Shreyas - Venkatesh: ఈ అయ్యర్కు.. ఆ అయ్యర్కు అదే వ్యత్యాసం..: శ్రేయస్
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా ఫైనల్కు చేరుకుంది. లీగ్ స్టేజ్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన ఆ జట్టు.. తొలి క్వాలిఫయర్లోనూ అదే జోరును కొనసాగించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో నాలుగోసారి కోల్కతా ఫైనల్కు చేరుకుంది. తొలి క్వాలిఫయర్లో హైదరాబాద్ను చిత్తు చేసింది. బౌలింగ్, బ్యాటింగ్తోపాటు ఫీల్డింగ్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (58*: 24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. మరోవైపు వెంకటేశ్ అయ్యర్ (51*: 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లు)తో కలిసి మూడో వికెట్కు అజేయంగా 97 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో ఇద్దరి పేర్ల చివర్లో ‘అయ్యర్’ ఉండటంపై ఎదురైన ప్రశ్నకు శ్రేయస్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. మ్యాచ్ ప్రదర్శనపైనా స్పందించాడు.
‘‘ప్రతి ఒక్కరూ బాధ్యతలను స్వీకరించి మరీ విజయం కోసం కష్టపడ్డారు. దాదాపు పది రోజుల తర్వాత మేం మ్యాచ్ ఆడాం. గత రెండు కూడా వర్షం కారణంగా రద్దయ్యాయి. మ్యాచ్ల కోసం విభిన్న ప్రాంతాలకు తిరుగుతూ ఆడటం అంత సులువేం కాదు. మాకు ఈ మ్యాచ్ ఫలితం అత్యంత విలువైంది. ఇప్పుడు ఏం చేయగలం అనేదానిపై దృష్టిసారించి ఆడాం. వచ్చిన ప్రతి ఛాన్స్ను అందిపుచ్చుకోవడానికే ప్రయత్నించాం. బౌలింగ్లో వైవిధ్యం చూపిస్తే ఫలితం సానుకూలంగా వస్తుందనేదానికి ఇదొక నిదర్శనం. తొలి మ్యాచ్ ఆడిన వికెట్ కీపర్ గుర్బాజ్ ప్రభావం చూపించాడు. స్టార్క్, సునీల్ నరైన్ వికెట్లు తీస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి కొనసాగించారు. బ్యాటింగ్లోనూ మేం దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభించాం. వెంకటేశ్ అయ్యర్ ఆ ఊపును కొనసాగించడంలో కీలక పాత్ర పోషించాడు. నాకు (శ్రేయస్ అయ్యర్), వెంకటేశ్ అయ్యర్కు మధ్య ఒకటే వ్యత్యాసం. అతడు తమిళ్ మాట్లాడతాడు. నేను మాట్లాడలేను, కానీ అర్థం చేసుకోగలను. నాతో అతడు తమిళ్లోనే ఏదైనా చెబుతాడు. ఫైనల్లోనూ మేం ఇదే జోరును కొనసాగిస్తామనే నమ్మకంతో ఉన్నాం’’ అని తెలిపాడు. కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ కుటుంబం ఎప్పుడో ముంబయికి వచ్చి స్థిరపడింది. అతడి పూర్వీకులది తమిళనాడే.
పవర్ప్లే ఎంత ముఖ్యమో తెలుసు: స్టార్క్
డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (0)ను డకౌట్ చేసిన మిచెల్ స్టార్క్ హైదరాబాద్ను ఇబ్బందుల్లోకి నెట్టాడు. కీలకమైన మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గానూ నిలిచాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘టీ20ల్లో పవర్ ప్లే అత్యంత కీలకమని మాకు తెలుసు. ఇరు జట్లూ తొలి ఆరు ఓవర్లలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాయి. కానీ, మేం త్వరగా వికెట్లు తీయడంతో ఎస్ఆర్హెచ్పై ఒత్తిడి పెరిగింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దూకుడును చూశాం. లైన్ అండ్ లెంగ్త్తోపాటు బంతిని స్వింగ్ చేస్తే వారిని కట్టడి చేయొచ్చని భావించాం. అందుకు తగ్గట్టుగానే బంతులేశాం. హెడ్ను త్వరగా ఔట్ చేయగలిగాం. ప్రతిసారి ఇలా చేయడం కష్టమే. కానీ, ప్రయత్నిస్తే ఫలితం వస్తుంది. ఇప్పటికీ మా జట్టులో చాలామంది అద్భుతమైన నైపుణ్యం కలిగిన బౌలర్లు ఉన్నారు. వారికి ఇంకా అవకాశం రాలేదు’’ అని స్టార్క్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..