KL Rahul: ఇదే మా తొలి మ్యాచ్.. తొందరేం లేదు: రెండు బౌన్సర్ల రూల్పై కేఎల్ రాహుల్
రాజస్థాన్ చేతిలో లఖ్నవూ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. పవర్ప్లేలో తీవ్రంగా ఇబ్బంది పడిన లఖ్నవూ.. వికెట్లు కోల్పోవడంతో లక్ష్య ఛేదనలో వెనుకబడిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ సీజన్ను లఖ్నవూ ఓటమితో ప్రారంభించింది. రాజస్థాన్ చేతిలో 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రాజస్థాన్ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన లఖ్నవూ 173 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (58), నికోలస్ పూరన్ (64*), దీపక్ హుడా (26) రాణించినప్పటికీ.. విజయం సాధించలేకపోయింది. పవర్ ప్లేలో కీలకమైన మూడు వికెట్లను కోల్పోవడంతోపాటు 47 పరుగులే చేయడంతో ఓటమి తప్పలేదు. ఓవర్లో రెండు బౌన్సర్ల రూల్ వల్లే లఖ్నవూ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారనే వ్యాఖ్యలు వినిపించాయి. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో దేవదత్ పడిక్కల్, కేఎల్ కంకషన్ చెక్ చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో ఏ జట్టూ పవర్ ప్లేలో భారీగా పరుగులు చేయలేకపోయింది. దీనిపై కేఎల్ రాహుల్ స్పందించాడు.
‘‘ఈ సీజన్లో ఇది మేం ఆడిన తొలి మ్యాచ్. బౌన్సర్లు, ఇతర అంశాలపై ఆందోళన చెందడం లేదు. ఇప్పుడే దానిపై ఓ అభిప్రాయానికి రావడం సరైందికాదు. అలా చేస్తే తొందరపాటే అవుతుంది. ప్రతి జట్టుకూ పవర్ ప్లే (తొలి ఆరు ఓవర్లు) ముఖ్యం. ఈసారి ఏ టీమ్ కూడా దూకుడుగా ఆడిన దాఖలాలు లేవు. మా బౌలర్ మోహ్సిన్ తొలి సీజన్ పవర్ప్లేలో కీలకంగా మారాడు. గత ఎడిషన్లో ఫిట్నెస్ లేకపోవడంతో ఆడలేకపోయాడు. ఇప్పుడు అతడు తిరిగి రావడం బాగుంది. కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. నవీనుల్ హక్ మా బౌలింగ్ విభాగంలో కీలమైన ఆటగాడు. ఈ మ్యాచ్లో పరుగులు భారీగా సమర్పించినంత మాత్రాన వారి ప్రదర్శనను తక్కువ చేయడం లేదు.
రాజస్థాన్ నిర్దేశించిన 194 పరుగుల టార్గెట్ కూడా పెద్దదేం కాదు. ఓవర్కు 10 పరుగులు కంటే తక్కువ చేస్తే చాలు. మా బౌలర్లు, బ్యాటర్లు కొన్ని పొరపాట్లు చేశారు. తర్వాతి మ్యాచుల్లో సరిదిద్దుకొని బరిలోకి దిగుతాం. బ్యాటింగ్లోనూ ఆరంభంలో తడబాటుకు గురయ్యాం. త్వరగా మూడు వికెట్లు కోల్పోవడం కూడా ప్రభావం చూపింది. మ్యాచ్లను గెలిచేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తాం. మేం ఎక్కడ బలోపేతం కావాలనే అంశాలపై దృష్టిసారిస్తాం. గత సీజన్ మధ్యలోనే నేను వైదొలిగా. ఇప్పుడు మాత్రం మొదటి మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించా. విజయం సాధిస్తే ఇంకాస్త సంతోషంగా ఉండేది. మా జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్కు ఎంతో అనుభవం ఉంది. ఆసీస్ టీ20 ప్రపంచ కప్, యాషెస్ సిరీస్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి కోచింగ్ను మేం ఆస్వాదిస్తున్నాం’’ అని కేఎల్ రాహుల్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్