KL Rahul: ఇదే మా తొలి మ్యాచ్.. తొందరేం లేదు: రెండు బౌన్సర్ల రూల్పై కేఎల్ రాహుల్
రాజస్థాన్ చేతిలో లఖ్నవూ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. పవర్ప్లేలో తీవ్రంగా ఇబ్బంది పడిన లఖ్నవూ.. వికెట్లు కోల్పోవడంతో లక్ష్య ఛేదనలో వెనుకబడిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ సీజన్ను లఖ్నవూ ఓటమితో ప్రారంభించింది. రాజస్థాన్ చేతిలో 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రాజస్థాన్ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన లఖ్నవూ 173 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (58), నికోలస్ పూరన్ (64*), దీపక్ హుడా (26) రాణించినప్పటికీ.. విజయం సాధించలేకపోయింది. పవర్ ప్లేలో కీలకమైన మూడు వికెట్లను కోల్పోవడంతోపాటు 47 పరుగులే చేయడంతో ఓటమి తప్పలేదు. ఓవర్లో రెండు బౌన్సర్ల రూల్ వల్లే లఖ్నవూ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారనే వ్యాఖ్యలు వినిపించాయి. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో దేవదత్ పడిక్కల్, కేఎల్ కంకషన్ చెక్ చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో ఏ జట్టూ పవర్ ప్లేలో భారీగా పరుగులు చేయలేకపోయింది. దీనిపై కేఎల్ రాహుల్ స్పందించాడు.
‘‘ఈ సీజన్లో ఇది మేం ఆడిన తొలి మ్యాచ్. బౌన్సర్లు, ఇతర అంశాలపై ఆందోళన చెందడం లేదు. ఇప్పుడే దానిపై ఓ అభిప్రాయానికి రావడం సరైందికాదు. అలా చేస్తే తొందరపాటే అవుతుంది. ప్రతి జట్టుకూ పవర్ ప్లే (తొలి ఆరు ఓవర్లు) ముఖ్యం. ఈసారి ఏ టీమ్ కూడా దూకుడుగా ఆడిన దాఖలాలు లేవు. మా బౌలర్ మోహ్సిన్ తొలి సీజన్ పవర్ప్లేలో కీలకంగా మారాడు. గత ఎడిషన్లో ఫిట్నెస్ లేకపోవడంతో ఆడలేకపోయాడు. ఇప్పుడు అతడు తిరిగి రావడం బాగుంది. కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. నవీనుల్ హక్ మా బౌలింగ్ విభాగంలో కీలమైన ఆటగాడు. ఈ మ్యాచ్లో పరుగులు భారీగా సమర్పించినంత మాత్రాన వారి ప్రదర్శనను తక్కువ చేయడం లేదు.
రాజస్థాన్ నిర్దేశించిన 194 పరుగుల టార్గెట్ కూడా పెద్దదేం కాదు. ఓవర్కు 10 పరుగులు కంటే తక్కువ చేస్తే చాలు. మా బౌలర్లు, బ్యాటర్లు కొన్ని పొరపాట్లు చేశారు. తర్వాతి మ్యాచుల్లో సరిదిద్దుకొని బరిలోకి దిగుతాం. బ్యాటింగ్లోనూ ఆరంభంలో తడబాటుకు గురయ్యాం. త్వరగా మూడు వికెట్లు కోల్పోవడం కూడా ప్రభావం చూపింది. మ్యాచ్లను గెలిచేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తాం. మేం ఎక్కడ బలోపేతం కావాలనే అంశాలపై దృష్టిసారిస్తాం. గత సీజన్ మధ్యలోనే నేను వైదొలిగా. ఇప్పుడు మాత్రం మొదటి మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించా. విజయం సాధిస్తే ఇంకాస్త సంతోషంగా ఉండేది. మా జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్కు ఎంతో అనుభవం ఉంది. ఆసీస్ టీ20 ప్రపంచ కప్, యాషెస్ సిరీస్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి కోచింగ్ను మేం ఆస్వాదిస్తున్నాం’’ అని కేఎల్ రాహుల్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్