Kagiso Rabada: డేంజరస్ రబాడ.. ఖాతాలో 500 అంతర్జాతీయ వికెట్లు
తొలి టెస్టులో (SA vs IND) దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ ఐదు వికెట్ల ప్రదర్శన (5/59) చేశాడు. ఇలా భారత్పై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా అవతరించాడు. ఇదే క్రమంలో అంతర్జాతీయంగా 500+ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
19 ఏళ్లకే అంతర్జాతీయ అరంగేట్రం.. 21 ఏళ్లు వచ్చేసరికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు.. ఇప్పుడు 28 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లు. నిలకడైన వేగం.. గురి తప్పని కచ్చితత్వం.. బ్యాటర్లను బోల్తా కొట్టించే వైవిధ్యం.. బుట్టలో వేసుకునే తెలివి.. ఇవన్నీ కలిపితే కగిసో రబాడ (Kagio Rabada). ఈ దక్షిణాఫ్రికా డేంజరస్ పేసర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ అరంగేట్రం నుంచి సంచలన ప్రదర్శనతో సాగిపోతున్న ఈ సఫారీ ఎక్స్ప్రెస్ ఇప్పుడు మరో మైలురాయిని చేరుకుంది. భారత్తో టెస్టులో తొలి రోజు అయిదు వికెట్లు సాధించి.. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 500 వికెట్ల క్లబ్లో రబాడ చేరాడు. ఈ ఘనత సాధించిన ఏడో దక్షిణాఫ్రికా బౌలర్గా నిలిచాడు.
ఆడటం కష్టం
స్వదేశం, విదేశం అని కాదు.. పరిస్థితులతో సంబంధం లేదు.. రబాడ బంతి పట్టుకుని రనప్ అందుకున్నాడంటే, అతని బౌలింగ్ను ఆడటం కష్టమే. అందుకే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ప్రమాదకర బౌలర్లలో ఒకడిగా అతను మారాడు. పరిస్థితులకు తగ్గట్లుగా తన బౌలింగ్ తీరును అతను మార్చుకునే విధానం రబాడను ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇందుకు భారత్తో టెస్టు తొలి రోజు ఆటలో అతని బౌలింగే నిదర్శనం. నిలకడగా 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే అతను.. మంగళవారం అంత వేగం ప్రదర్శించలేదు. పిచ్ను అర్థం చేసుకుని, సరైన ప్రదేశాల్లో బంతి వేసి ఫలితం రాబట్టాడు. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్కు ఫుల్షాట్ అంటే ఫేవరేట్. దీన్ని ఎంత బాగా ఆడతాడో తెలిసిందే. కానీ అదే షాట్తో అతణ్ని రబాడ బోల్తా కొట్టించాడు. వేగం తగ్గించి, కాస్త బౌన్స్తో అతను వేసిన బంతిని పుల్ చేయబోయిన రోహిత్ డీప్లో ఫీల్డర్ చేతికి చిక్కాడు. 10 ఇన్నింగ్స్ల్లో రోహిత్ను రబాడ ఆరు సార్లు ఔట్ చేశాడు. వేగంతో, తక్కువ ఎత్తుతో వచ్చిన బంతి శ్రేయస్ స్టంప్స్ను ఎగరగొట్టింది. అప్పటివరకూ లోపలికి బౌలింగ్ చేసిన రబాడ.. ఓ బంతి బయటకు వేసి కోహ్లీని వెనక్కిపంపించాడు. ఆ తర్వాత బౌన్సర్లతో చెలరేగాడు.
సంచలన ప్రయాణం
2014 అండర్-19 ప్రపంచకప్ సెమీస్లో ఆస్ట్రేలియాపై 6 వికెట్ల సంచలన ప్రదర్శనతో రబాడ పేరు ఒక్కసారిగా మార్మోగింది. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసిన అతను.. జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అదే ఏడాది టీ20 అరంగ్రేటం చేశాడు. 2015లో ఓ ఫస్ట్క్లాస్ మ్యాచ్లో అత్యుత్తమ గణంకాలు (14/105) నమోదు చేసిన దక్షిణాఫ్రికా బౌలర్గా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో అరంగేట్ర వన్డేలోనే హ్యాట్రిక్ తీసిన రెండో పేసర్గా నిలిచి ఔరా అనిపించాడు. 2015లో బంగ్లాదేశ్పై హ్యాట్రిక్ సహా 6 వికెట్లు పడగొట్టాడు. తొలి వన్డేలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్గా రికార్డు నమోదు చేశాడు. భారత్లోనే టెస్టు సిరీస్తో సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెట్టిన రబాడ ఇక ఆగడం లేదు. మోర్నీ మోర్కెల్, స్టెయిన్, ఫిలాండర్ గాయాల కారణంగా నిలకడగా అవకాశాలు అందుకున్న రబాడ.. అత్యుత్తమ ప్రదర్శనతో సఫారీ ప్రధాన పేసర్గా ఎదిగాడు. అత్యంత పిన్న వయస్సులో ఓ టెస్టులో 10 వికెట్లు (ఇంగ్లాండ్పై 13/144) పడగొట్టిన దక్షిణాఫ్రికా బౌలర్గా నిలిచాడు.
ఎక్కడైనా తగ్గేదేలే
పేసర్లకు స్వర్గధామం లాంటి దక్షిణాఫ్రికా పిచ్లపై రబడాను ఎదుర్కోవడం అంటే కదిలే రైలుకు ఎదురు వెళ్లడం లాంటిదే. పేస్, బౌన్స్, స్వింగ్కు అనుకూలించే పిచ్లపై రబాడ అత్యంత ప్రమాదకారిగా మారతాడు. అతను సంధించే బుల్లెట్ బంతులకు బ్యాటర్ల దగ్గర సమాధానమే ఉండటం లేదు. గాయాలతో మధ్యలో కెరీర్ కాస్త నెమ్మదించినా.. మైదానంలో దిగిన ప్రతిసారి తనదైన శైలిలో చెలరేగిపోవడం అతనికి అలవాటు. భారత్తో మ్యాచ్ ముందువరకూ 60 టెస్టు (108 ఇన్నింగ్స్)ల్లో 22.34 సగటుతో రబాడ 280 వికెట్లు పడగొట్టాడు. ప్రతి 39 బంతులకో వికెట్ సాధించాడు. 101 వన్డేల్లో 27.77 సగటుతో 157 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ప్రతి 32 బంతులకో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇక 56 టీ20ల్లో 58 వికెట్లు సాధించాడు. సగటు 29.87గా ఉంది. అయితే ఇతర దేశాల్లోనూ రబాడ అదే స్థాయిలో రాణించడం విశేషం. ప్రత్యర్థి దేశాల్లో ఆడిన 29 టెస్టుల్లో 27.19 సగటుతో 107 వికెట్లు సాధించాడు. 34 వన్డేల్లో 62 వికెట్లు పడగొట్టాడు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు