింగర్ బంతులేసి విరాట్పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించాడు. దీంతో ఈ సిరీస్ కోహ్లీ కెరీర్లోనే ఓ పీడకలలా మారిపోయింది. తర్వాత దాన్నుంచి బయటపడటానికి బాగానే కష్టపడ్డాడు.
విరాట్ విశ్వరూపం..
అయితే, ఇంగ్లాండ్తో తర్వాత జరిగిన రెండు సిరీస్ల్లోనూ విరాట్.. అండర్సన్కు వికెట్ ఇవ్వకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. 2014లో తన వైఫల్యాల నుంచి మంచి పాఠాలే నేర్చుకున్న అతడు.. ఇంగ్లాండ్ పేసర్ను ఎలా ఎదుర్కోవాలనేదానిపైనా ప్రత్యేక దృష్టిసారించాడు. దీంతో 2016 ఆ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు విరాట్ రెచ్చిపోయాడు. ఆ సిరీస్లో ఒక శతకం, ఒక ద్విశతకంతో మొత్తం 655 పరుగులు చేశాడు. అలాగే 2018లో టీమ్ఇండియా ఇంగ్లాండ్కు వెళ్లినప్పుడు రెండు శతకాలతో మొత్తం 593 పరుగులు చేశాడు. ఈ రెండు సిరీస్ల్లోనూ మొత్తం కలిపి 10 మ్యాచ్లు జరగ్గా.. అండర్సన్ 8 మ్యాచ్లు ఆడాడు. అయినా, ఒక్కసారి కూడా విరాట్ను ఔట్ చేయలేకపోయాడు.
కోహ్లీకి అవకాశం..
ఇక గతేడాది ఇదే సిరీస్లో నాలుగు మ్యాచ్లు ఆడిన ఇద్దరూ చెరి సమానంగా నిలిచినట్లు అనిపించింది. అప్పటికే కోహ్లీ ఫామ్లో లేకపోయినా ఇంగ్లాండ్ గడ్డపై రెండు అర్ధశతకాలతో నామమాత్రంగానైనా రాణించాడు. అయితే, అండర్సన్.. తొలి, మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ల్లో రెండుసార్లు పెవిలియన్కు పంపాడు. మొత్తంగా ఈ సిరీస్లో విరాట్ 218 పరుగులు చేశాడు. ఇక ఇప్పుడు జరిగే ఐదో టెస్టులో ఎవరు పైచేయి సాధిస్తారన్నదే ఆసక్తిగా మారింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే కోహ్లీ చివరిసారి ఇదే ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో శతకంతో మెరిశాడు. 2018లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో.. కోహ్లీ తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్లో 51 పరుగులు చేశాడు. దీంతో మొత్తంగా 200 పరుగులు చేశాడు. దీంతో అది కోహ్లీకి సానుకూల విషయంగా మారింది. ఇప్పుడు అలాంటి ప్రదర్శన పునరావృతం చేస్తే అభిమానులకు కనులపండగే.
ఇద్దరూ ఇప్పుడెలా ఉన్నారు..
సహజంగా ఏ టెస్టు సిరీస్కైనా ఆయా జట్ల అభిమానులు ఏ ఇద్దరి ఆటగాళ్ల మధ్య ఆధిపత్య పోరు బాగుంటుందనే విషయంపై చర్చిస్తారు. అలాగే ఇప్పుడు కూడా కోహ్లీ, అండర్సన్ల పోరు ఎలా ఉంటుందనే విషయంపై మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఇంగ్లాండ్ పేసర్ వయసు 39 ఏళ్లు ఉండగా.. కోహ్లీ వయసు 33. అయితే, అండర్సన్ ఇప్పటికీ వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్ తరఫున రాణిస్తున్నాడు. కాకపోతే ఈ మధ్య పనిభారం తగ్గించుకునేందుకు మధ్యలో విరామాలు తీసుకుంటున్నాడు. మరోవైపు కోహ్లీ ప్రస్తుతం ఫామ్లో లేకున్నా వయసు రీత్యా ఇంకొంత కాలం క్రికెట్ ఆడే సత్తా ఉంది. కానీ.. ఈ మ్యాచ్ తర్వాత టీమ్ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మరో టెస్టు సిరీస్ జరగాలంటే చాలా సమయం పడుతుంది. అప్పటికి అండర్సన్ ఫిట్నెస్తో ఉండి జట్టులో కొనసాగడం దాదాపు అసాధ్యం. దీంతో విరాట్ కోహ్లీతో అతడికి ఇదే చివరి టెస్టు కానుందని స్పష్టంగా అర్థమవుతోంది.
అండర్సన్ బౌలింగ్లో కోహ్లీ గణాంకాలు..
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ