KL Rahul: సైలెంట్ కిల్లర్.. కేఎల్ రాహుల్..!
రాహుల్కు ఏమైందీ..? బెరుకుగా ఆడుతున్నాడేంటీ..? అబ్బా ఇతడినా ప్రపంచకప్ జట్టులోకి తీసుకొంది..! అంటూ టోర్నీకి ముందు వరకు విమర్శలు చేసిన నోళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు అదే రాహుల్ కీపింగ్, బ్యాటింగ్తో జట్టు వెన్నెముకగా మారాడు.
వన్డేల్లో 2021 మార్చి తర్వాత మరో శతకమే లేదు.. ఓపెనర్గా సీమర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు.. అబ్బా ఎన్ని బంతులు తింటాడు అంటూ అభిమానుల అసహనం.. నెట్టింట మీమ్స్ వెల్లువ..ఆపై గాయంతో కొన్ని నెలల విశ్రాంతి.. ఈ ఏడాది ఆగస్టు వరకు కెరీర్లో కష్టకాలం ఎదుర్కొన్న ఓ టీమ్ఇండియా ఆటగాడి పరిస్థితి ఇది. కానీ, జట్టు కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ పట్టుబట్టి మరీ అతడిని జట్టులోకి తీసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు రోహిత్ తీసుకొనే డీఆర్ఎస్ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించడమే కాదు.. మిడిల్ ఆర్డర్లో వచ్చి దూకుడుగా ఆడుతున్నాడు. అతడే సైలెంట్ కిల్లర్ కేఎల్ రాహుల్.
ప్రపంచకప్ ప్రారంభానికి ముందు జట్టు ఓపెనింగ్కు రోహిత్ భాగస్వామిగా గిల్ పాతుకుపోయాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. గాయం నుంచి కోలుకొని శ్రేయస్ అందుబాటులోకి రావడంతో నాలుగో స్థానంలో అతడి బెర్త్ ఖాయమైంది. ఇక కేఎల్ రాహుల్ కూడా కోలుకోవడంతో ఇషాన్తో పోటీ పడాల్సి వచ్చింది. ఈ సమయంలో సీనియర్ కావడంతో కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ రాహుల్కే ఓటు వేశారు. ఇషాన్ను బ్యాకప్ కీపర్-బ్యాటర్గా పరిమితం చేశారు. జట్టు మేనేజ్మెంట్ తనపై ఉంచిన విశ్వాసాన్ని రాహుల్ నిలబెట్టుకొన్నాడు.
ఆలౌట్ వార్కు అంతా సిద్ధం.. ఆ ఒక్కటి తప్ప..!
ప్రపంచకప్ టోర్నీలో విరాట్ కోహ్లీ రికార్డుల జోరు.. రోహిత్, శ్రేయస్ సిక్సర్ల జోరులో.. కేఎల్ సైలెంట్గా ఓ యంత్రంలా తన పని తాను చేసుకు వెళ్లిపోతున్నాడు. టోర్నీ ముందుకు సాగేకొద్ది అతడి ప్రతిభ మరింత పదనుదేలుతోంది. వాస్తవానికి ప్రపంచకప్ టోర్నీ ఆరంభ మ్యాచ్లోనే ఆస్ట్రేలియాపై భారత్ 2 పరుగులకే 3 టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయిన సమయంలో విరాట్తో కలిసి 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ మ్యాచ్లో 115 బంతులకు 97 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఇక టోర్నీ చివరికి వచ్చేసరికి నెదర్లాండ్స్పై 62 బంతుల్లోనే మెరుపు శతకం బాది రికార్డు సృష్టించాడు. సెమీస్లో కేవలం 20 బంతుల్లో అమూల్యమైన 39 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు 10 మ్యాచుల్లో 9 ఇన్నింగ్స్లు ఆడి 77 సగటుతో 386 పరుగులు సాధించాడు.
మిడిలార్డర్లో జట్టుకు వెన్నెముకగా..
ఈ టోర్నీలో రాహుల్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మిడిల్ ఆర్డర్ను శ్రేయస్ అయ్యర్తో కలిసి దుర్భేద్యంగా మార్చేశాడు. రాహుల్ ఓపెనింగ్లో కంటే నాలుగు, ఐదు స్థానాల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్గా 23 మ్యాచ్ల్లో 915 పరుగులు చేశాడు. దీనిలో మూడు శతకాలు, ఆరు అర్థ శతకాలు ఉన్నాయి. సగటు 43.57 కాగా.. స్ట్రైక్ రేట్ కేవలం 79 మాత్రమే. పవర్ ప్లే సమయంలో ఈ స్ట్రైక్ రేట్ దారుణమనే చెప్పొచ్చు.
అదే 4, 5వ స్థానాల్లో అతడు మొత్తం 40 మ్యాచ్లు ఆడాడు. సగటు 56కు పైగా ఉంది. 4 శతకాలు, 10 అర్ధ శతకాలు బాది 1674 పరుగులు చేశాడు. 11 సార్లు నాటౌట్గా నిలిచాడు. వాస్తవానికి ఈ స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చేసరికి పవర్ ప్లే ఉండదు.. ఓవర్లు కూడా తక్కువగా ఉంటాయి. కానీ, 5వ స్థానంలో రాహుల్ స్ట్రైక్ రేటు 98..! అందుకేనేమో ప్రపంచకప్లో మిడిలార్డర్లో దిగి చెలరేగిపోతున్నాడు.
రోహిత్ డీఆర్ఎస్ నిర్ణయాల్లో కీపర్గా కీలకం..
బ్యాటర్గా సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడినా.. కీపింగ్ విషయంలో రాహుల్ ఎక్కడ అలసటగా కనిపించడం లేదు. కీపర్గా మైదానంలో చురుగ్గా కదులుతూ.. కళ్లు చెదిరే క్యాచ్లు అందుకొన్నాడు. ఇక డీఆర్ఎస్ నిర్ణయాల్లో తాను బౌలర్ని పట్టించుకోనని.. కీపర్పైనే ఆధారపడతానని గతంలోనే కెప్టెన్ రోహిత్ తేల్చిచెప్పాడు.
ఈ క్రమంలో రోహిత్ విశ్వాసాన్ని రాహుల్ నిలబెట్టుకొన్నాడనే చెప్పాలి. ముఖ్యంగా.. లీగ్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో షమి వేసిన 12వ ఓవర్ రెండో బంతి బ్యాటర్ చమీర గ్లౌజును తాకి కీపర్ చేతిలోకి వెళ్లింది. అంపైర్ కూడా దానిని వైడుగా భావించి సిగ్నల్ ఇచ్చాడు. షమీ కూడా నిరాశగా వెనుదిరిగాడు.. కానీ, రాహుల్ మాత్రం పట్టు వదలకుండా డీఆర్ఎస్కు వెళ్లాలని రోహిత్ను ఒత్తిడి చేశాడు. చివరికి రివ్యూలో చమీర గ్లౌజుకు బంతి తాకినట్లు స్పష్టం కావడంతో నిర్ణయం టీమ్ ఇండియా పక్షాన వచ్చింది. ఇక.. సెమీస్లో న్యూజిలాండ్పై తొలి ఓవర్లలో బుమ్రా అప్పీళ్లతో రాహుల్ ఏకీభవించలేదు. దీంతో రోహిత్ డీఆర్ఎస్కు వెళ్లలేదు. ఆ తర్వాత అవి నాటౌట్లని రీప్లేలో కనిపించాయి. దీంతో ఇప్పుడు టీమ్ ఇండియాలో డీఆర్ఎస్ అంటే ‘డెసిషన్ రాహుల్ సిస్టమ్’గా మారిపోయింది. ఈ టోర్నీ మొత్తంలో రాహుల్ 15 క్యాచ్లు, ఒక స్టంపింగ్ చేశాడు. ఈ సైలెంట్ కిల్లర్ ఇదే జోరును కొనసాగిస్తే భారత్కు కీపర్ల కొరతతోపాటు.. మిడిలార్డర్ లోటు కూడా తీరిపోయినట్లే.
-ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!