Afghanistan: అప్పుడలా కనుమరుగై.. ఇప్పుడిలా తెరపైకి
అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గానిస్థాన్ ఆటగాళ్లు చాలా ఏళ్ల నుంచే తమదైన ముద్ర వేస్తున్నారు. పసికూన ముద్ర తొలగించుకుని ఒక స్థాయి అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఈ ప్రపంచకప్లో (ODI World Cup 2023) మాత్రం వారి ప్రదర్శన అద్భుతం అనే చెప్పాలి..
అఫ్గానిస్థాన్ మెరుపులతో ట్రాట్, అజయ్ జడేజాలపై చర్చ
వాళ్లిద్దరూ అంతర్జాతీయ క్రికెట్పై తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లే. తమ జట్లలో కీలక ఆటగాళ్లుగా కొన్నేళ్లు ఒక వెలుగు వెలిగిన వారే. కానీ వారి కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోయింది. ఆట నుంచి వాళ్లిద్దరూ తప్పుకొన్న కారణాలు అనూహ్యమైనవే. అప్పుడలా తెరమరుగైన ఆ ఆటగాళ్ల గురించి చాలా ఏళ్లు చర్చే లేదు. అయితే ఇప్పుడు వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఆ ఇద్దరి పేర్లు చర్చనీయాంశం అయ్యాయి. వారి పనితనంపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఆ ఇద్దరే.. జొనాథన్ ట్రాట్, అజయ్ జడేజా.
ఈ ప్రపంచకప్లో భారత జట్టుది అత్యుత్తమ ప్రదర్శన కాగా.. అత్యంత ఆశ్చర్యకర మెరుగైన ప్రదర్శన అంటే అఫ్గానిస్థాన్దే. అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గానిస్థాన్ ఆటగాళ్లు చాలా ఏళ్ల నుంచే తమదైన ముద్ర వేస్తున్నారు. పసికూన ముద్ర తొలగించుకుని ఒక స్థాయి అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఈ ప్రపంచకప్లో మాత్రం వారి ప్రదర్శన అద్భుతం అనే చెప్పాలి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్నే కాక పాకిస్థాన్, శ్రీలంకలనూ అలవోకగా ఓడించి ప్రకంపనలు రేపింది అఫ్గాన్. ఆ జట్టు ప్రదర్శన ఇంతగా మెరుగవవడం, ప్రపంచకప్లో ఇంత బాగా ఆడుతుండటంలో ప్రధాన కోచ్ జొనాథన్ ట్రాట్, మెంటార్ అజయ్ జడేజాల పాత్ర కీలకమని జట్టు వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది ట్రాట్ కోచ్గా పగ్గాలందుకున్నప్పటి నుంచి అఫ్గాన్ బ్యాటింగ్ మెరుగవుతూ వస్తోంది. ఇక భారత్లో జరుగుతున్న ప్రపంచకప్ కోసం అజయ్ జడేజాను మెంటార్గా నియమించుకోవడం ఆ జట్టుకు బాగా కలిసొచ్చినట్లు భావిస్తున్నారు. భారత్లో పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని ఉత్తమ ప్రదర్శన చేయడంలో అజయ్ తనవంతు తోడ్పాటునందిస్తున్నాడు. ట్రాట్, జడేజా అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన కారణాలు భిన్నమైనవి.
ట్రాట్ అలా..
దక్షిణాఫ్రికా క్రికెట్లో అవకాశాలు దక్కక ఆ దేశ ఆటగాళ్లు ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ లాంటి జట్లకు ఆడటం కొత్తేమీ కాదు. కెవిన్ పీటర్సన్ సహా చాలామంది ఆటగాళ్లు ఈ కోవలో కనిపిస్తారు. ట్రాట్ కూడా ఆ జాబితాకు చెందిన వాడే. యుక్త వయసులో అతను ఇంగ్లాండ్కు మారిపోయాడు. అక్కడ కౌంటీల్లో ఆడుతూ.. తర్వాత ఇంగ్లాండ్ జట్టుకు ఎంపికయ్యాడు. 2019-13 మధ్య ఇంగ్లిష్ జట్టులో అతను కీలక ఆటగాడిగా ఉన్నాడు. టాప్ఆర్డర్లో కీలక ఇన్నింగ్స్లు ఆడుతూ.. తన మీడియం పేస్తోనూ జట్టుకు ఉపయోగపడేవాడు. 52 టెస్టులు ఆడిన ట్రాట్.. 44.08 సగటుతో 3835 పరుగులు చేయడం విశేషం. 68 వన్డేలాడి 51.25 సగటుతో 2819 పరుగులు సాధించాడు. ఇంత చక్కటి ప్రదర్శనతో జట్టులో ఉత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న అతను.. 2013లో యాషెస్ సిరీస్ సందర్భంగా అర్ధంతరంగా జట్టు నుంచి తప్పుకొన్నాడు. మానసిక సమస్యల కారణంగా ఆట మీద దృష్టిసారించలేకపోవడమే అందుక్కారణం. ఈ కారణంతో రెండేళ్లు ఆటకు దూరంగా ఉన్నాడు. 2015లో ఇంగ్లాండ్ జట్టులోకి పునరాగమనం చేసినా ఫామ్ అందుకోలేకపోయాడు. అతడి సమస్య కూడా పునరావృతమైంది. దీంతో రిటైర్మెంట్ ప్రకటించేశాడు. కొన్నేళ్ల తర్వాత అతను కోచింగ్లోకి వచ్చాడు. నిరుడు అఫ్గానిస్థాన్ ప్రధాన కోచ్గా బాధ్యతలందుకున్నాడు. అఫ్గాన్ బౌలింగ్లో ముందు నుంచి మెరుగే కానీ.. బ్యాటింగ్లో మాత్రం బలహీనమే. ట్రాట్ వచ్చాక ఆ విభాగంలోనూ ఆ జట్టు బలపడింది. టోర్నీలో నిలకడగా విజయాలు సాధించడంలో బ్యాటర్ల పాత్ర కీలకమన్న సంగతి తెలిసిందే. మొత్తంగా ఆ జట్టును ట్రాట్ చక్కగా నడిపిస్తున్నాడు.
అజయ్ ఇలా..
90వ దశకంలో భారత క్రికెట్ను అనుసరించిన వారికి అజయ్ జడేజా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1992, 1996 వన్డే ప్రపంచకప్ల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత్ విజయాల్లో అతడి పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా 1996లో 25 బంతుల్లో 45 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ అప్పట్లో ఓ సంచలనం. ప్రపంచకప్ అనే కాక 90వ దశకంలో భారత జట్టులో జడేజా పాత్ర కీలకం. రాబిన్ సింగ్తో కలిసి మిడిలార్డర్ భారాన్ని మోసింది అతనే. ఉపయుక్తమైన పేస్ బౌలింగ్తోనూ జడేజా తనదైన ముద్ర వేశాడు. టెస్టుల్లో పెద్దగా రాణించలేకపోయిన అజయ్ ఆ ఫార్మాట్లో 15 మ్యాచ్లే ఆడాడు. కానీ వన్డేల్లో అతను కీలక ఆటగాడే. 196 మ్యాచ్లు ఆడి 37.47 సగటుతో 5359 పరుగులు చేశాడు. 20 వికెట్లు కూడా తీశాడు. జడేజా ఆ రోజుల్లో ఉత్తమ ఫీల్డర్గానూ పేరు తెచ్చుకున్నాడు. 1999 ప్రపంచకప్లోనూ ఆడిన అజయ్.. 2000లో భారత క్రికెట్ను కుదిపేసిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకున్నాడు. అజహరుద్దీన్తో పాటు జడేజా మీదా ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో వీళ్లిద్దరిపై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించింది. తర్వాత జడేజాపై నిషేధాన్ని అయిదేళ్లకు తగ్గించారు. కేసు నిలవకపోవడంతో తర్వాత బీసీసీఐ నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేసింది. కానీ అజయ్ తిరిగి భారత జట్టులోకి మాత్రం రాలేకపోయాడు. చాలా ఏళ్లు అతను క్రికెట్ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నాడు. ఐపీఎల్లో కూడా భాగం కాలేదు. మధ్యలో కొన్ని సినిమాల్లో నటించిన జడేజా.. 2015లో దిల్లీ జట్టుకు కోచ్ అయ్యాడు. ఇప్పుడు అఫ్గానిస్థాన్కు ప్రపంచకప్లో మెంటార్గా వ్యవహరిస్తూ అందరి దృష్టిలో పడ్డాడు. ఇక్కడి పరిస్థితులను ఆ జట్టు బాగా ఉపయోగించుకోవడంలో అజయ్ అనుభవం బాగా ఉపకరిస్తోంది.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?