IND vs WI: వందో వన్డేలో 100 కొట్టారు.. ఎవరెవరో తెలుసా?
ఏ ఆటలోనైనా క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన చేయాలని చూస్తారు. మరీ ముఖ్యంగా తమకు అత్యంత ముఖ్యమైన గేమ్స్లో ఇంకాస్త మెరుగ్గా ఆడాలని భావిస్తారు...
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం: ఏ ఆటలోనైనా క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన చేయాలని చూస్తారు. మరీ ముఖ్యంగా తమకు అత్యంత ముఖ్యమైన గేమ్స్లో ఇంకాస్త మెరుగ్గా ఆడాలని భావిస్తారు. అలా ఎంతో మంది ఆశించినా వాటిని నిజం చేసుకునేది కొందరే. అలా క్రికెట్లో తమ వందో వన్డేలో సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ పలువురు ఉన్నారు. గతరాత్రి టీమ్ఇండియాతో జరిగిన మ్యాచ్లో విండీస్ ఓపెనర్ షై హోప్ కూడా ఈ ఘనత సాధించాడు. దీంతో ఇప్పటివరకు అలా తమ వందో వన్డేలో సెంచరీ కొట్టిన ఆటగాళ్లెవరో.. ఏ జట్టుపై ఎప్పుడు కొట్టారో తెలుసుకుందాం.
విండీస్ వాళ్లే నలుగురు..
తమ వందో వన్డేలో సెంచరీ కొట్టిన మొత్తం బ్యాట్స్మెన్ 10 మంది. అందులో విండీస్ ఆటగాళ్లే నలుగురు ఉండటం విశేషం. ఇక మిగతావారిలో న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, భారత జట్లకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. టీమ్ఇండియా నుంచి ఈ జాబితాలో శిఖర్ ధావన్ ఒక్కడే ఈ అరుదైన ఘనత సాధించాడు.
- గార్డన్ గ్రీనిడ్జ్: 1988లో వెస్టిండీస్ బ్యాట్స్మన్ గార్డన్ గ్రీనిడ్జ్ తొలిసారి ఈ అరుదైన రికార్డును నెలకొల్పాడు. పాకిస్థాన్తో ఆడిన తన వందో వన్డేలో 102 పరుగులు చేసి కొత్త రికార్డుకు తెరలేపాడు. అయితే, ఆ మ్యాచ్లో విండీస్ ఓటమిపాలవ్వడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 294/6 భారీ స్కోర్ చేయగా విండీస్ ఛేదనలో 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులే చేసింది.
- క్రిస్ కేన్స్: 1999లో న్యూజిలాండ్ బ్యాట్స్మన్ క్రిస్కేన్స్ టీమ్ఇండియాతో ఆడిన మ్యాచ్లో రెండోసారి ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 300/8 స్కోర్ చేయగా క్రిస్ కేన్స్ 115 పరుగులు చేశాడు. అయితే ఛేదనలో భారత్ 230 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది.
- మహ్మద్ యూసుఫ్: ఇక 2002లో పాకిస్థాన్ బ్యాట్స్మన్ మహ్మద్ యూసుఫ్ శ్రీలంకతో ఆడిన తన వందో వన్డేలో 129 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 295/6 భారీ స్కోర్ చేయగా ఛేదనలో శ్రీలంక 78 పరుగులకే ఆలౌటవ్వడం గమనార్హం. దీంతో పాక్ 217 పరుగులతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
- కుమార సంగక్కర: 2004లో శ్రీలంక బ్యాట్స్మన్ కుమార సంగక్కర ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అప్పుడు ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్లో అతడు 101 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసి 233 పరుగులు చేయగా ఛేదనలో లంక 193 పరుగులకే కుప్పకూలింది.
- క్రిస్ గేల్: 2004లోనే వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్మన్ క్రిస్గేల్ కూడా ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అప్పుడు ఇంగ్లాండ్తో జరిగిన తన వందో వన్డేలో అది కూడా క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో 132 పరుగులు చేసి ఈ రికార్డులో భాగమవ్వడమే కాకుండా ఈ జాబితాలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ 285/7 స్కోర్ సాధించగా విండీస్ 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది.
- మార్కస్ ట్రెస్కోతిక్: ఇక 2005లో ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ మార్కస్ ట్రెస్కోతిక్ సైతం ఈ ఘనత సాధించాడు. బంగ్లాదేశ్తో ఆడిన తన వందో వన్డేలో 100 పరుగులు చేసి ఈ అరుదైన రికార్డులో పాలుపంచుకున్నాడు. ఆ మ్యాచ్లో బంగ్లాదేశ్ 190 పరుగులకే ఆలౌటవ్వగా ఛేదలో ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయం సాధించింది.
- రామ్నరేశ్ శర్వన్: 2006లో వెస్టిండీస్ బ్యాట్స్మన్ రామ్నరేశ్ శర్వన్ కూడా ఈ ఘనత సాధించిన బ్యాట్స్మన్గా నిలిచాడు. టీమ్ఇండియాతో ఆడిన తన వందో వన్డేలో 115 పరుగులు చేశాడు. అప్పుడు భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 245/9 స్కోర్ చేయగా విండీస్ ఆరు వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలోనే శర్వన్ సైతం అరుదైన రికార్డులో ఏడో బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు.
- డేవిడ్ వార్నర్: 2017లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టీమ్ఇండియాపై ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్లో అతడు 124 పరుగులు సాధించి ఈ జాబితాలో ఎనిమిదో ఆటగాడిగా చేరాడు. అప్పుడు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 334/5 భారీ స్కోర్ చేయగా ఛేదనలో టీమ్ఇండియా 313/8తో సరిపెట్టుకుంది. దీంతో మ్యాచ్ ఓడిపోయింది.
- శిఖర్ ధావన్: 2018లో టీమ్ఇండియా బ్యాట్స్మన్ శిఖర్ ధావన్ సైతం ఈ అరుదైన రికార్డులో భాగమయ్యాడు. దక్షిణాఫ్రికాతో ఆడిన తన వందో వన్డేలో 109 పరుగులు సాధించి ఈ రికార్డు నెలకొల్పిన తొమ్మదో ఆటగాడిగా నిలిచాడు. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 289/7 స్కోర్ చేయగా ఛేదనలో దక్షిణాఫ్రికా 207/5తో నిలిచి డక్వర్త్ లూయిస్ పద్ధతిలో గెలిచింది.
- షై హోప్: ఇక తాజాగా గతరాత్రి వెస్టిండీస్ బ్యాట్స్మన్ షై హోప్ ఈ ఘనత సాధించిన పదో ఆటగాడిగా నిలిచాడు. టీమ్ఇండియాతో జరిగిన ఈ మ్యాచ్లో హోప్ తన వందో వన్డేలో 115 పరుగులు చేసి ఈ రికార్డులో తన పేరు కూడా లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 311/6 స్కోర్ చేయగా టీమ్ఇండియా 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు