Ankita Bhakat: నాన్న పాలు అమ్మితే.. కష్టాలకు ఓర్చి పతకం గెలిచిన అంకిత
ఆసియా క్రీడల్లో ఆర్చరీలో మహిళల టీమ్ విభాగంలో కాంస్యం గెలిచిన అంకిత బాకత్ది భిన్నమైన నేపథ్యం. మధ్య తరగతి నుంచి వచ్చిన ఆమె ఎన్నో కష్టాలను ఓర్చుకున మరీ పతకాలను సొంతం చేసుకుంది.
విల్లు కొనుక్కునే స్థోమత లేదు.. ఆటలు ఆడే పరిస్థితి లేదు.. రికర్వ్ విల్లు పట్టుకోవడం కోసమే ఆరేళ్లు వేచి చూసింది ఆ అమ్మాయి.. ఎట్టకేలకు ప్రభుత్వ సాయంతో ఈ విల్లుతో సాధన చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ఏకంగా ఆసియా క్రీడల్లోనే పతకంతో మెరిసింది. ఆ ఆర్చరే అంకిత బాకత్.
ఆసియా క్రీడల్లో ఆర్చరీలో మహిళల టీమ్ విభాగంలో కాంస్యం గెలిచిన అంకిత బాకత్ది భిన్నమైన నేపథ్యం. కోల్కతాకు సమీపంలో బారానగర్కు చెందిన అంకితది మధ్య తరగతి కుటుంబం. ఆమె నాన్న బిదాన్ పార్క్ ప్రాంతంలో పాలు అమ్మేవాడు. కానీ చిన్నప్పటి నుంచి ఆర్చీరీపై ఇష్టాన్ని పెంచుకున్న అంకిత.. ఈ క్రీడలో ఛాంపియన్ కావాలని కలలు కనేది. కానీ రూ.2.5 లక్షల విలువుండే రికర్వ్ విల్లును కొనేంత స్థోమత ఆమెకు లేదు. ఇందు కోసం ఆరేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. రికర్వ్ విల్లు లేకుండా దేశీ విల్లుతోనే జాతీయ క్రీడల్లోనూ పాల్గొంది. తన కెరీర్ అంతటితో ఆగిపోతుందని అనుకుంది.
2014లో ట్రయల్స్ ద్వారా టాటా ఆర్చరీ అకాడమీకి ఎంపిక కావడం అంకిత కెరీర్లో కీలక మలుపు. అక్కడే ఆమె ఎంతో ఇష్టపడిన రికర్వ్ విల్లుతో సాధన చేసింది. ఆ తర్వాత రెండేళ్లలోనే జాతీయ స్థాయికి ఎదిగింది. జాతీయ స్థాయిలో పతకాలు గెలిచింది. భారత్ తరఫున ఆసియాకప్ ర్యాంకింగ్ టోర్నీలో ఆడింది. టీమ్ స్వర్ణాన్నీ అందుకుంది. ఆ తర్వాత ఆసియా క్రీడల సెలక్షన్స్లో రాణించి ఈ క్రీడలకు ఎంపికైంది. టీమ్ పతకం గెలిచి సత్తా చాటింది.
షాట్పుట్ నుంచి ఆర్చరీకి
అంకితతో కలిసి టీమ్లో కాంస్యం నెగ్గిన 18 ఏళ్ల భజన్కౌర్ది మరో కథ. ఈ హరియాణా అమ్మాయి అసలు ఆరంభంలో ఆర్చరే కాదు. అథ్లెటిక్స్లోకి వెళ్లాలని అనుకుంది. పాఠశాలలో చదువుకునే రోజుల్లో షాట్పుట్ ఆడేది. ఒక ఏడాది పాటు ఈ క్రీడలో కొనసాగాక.. విజయవంతం కాకపోవడంతో ఆర్చరీకి మారింది. అలా నెమ్మదిగా ఎదిగిన ఆమె.. ఈ ఏడాదే కీలక విజయాలు సాధించింది. 2023 జులైలో యూత్ ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్యం నెగ్గిన భజన్.. ఆగస్టులో ప్రపంచకప్లో సీనియర్ టీమ్ కాంస్యం సాధించి సత్తా చాటింది.
టాప్సీడ్కు షాకిచ్చి..
ఏప్రిల్లో టర్కీలో జరిగిన ప్రపంచకప్లోనూ సెమీఫైనల్ వరకు వెళ్లింది. ఈ క్రమంలో టాప్సీడ్ వాలెన్సినాకు షాకిచ్చింది. ఆసియా క్రీడల్లోనూ మహిళల జట్టు కాంస్యం గెలవడంలో భజన్ కౌర్ కీలకపాత్ర పోషించింది. వియత్నాంతో జరిగిన కాంస్య పోరులో 8 షాట్లలో 6సార్లు 10 పాయింట్లు గెలిచి భారత్ ఖాతాలో పతకాన్ని చేర్చింది. 13 ఏళ్లలో రికర్వ్లో భారత్కు వచ్చిన తొలి పతకం ఇదే అంటే ఈ విజయం ఎంత ముఖ్యమైందో అర్థం చేసుకోవచ్చు. ‘‘ఫైనల్లో చాలా ఒత్తిడికి గురయ్యా. జట్టులో అందరికంటే నేనే చిన్నదాన్ని. అయితే చివరి షాట్లలో గురి తప్పకుండా ఉంటే కచ్చితంగా పతకం వస్తుందని అనుకున్నా. అంకిత, సిమ్రన్జీత్ కౌర్ నన్ను ప్రోత్సహించారు. ఒత్తిడిని పక్కకి నెట్టి వీలైనంత నేరుగా బాణాలను సంధించా. పతకం సొంతమైంది’’ అని భజన్కౌర్ ఉద్వేగంగా పేర్కొంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి నీరిచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి