Shreyas Iyer: ఎదురులేని జట్టుగా కనిపించింది: శ్రేయస్
ఐపీఎల్-17లో టోర్నీ ఆసాంతం కోల్కతా నైట్రైడర్స్ అజేయ జట్టుగా కనిపించిందని ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు.
కోల్కతా: ఐపీఎల్-17లో టోర్నీ ఆసాంతం కోల్కతా నైట్రైడర్స్ అజేయ జట్టుగా కనిపించిందని ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ‘‘ఐపీఎల్ ట్రోఫీ గెలిచాక ఆ ఆనందాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కోల్కతా ఈ సీజన్ మొత్తం ఎదురులేని జట్టుగా కనిపించింది’’ అని శ్రేయస్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో కోల్కతాను విజేతగా నిలబెట్టిన శ్రేయస్ గత కొన్ని నెలలుగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. శారీరకంగానే కాక మానసికంగానూ ఇబ్బంది పడ్డాడు.. వెన్ను గాయం కారణంగా ఇంగ్లాండ్తో స్వదేశంలో జరిగిన సిరీస్లో టీమ్ఇండియాకు దూరమయ్యాడు. లండన్లో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. కోలుకునే ప్రక్రియ ఆలస్యం కావడంతో ఒక దశలో అసలు ఐపీఎల్ ఆడతాడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు రంజీ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ ఆదేశాలను పెడచెవిన పెట్టడంతో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. చివరికి ముంబయి తరఫున రంజీ ట్రోఫీ సెమీస్, ఫైనల్లో ఆడి జట్టు 42వసారి టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. విదర్భతో ఫైనల్లో రెండో ఇన్నింగ్స్లో 95 పరుగులు చేసి ఫామ్, ఫిట్నెస్ చాటుకున్నాడు. గత ఐపీఎల్కు గాయంతో దూరమైన శ్రేయస్.. ఈసారి కోలుకుని కోల్కతా కెప్టెన్గా తిరిగి బాధ్యతలు అందుకుని జట్టును గొప్పగా నడిపించాడు. మార్గనిర్దేశకుడు గౌతమ్ గంభీర్, కోచ్ చంద్రకాంత్ పండిట్లను సమన్వయం చేసుకుంటూ వనరులను తెలివిగా ఉపయోగించుకుని ఆ జట్టు పదేళ్ల నిరీక్షణకు తెరదించాడు. బ్యాటర్గానూ కీలక సమయంలో రాణించాడు. హైదరాబాద్తో క్వాలిఫయర్-1లో అజేయంగా 58 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకమయ్యాడు. మొత్తంగా 2 అర్ధసెంచరీలతో సహా 351 పరుగులు సాధించాడు. ‘‘కోల్కతాను శ్రేయస్ నడపించిన తీరు అద్భుతం. నాయకుడిగా అతడెంతో మెరుగయ్యాడు. అతడి చేతిలో మంచి జట్టు ఉందన్నది నిజమే అయినా.. వారి నుంచి తనకు కావాల్సింది రాబట్టాడు’’ అని మాజీ ఆటగాడు ప్రవీణ్ ఆమ్రే అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు