RCB: అతడి నుంచి ఫోన్ వచ్చింది.. సంభ్రమాశ్చర్యానికి గురయ్యా!: కేదార్
వెటరన్ ప్లేయర్ కేదార్ జాదవ్కు (Kedar Jadhav) చాలా రోజుల తర్వాత ఐపీఎల్లో (IPL 2023) ఆడేందుకు అవకాశం వచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి ఆహ్వానం వచ్చింది. తుది జట్టులో అవకాశం వస్తే మాత్రం తన సత్తా ఏంటో చూపిస్తానని చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: గతేడాది జరిగిన ఐపీఎల్ (IPL) మినీ వేలంలో అన్సోల్డ్.. ఇక క్రికెట్ కెరీర్ ముగిసిందని వ్యాఖ్యాతగా మారిపోయాడు. కట్ చేస్తే.. ఐపీఎల్లో అత్యంత ఫ్యాన్బేస్ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులోకి పిలుపొచ్చింది. అదీనూ మిడిలార్డర్ను బలోపేతం చేస్తాడనే నమ్మకం ఉందని ఆ ఫ్రాంచైజీనే స్వయంగా వెల్లడించడం గమనార్హం. ఇంతకీ ఆ సీనియర్ మోస్ట్ ఆటగాడు ఎవరని మీ డౌటు.. అతడే 38 ఏళ్ల కేదార్ జాదవ్. ఇంతకుముందు ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా అనిపిస్తోందా..? 2021 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు, అంతకుముందు రెండేళ్లపాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన కేదార్ జాదవే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాడు. గతంలో 2016, 2017 సీజన్లలోనూ కేదార్ ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు మళ్లీ ఆర్సీబీ గూటికే చేరాడు. డేవిడ్ విల్లే స్థానంలో కేదార్ను ఆర్సీబీ తీసుకుంది. ఈ క్రమంలో తాను ఆర్సీబీ జట్టులోకి మళ్లీ ఎలా వచ్చాననే విషయాలను వెల్లడించాడు. ఆ వీడియోను ఆర్సీబీ తన యూ ట్యూబ్లో ఉంచింది.
ఇటీవల రంజీ ట్రోఫీలో 92.5 సగటుతో పరుగులు రాబట్టిన కేదార్ రాకతో తమ మిడిలార్డర్ బలోపేతం కావడం ఖాయమని ఆర్సీబీ భావిస్తోంది. ‘‘ఆర్సీబీ జట్టులోకి పిలుపు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆనందంగానూ ఉంది. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు బెంగళూరు ఫ్రాంచైజీకి, సహాయ సిబ్బందికి నా ధన్యవాదాలు. అవకాశం వచ్చిన ప్రతి మ్యాచ్లో 110 శాతం కష్టపడతా’’ అని కేదార్ చెప్పాడు.
క్రికెట్ మ్యాచ్కు కామెంటేటర్గా చేస్తున్నప్పుడు ‘కోచ్ సంజయ్ బంగర్ కాల్ చేశాడు. ఏం చేస్తున్నావని అడిగాడు. నేను ఇలా కామెంట్రీ చేస్తున్నా ’ అని చెప్పా.
బంగర్: ‘ప్రాక్టీస్ చేస్తున్నావా..?’
కేదార్: ‘వారానికి రెండు రోజులు చేస్తున్నా. జిమ్కు వెళ్తూ ఫిట్నెస్ కూడా కాపాడుకుంటూ ఉన్నా’ అని చెప్పా. కాసేపు మళ్లీ ఫోన్ చేస్తానని కట్ చేశాడు.
‘‘కాసేపటికి బంగర్ ఫోన్ చేసి ‘నువ్వు ఆర్సీబీ తరఫున ఆడాలి’ అని చెప్పడంతో ఒక్కసారి ఆశ్చర్యపోయా. దాదాపు సంవత్సరంపైగా ఆటకు దూరంగా ఉన్నా. తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడా. నాకు చాలా అనుభవం ఉంది. 20ఏళ్ల వయసులో ఎలాంటి పరుగుల ఆకలి ఉందో.. ఇప్పుడూ అలానే ఉన్నా. దాని కోసం తీవ్రంగా శ్రమించా. ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నా’’ అని కేదార్ తెలిపాడు. తుది జట్టులో అవకాశం వస్తే అజింక్య రహానెలా కేదార్ కూడా చెలరేగిపోవాలని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్