Sourav Ganguly: దిల్లీలో రెజ్లర్ల నిరసనలు.. గంగూలీ స్పందన ఇదే!
వీలైనంత త్వరగా రెజ్లర్ల సమస్య పరిష్కారం కావాలని భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఆకాంక్షించారు. అయితే, ఈ విషయం తనకు పూర్తి స్థాయి అవగాహన లేదని అందుకే ఎలాంటి కామెంట్స్ చేయదలచు కోలేదని చెప్పారు.
దిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా దిల్లీలో జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. ఈ అంశంపై మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) స్పందించారు. వాళ్ల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సి ఉందన్నారు. ఈ విషయంలో తనకు పెద్దగా అవగాహన లేదని అందుకే దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయదలచుకోలేదని గంగూలీ వ్యాఖ్యానించారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 23 నుంచి దిల్లీలోని జంతర్మంతర్ వద్ద రెజ్లర్లు నిరసన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఏడుగురు మహిళా రెజ్లర్లపై అతడు బెదిరింపులకు పాల్పడ్డారని, అందులో ఒకరు మైనర్ కూడా ఉన్నారని దిగ్గజ రెజ్లర్లంతా ఆరోపిస్తున్నారు.
దీనిపై గంగూలీ మాట్లాడుతూ..‘‘ వాళ్ల పోరాటం వాళ్లని చేసుకోనివ్వండి. అక్కడ ఏం జరుగుతోందో నాకు తెలియదు. వార్తాపత్రికల్లో చదివి కొన్ని విషయాలు తెలుసుకున్నా. కానీ, పూర్తి అవగాహన లేదు. క్రీడా ప్రపంచంలో నాకొక విషయం బోధపడింది. ఏ విషయం గురించైనా పూర్తిగా తెలియనప్పుడు.. దాని కోసం మాట్లాడకపోవడమే ఉత్తమం.’’ అని ఓ జాతీయ మీడియాతో అన్నారు. రెజ్లర్ల సమస్య పరిష్కారం అవుతుందనే భావిస్తున్నానని, వాళ్లంతా దేశానికి ఎన్నో పతకాలు తీసుకొచ్చి, ప్రపంచ దేశాలు భారత్ను ప్రశంసించేలా చేశారని అన్నారు. వాళ్ల సమస్యలు పరిష్కారం వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు గంగూలీ తెలిపారు.
బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని దేశంలోని ప్రముఖ మహిళా రెజ్లర్లు రెండు వారాల క్రితం జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే అతడిపై కేసు నమోదు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం బ్రిజ్ భూషణ్పై కేసు నమోదు చేయాలని దిల్లీ పోలీసులను ఆదేశిస్తూ విచారణను ముగించింది. ఈ మేరకు మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుతో పోక్సో కేసుతోపాటు, మరో కేసును నమోదు చేశారు. దీనిపై రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్ స్పందిస్తూ.. సుప్రీం కోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామని, కానీ, తమ నిరసన మాత్రం కొనసాగుతందని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలు రెజ్లర్లకు ఎదురుదెబ్బ కాదని, ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఏం చేయగలదో.. అదే పని చేసిందని ఆమె చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి