Jos Buttler: మన మనస్సే అత్యంత శక్తిమంతం.. అదృష్టమూ కలిసిరావాలి: జోస్ బట్లర్
ఐపీఎల్ 17వ సీజన్ ఒకే మ్యాచ్లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. అందులో ఒకటి విరాట్ కోహ్లీ చేయగా.. మరొకటి జోస్ బట్లర్ బాదాడు.
ఇంటర్నెట్ డెస్క్: జైపుర్ వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ (113*) సెంచరీ సాధించాడు. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ (100*) శతకంతో జట్టును గెలిపించాడు. గత సీజన్లో మొత్తం 10 మ్యాచుల్లో 183 పరుగులు మాత్రమే సాధించాడు. అందులో మూడు డక్లూ ఉన్నాయి. ఈ ఎడిషన్లోనూ పెద్దగా రాణించలేదు. తాజాగా సెంచరీతో మళ్లీ ఫామ్ అందుకొన్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాక జోస్ బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘ ఈ మ్యాచ్లో కాస్త అదృష్టమూ కలిసొచ్చింది. చివరి వరకూ క్రీజ్లో ఉండి ముగించడం బాగుంది. మ్యాచ్లు ఆడినంత కాలం ఒత్తిడి, ఆందోళన తప్పదు. మన మనస్సు చాలా శక్తిమంతం. దానిని అదుపులో ఉంచుకుని.. తీవ్రంగా శ్రమించాలి. అదే సమయంలో కాస్త లక్ కూడా కావాలి. కొన్నిసార్లు విఫలమైనప్పుడు మనకి మనం సర్దిచెప్పుకోగలగాలి. గత మ్యాచ్లోనూ బాగానే ఆడినప్పటికీ త్వరగా (13పరుగులకే) ఔటయ్యా. ఈ లీగ్కు ముందు దక్షిణాఫ్రికాతో సిరీస్లో బాగానే ఆడా. ఇప్పుడు ఒక్కసారి మంచి ఇన్నింగ్స్ ఆడితే చాలు.. లైన్లోకి రావచ్చని భావించా. మేం ఈ సీజన్ను అద్భుతంగా ప్రారంభించాం. ఇలాగే కొనసాగించాల్సిన అవసరం ఉంది. దాని కోసం తీవ్రంగా శ్రమిస్తాం’’ అని జోస్ బట్లర్ తెలిపాడు.
ఏదైనా జరగొచ్చని ముందే భావించాం: సంజూ శాంసన్
‘‘మంచు ప్రభావం ఉన్నప్పుడు 190 పరుగులు టార్గెట్ పెద్ద కష్టమేం కాదు. కానీ, ఏదైనా జరిగొచ్చు. మా బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత బలంగా ఉంది. ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకున్నాం. మరికొన్ని మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మా బౌలర్లు అద్భుతంగా వేశారు. తదుపరి మ్యాచ్కు మాకు చాలా సమయం ఉంది. కాస్త రీఛార్జ్ అవుతాం. రాజస్థాన్ బౌలింగ్కు 9, బ్యాటింగ్కు 8.7 రేటింగ్ ఇస్తా. అదీనూ జోస్ బట్లర్ వల్ల సాధ్యమైంది’’ అని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ వ్యాఖ్యానించాడు.
మరో 15 పరుగులు చేయాల్సింది: డుప్లెసిస్
‘‘విరాట్తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడే పిచ్ చాలా క్లిష్టంగా ఉందని అర్థమైంది. 190 పరుగులు మంచి టార్గెట్ అవుతుందని భావించా. కనీసం మరో 15 పరుగులైనా చేస్తామని భావించా. విరాట్ కోహ్లీ చాలా అద్భుతంగా ఆడాడు. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాం. కానీ, పిచ్ వల్ల పరుగులు చేయడం కష్టంగానే మారింది. చాలా బంతులు బ్యాట్కు అడుగున తాకాయి. బౌలింగ్లో మా బౌలర్లు తొలి నాలుగు ఓవర్లు బాగానే వేశారు. ఒక్క ఓవర్లో 20 పరుగులు ఇచ్చేయడంతో మాపై ఒత్తిడి పెరిగింది’’ అని బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు.
మరికొన్ని విశేషాలు..
- ఐపీఎల్లో రాజస్థాన్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లు దక్కించుకున్న క్రికెటర్గా జోస్ బట్లర్ నిలిచాడు. మొత్తం 11 అవార్డులను దక్కింది. అజింక్య రహానె (10) ఆ తర్వాత స్థానంలో నిలిచాడు.
- ఐపీఎల్లో జైపుర్ వేదికగా జరిగిన మ్యాచుల్లో నాలుగో అత్యధిక లక్ష్య ఛేదన (184) ఇదే కావడం విశేషం. బెంగళూరుపై రెండో అత్యధిక టార్గెట్ కూడా ఇదే. గతంలో (2014) 191 పరుగులను రాజస్థాన్ ఛేదించింది.
- 100వ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో బ్యాటర్ జోస్ బట్లర్ (100*). లఖ్నవూ ఆటగాడు కేఎల్ రాహుల్ (103*) ముంబయిపై సెంచరీ సాధించాడు.
- ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా విరాట్ కోహ్లీ (8) కొనసాగుతున్నాడు. క్రిస్ గేల్ (6), జోస్ బట్లర్ (6) ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. ఓడిన మ్యాచుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ విరాట్ కోహ్లీనే (3).
- ఐపీఎల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (110) రికార్డు సృష్టించాడు. సురేశ్ రైనా (109)ను అధిగమించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత