Cricketers - Restaurants: రెస్టారెంట్ ఓనర్లుగా క్రికెటర్లు.. ఆ జాబితా చూసేద్దాం!
క్రికెటర్లు రెస్టారెంట్ల యజమానులుగా మారిపోయిన జాబితాలోకి టీమ్ఇండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా (Suresh Raina) చేరిపోయాడు. నెదర్లాండ్స్లో ఓ రెస్టారెంట్ను ప్రారంభించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా (Team India) మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తాజాగా రెస్టారెంట్ యజమానిగా మారిపోయాడు. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో రెస్టారెంట్ను ప్రారంభించాడు. రైనా కంటే ముందు అంతర్జాతీయ క్రికెటర్లు ‘ఫుడ్ బిజినెస్’లోకి ప్రవేశించారు. మరి ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారో ఓ లుక్ వేసేద్దాం..
- కపిల్ ఎలెవన్: టీమ్ ఇండియాకు తొలి వన్డే ప్రపంచకప్ను అందించిన సారథి కపిల్ దేవ్ (Kapil) 2008లో పట్నాలో ‘ఎలెవన్’ పేరిట రెస్టారెంట్ను ప్రారంభించాడు. ఇండియన్, పాన్ ఏషియన్, కాంటినెంటల్ వంటకాలను అక్కడ వడ్డిస్తారు. ఇక్కడ క్రికెట్కు సంబంధించిన పరికరాలు, ట్రోఫీల నకళ్లను ఉంచారు. లోపలికి వెళ్లగానే మైదానంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు ఉంటుంది.
- జడ్డూ ఫుడ్ ఫీల్డ్: ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) పదేళ్ల కిందటే ఫుడ్ బిజినెస్లోకి దిగాడు. అతడి కుటుంబ సభ్యులతో కలిసి ‘జడ్డూ ఫుడ్ ఫీల్డ్’ పేరిట రెస్టారెంట్ను ప్రారంభించాడు. రాజ్కోట్ వేదికగా 2012లో మొదలు పెట్టడం విశేషం. ఇండియన్, మెక్సికన్, చైనీస్, థాయ్, కాంటినెంటల్, పంజాబీ వంటకాలు అందుబాటులో ఉంటాయి.
- వన్8 కమ్యూనీ - న్యూవా: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన సొంతూరు దిల్లీలో ‘న్యూవా’తో పాటు వన్8 కమ్యూనీ అనే పేరుతో రెస్టారెంట్ చైన్ బిజినెస్ను నడిపిస్తున్నాడు. వన్ 8 కమ్యూనీని దిల్లీ, కోల్కతాలో నిర్వహిస్తున్నాడు. దేశ, విదేశాలకు చెందిన వంటకాలు, డ్రింక్స్ ఇక్కడ దొరుకుతాయి. తన సతీమణి అనుష్క శర్మతో కలిసి ప్రారంభించాడు.
- డైన్ ఫైన్: భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్కూ (Zaheer Khan) హోటల్ రంగంపై అమితమైన ప్రేమ ఉంది. పుణెలో 2005లోనే ‘డైన్ ఫైన్’ పేరుతో రెస్టారెంట్ను ప్రారంభించాడు. 2013లో టాస్ స్పోర్ట్స్ లాంజ్ను కూడా పుణెలోనే విస్తరించాడు. జహీర్ ఖాన్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ రెస్టారెంట్, లాంజ్ ఒక భాగం కావడం విశేషం.
- సచిన్స్: క్రికెట్లో వంద శతకాలు బాదిన సచిన్ తెందూల్కర్ (Sachin) కూడా మంచి ‘మాస్టర్’ చెఫ్. సరదాగా వంటలు చేస్తూ ఇటీవల వీడియోలను కూడా పోస్టు చేస్తుంటాడు. మరి అలాంటి సచిన్ కూడా రెస్టారెంట్లను ప్రారంభించాడు. ‘సచిన్స్’ పేరిట మొదలు పెట్టినప్పటికీ అనుకున్న విధంగా సక్సెస్ కాకపోవడంతో మధ్యలోనే మూసేయాల్సి వచ్చింది.
- మినిస్ట్రీ ఆఫ్ క్రాబ్: శ్రీలంక మాజీ క్రికెటర్లు మహేల జయవర్థెనె, కుమార సంగక్కర, ప్రముఖ చెఫ్ దర్శన్ మునిదస కలిసి సంయుక్తంగా రెస్టారెంట్లను ప్రారంభించారు. ఆరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం విశేషం. షాంఘై, మనీలా, కొలంబియా, చెంగ్దు, బ్యాంకాక్, ముంబయిలో రెస్టారెంట్లు ఉన్నాయి. సుందరమైన ప్రాంతంలో ఇష్టమైన ఫుడ్ను ఆస్వాదించే అర్థం వచ్చేలా రెస్టారెంట్లకు నామకరణం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన