Ishan Kishan: ఇషాన్ కిషన్కు షాక్ తప్పదా? ఈ యువ ఆటగాడికి ఏమైంది?
టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan)ను త్వరలో అఫ్గానిస్థాన్తో జరిగే మూడు టీ20ల సిరీస్కు ఎంపిక చేయలేదు.
ఐపీఎల్లో ధనాధన్ ఇన్నింగ్స్లతో వెలుగులోకి వచ్చిన ఆ యువ ఆటగాడు.. ఆరంభంలో జాతీయ జట్టులోనూ నిలకడ ప్రదర్శించాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో పంత్ జట్టుకు దూరం కావడంతో.. ఈ ఆటగాడే జట్టులో వికెట్ కీపర్గా కొనసాగాడు. కానీ నిలకడ లేమి, మానసిక ఆందోళనతో వెనుకబడ్డాడు. ఇప్పుడు జట్టుకే దూరమై.. టీ20 ప్రపంచకప్లో ఆడే అవకాశాన్ని చేజార్చుకునేలా కనిపిస్తున్నాడు. ఆ ఆటగాడే ఇషాన్ కిషన్ (Ishan Kishan). ఈ ఏడాది జూన్ 1 ఆరంభమయ్యే పొట్టి ప్రపంచకప్నకు ముందు టీమ్ఇండియా (Team India) చివరిగా అఫ్గానిస్థాన్తో ఆడే టీ20 సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో ఇషాన్కు చోటు దక్కలేదు. మరి ఈ ఆటగాడికి ఏమైంది? జట్టులో పోటీని తట్టుకోలేకపోతున్నాడా?
మానసిక ఆందోళన
టీమ్ఇండియాలో చోటు కోసం ప్రస్తుతం తీవ్రమైన పోటీ ఉంది. ఒక్కో స్థానం కోసం ఇద్దరు ముగ్గురు యువ ఆటగాళ్లు రేసులో ఉన్నారు. ఇషాన్ కిషన్ మాత్రం నిలకడ లేమితో.. జట్టులోకి వస్తూ, వెళ్తూ ఉన్నాడు. దీంతో తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. జట్టుతో కొనసాగుతున్నప్పటికీ ఫైనల్ ఎలెవన్లో చోటు దక్కకపోవడం అతడిని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. నిరుడు వన్డే ప్రపంచకప్లో గిల్ అనారోగ్యం కారణంగా ఇషాన్ తొలి రెండు మ్యాచ్ల్లో ఆడాడు. కానీ ఆ తర్వాత గిల్ రావడంతో.. అతడు బెంచ్కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో అయిదు టీ20ల సిరీస్లో మూడు మ్యాచ్లాడాడు. చివరి రెండు మ్యాచ్లకు జితేశ్కు అవకాశం కల్పించడంతో ఇషాన్ బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కూ అతడిని ఆడించలేదు. దక్షిణాఫ్రికాతో టెస్టులకు కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా ఆడతాడని తెలియడంతో ఇషాన్ మరింత కలత చెందినట్లు తెలిసింది. దీంతో ఆ సిరీస్కు ముందే వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చేశాడు. అప్పటి నుంచి ఆటకు విరామం తీసుకుని, వెకేషన్లో ఉన్నాడు. రంజీ ట్రోఫీలో కూడా ఆడటం లేదు. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్తో సిరీస్ సెలక్షన్కు అతను అందుబాటులో లేడని సమాచారం.
తీవ్రమైన పోటీ
అఫ్గానిస్థాన్తో సిరీస్ కోసం 16 మంది ఆటగాళ్లతో టీమ్ఇండియాను ఎంపిక చేశారు. రోహిత్, యశస్వి, శుభ్మన్లో ఇద్దరు ఓపెనర్లుగా ఆడతారు. దీంతో ఓపెనర్గా ఆడే అవకాశం ఇషాన్కు లేదు. ఇక మూడో స్థానంలో కోహ్లి ఆడతాడు. దీంతో ఆస్ట్రేలియాతో సిరీస్తో ఆ స్థానంలో ఆడిన ఇషాన్కు ఇక్కడ ఖాళీ లేదు. మిడిలార్డర్లో ఆడతారనే కారణంతో వికెట్ కీపర్లుగా జితేశ్ శర్మ, సంజు శాంసన్ను తీసుకున్నారు.
‘‘జట్టులో జితేశ్, శాంసన్ వికెట్ కీపర్లుగా ఉన్నారు. గత రెండు సిరీస్ల్లో శాంసన్ వికెట్ కీపింగ్ చేయలేదు. అప్పుడు ఇషాన్ వికెట్ కీపర్గా ఆడాడు. కానీ ఇప్పుడు అతను జట్టులో లేడు. కారణమేంటో ఎవరికీ తెలియదు. ఓపెనింగ్ స్థానాల్లో ఖాళీ లేదు. కోహ్లి నాలుగులో కాకుండా మూడులో ఆడతాడు. కాబట్టి వికెట్ కీపర్ మిడిలార్డర్లో ఆడాల్సి వస్తుంది. అలాంటి ఆటగాళ్లు కాబట్టే జితేశ్, శాంసన్ జట్టులో ఉన్నారు’’ అని టీమ్ఇండియా మాజీ బ్యాటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
ఇక కష్టమే
‘‘మ్యాచ్లు ఆడే అవకాశం లేకుండానే జట్టుతో ప్రయాణించడం వల్ల ఇషాన్ సంతోషంగా లేడు. ప్రస్తుతం అతను విరామం తీసుకున్నాడు. వెకేషన్లో ఉన్నాడు. అయినా సెలక్టర్లు ఇషాన్ను దాటి చూస్తున్నారు. కేఎస్ భరత్ ఉండగా ఇంగ్లాండ్తో అయిదు టెస్టుల సిరీస్కు ఇషాన్ను ఎంపిక చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ అనే కాదు సమీప భవిష్యత్లో మూడు ఫార్మాట్లలోనూ ఇషాన్ జట్టులోకి రావడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు వన్డేలతో పాటు టెస్టుల్లోనూ కేఎల్ రాహుల్ వికెట్కీపర్ బ్యాటర్గా ఉన్నాడు. టీ20ల్లో జితేశ్ వైపు చూస్తున్నారు. పంత్ కోలుకుని వస్తే అప్పుడు అతనే వికెట్ కీపర్ అవుతాడు. దీంతో 25 ఏళ్ల ఇషాన్ కెరీర్ ఇప్పుడే ప్రమాదంలో పడిందనే చెప్పాలి. ఇప్పటివరకూ టీమ్ఇండియా తరపున 32 టీ20లు ఆడిన అతను 25.67 సగటుతో 796 పరుగులు మాత్రమే చేశాడు. గత 10 ఇన్నింగ్స్లో అయితే కేవలం 17 సగటుతో 170 పరుగులే సాధించాడు. తిరిగి పుంజుకుని, జట్టులోకి వచ్చేందుకు ఐపీఎల్ రూపంలో ఇషాన్కు అవకాశం ఉంది. మరి మార్చిలో ఆరంభమయ్యే ఈ లీగ్ అతని కెరీర్కు అత్యంత కీలకమైందనే చెప్పాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత