Ishan Kishan: హార్దిక్కు సవాళ్లంటే ఇష్టం.. ప్రేక్షకులు హేళన చేయడంపై ఇషాన్ కిషన్
హార్దిక్ పాండ్యతో (Hardik Pandya) కలిసి ఐపీఎల్కు ముందు నుంచే ఇషాన్ కిషన్ సాధన చేసిన సంగతి తెలిసిందే. అతడి మెంటాలిటీపై పూర్తి అవగాహన ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ముంబయి జట్టు సారథిగా ప్రస్తుత ఐపీఎల్లో తొలి మ్యాచ్ నుంచి ప్రేక్షకుల నుంచి హేళనలను హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఎదుర్కొంటున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగానూ ఇలాంటి తప్పడం లేదు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆడిన సమయంలోనూ పాండ్యను ఉద్దేశించి దారుణంగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా బెంగళూరుతో మ్యాచ్లోనూ హార్దిక్ను హేళన చేయడంపై విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా స్పందించాడు. అలాంటివి సరికాదని ఫ్యాన్స్కు విజ్ఞప్తి చేశాడు. ఆ సంఘటలనపై ముంబయి బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ప్రెస్ కాన్ఫరెన్స్లో స్పందించాడు. బెంగళూరుపై ఇషాన్ 34 బంతుల్లో 69 పరుగులు చేశాడు.
‘‘హార్దిక్ పాండ్య మైదానంలో, వెలుపలా నిరంతరం శ్రమిస్తుంటాడు. ప్రేక్షకుల నుంచి వచ్చే వ్యాఖ్యలను పట్టించుకోడు. అతడికి సవాళ్లంటే చాలా ఇష్టం. ఇలాంటి పరిస్థితిని గతంలోనూ అనుభవించాడు. వాటిపై బయటకొచ్చి స్పందించే రకం కాదు. తప్పకుండా అతడూ దీనిని ఆస్వాదిస్తుంటాడు. ఐపీఎల్ సందర్భంగా పాండ్యతో చాలా సమయం గడుపుతున్నా. అభిమానుల మీద ఫిర్యాదు చేసే రకం కాదు. తప్పకుండా వారిలోనూ మార్పు వస్తుందని భావిస్తున్నా. రానున్న మ్యాచుల్లో బ్యాట్, బాల్తో అభిమానులను ఆకట్టుకుంటాడు’’ అని ఇషాన్ తెలిపాడు.
నెట్రన్రేట్ అత్యంత కీలకం: హార్దిక్ పాండ్య
బెంగళూరుపై విజయం సాధించడంలో బుమ్రాతోపాటు టాప్ ఆర్డర్దే కీలక పాత్ర అని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. ‘‘వరుసగా రెండో విజయం నమోదు చేయడం బాగుంది. మళ్లీ మేము రేసులోకి వచ్చాం. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల అదనంగా బౌలర్ లేదా బ్యాటర్ను తీసుకొనే వెసులుబాటు కలిగింది. రోహిత్-ఇషాన్ కిషన్ శుభారంభం ఇవ్వడంతో మిగిలిన పని తేలికైంది. నెట్రన్రేట్ అత్యంత కీలకం. దీంతో సూర్య కుమార్ యాదవ్తో కలిసి దూకుడుగా ఆడాను. ఈ సీజన్లో అతడు ఆడిన తొలి మ్యాచ్లో డకౌట్గా వెనుదిరిగాడు. అయితే, ఇప్పుడు అద్భుతమైన అర్ధశతకంతో ఫామ్లోకి వచ్చాడు. బౌలింగ్లో మా వైపు బుమ్రా ఉండటం సగం బలం. ప్రతి ఓవర్లోనూ వైవిధ్యం ప్రదర్శించడం అతడి స్పెషల్’’ అని హార్దిక్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ