Virat Kohli: ఆత్మగౌరవం కోసం ఆడాం
ఈ ఐపీఎల్లో తొలి 8 మ్యాచ్ల్లో 7 ఓడి ప్లేఆఫ్స్కు దాదాపు దూరమైనట్లే కనిపించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కానీ తర్వాత అనూహ్య రీతిలో వరుసగా ఆరు మ్యాచ్లు నెగ్గి ప్లేఆఫ్స్కు అర్హత సాధించడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది.
బెంగళూరు
ఈ ఐపీఎల్లో తొలి 8 మ్యాచ్ల్లో 7 ఓడి ప్లేఆఫ్స్కు దాదాపు దూరమైనట్లే కనిపించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కానీ తర్వాత అనూహ్య రీతిలో వరుసగా ఆరు మ్యాచ్లు నెగ్గి ప్లేఆఫ్స్కు అర్హత సాధించడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే స్ఫూర్తితో కప్పు కూడా గెలుస్తుందని ఆశిస్తే.. ఎలిమినేటర్ మ్యాచ్లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి నిరాశ కలిగించినప్పటికీ.. సీజన్లో తమ ప్రదర్శన పట్ల గర్విస్తున్నామని చెప్పాడు విరాట్ కోహ్లి. వరుస ఓటములతో సీజన్ మధ్యలో తమ జట్టు కుంగిపోయిందని, ఆ దశలో ఆత్మగౌరవం కోసం ఆడాలని నిర్ణయించుకున్నాక తమ దశ తిరిగిందని కోహ్లి వెల్లడించాడు. ‘‘లీగ్ దశ చివరి ఆరు మ్యాచ్ల్లో గెలవడం గొప్ప అనుభూతినిచ్చింది. ఇలాంటి ప్రత్యేక ప్రదర్శన చేసినపుడు ఇంకా గొప్పగా ఏదైనా చేయాలన్న ప్రేరణ కలుగుతుంది. ఆ దశలో మాకు స్వేచ్ఛగా ఆడే అవకాశం లభించింది. మేం ఆత్మగౌరవం కోసం ఆడడం మొదలుపెట్టాం. అప్పుడే మా ఆత్మవిశ్వాసం తిరిగొచ్చింది. మేం మొత్తం కథను మార్చి ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన తీరు ఎంతో ప్రత్యేకం. దీన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. ఈ పరిణామం జట్టులో ప్రతి ఆటగాడి దృఢమైన వ్యక్తిత్వాన్ని బయటికి తీసింది. ఈ విషయంలో మేమంతా గర్వించవచ్చు. మేం ఎలా కోరుకున్నామో అలా ఆడాం. సీజన్ మధ్యలో మేం పూర్తిగా కుంగిపోయిన స్థితిలో ఉన్నాం. ఒకసారి ఊపు వచ్చాక దాని మీదే ముందుకు వెళ్లాం. ఇంకో రెండు అడుగులు వేసి ట్రోఫీ గెలవకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది. కానీ ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే.. మా కథ దాదాపు ముగిసిన దశ నుంచి పుంజుకుని సీజన్ను ఇలా ముగించడం గర్వంగా అనిపిస్తోంది’’ అని కోహ్లి చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?