T20 League: సత్తా ఉండాలే కానీ.. ఎవరిపైనైనా గెలవచ్చు..!
బౌలింగ్లో సత్తా ఉండాలే కానీ, ఎలాంటి మ్యాచ్నైనా సొంతం చేసుకోవచ్చు. గతరాత్రి లఖ్నవూ, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లోనూఇదే విషయం నిరూపితమైంది...
మోస్తరు, స్వల్ప లక్ష్యాలను కూడా కాపాడుకున్నారు..
బౌలింగ్లో సత్తా ఉండాలే కానీ, ఎలాంటి మ్యాచ్నైనా సొంతం చేసుకోవచ్చు. గతరాత్రి లఖ్నవూ, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లోనూ ఇదే నిరూపితమైంది. ఈ సీజన్లో ‘డ్యూ’ ప్రభావం అధికంగా ఉండటంతో చాలా జట్లు భారీ స్కోర్లను సైతం అలవోకగా ఛేదించేస్తున్నాయి. అయితే, పలు సందర్భాల్లో కొన్ని జట్లు మోస్తరు లక్ష్యాలను కూడా చేరలేక చతికిల పడుతున్నాయి. అందుకు మెరుగైన బౌలింగ్ ఒక కారణమైతే.. ఇంకోటి పిచ్ పరిస్థితులు కలిసొస్తున్నాయి. అలా ఈ సీజన్లో సాధారణ స్కోర్లను కూడా కాపాడుకున్న జట్లు, వాటి విశేషాలు తెలుసుకుందాం.
చాహల్, బౌల్ట్ మాయాజాలం..
ఈ సీజన్లో తొలిసారి మోస్తరు స్కోరును కాపాడుకున్న జట్టు రాజస్థాన్. లఖ్నవూతో ఆడిన తన నాలుగో మ్యాచ్లో యుజ్వేంద్ర చాహల్ మాయాజాలంతో రాజస్థాన్ 3 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 165/6 స్కోర్ సాధించింది. టాప్ ఆర్డర్ విఫలమైనా మధ్యలో షిమ్రన్ హెట్మెయిర్ (59*), అశ్విన్ (28) ఆదుకున్నారు. అయితే, లఖ్నవూ అంతకుముందే చెన్నైపై 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంతో ఇదేం పెద్ద స్కోర్ కాదనుకున్నారు. కానీ, చాహల్ 4/41, ట్రెంట్ బౌల్ట్ 2/30 విజృంభించడంతో లఖ్నవూ 162/8 స్కోరుకే పరిమితమైంది. ఈ స్టేడియంలోని బౌండరీ లైన్ దగ్గరగా ఉండటంతో పరుగుల వరద పారించొచ్చు. అందువల్లే ఇక్కడ సగటు స్కోర్ 180పైనే నమోదవుతుంది. అలాగే ఛేదన చేసే జట్టుకే విజయావకాశాలు ఎక్కువ. కానీ, ఈ మ్యాచ్లో లఖ్నవూ ఓడిందంటే అందుకు రాజస్థాన్ బౌలింగే కారణం.
షమి, రషీద్ఖాన్ ఆదుకున్నారు..
ఇక ఈ సీజన్లో రెండోసారి మోస్తరు స్కోరును కాపాడుకున్న జట్టు గుజరాత్. కోల్కతాతో ఆడిన తన ఏడో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 156/9 స్కోరే సాధించింది. డీవైపాటిల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య (67) మెరుపు బ్యాటింగ్ చేయడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది. ఈ పిచ్పై సగటు స్కోర్ 160 నుంచి 170 మధ్య నమోదవుతుంది. అయినా, గుజరాత్ తక్కవ స్కోరుకే పరిమితమవడంతో కోల్కతా తేలిగ్గానే ఛేదించేస్తుందనే నమ్మకం కలిగింది. అంతకుముందే ఆ జట్టు 170, 180, 200 స్కోర్లు సాధించింది. దీంతో కోల్కతా విజయం లాంఛనమే అనుకున్నారు. కానీ, గుజరాత్ బౌలర్లు షమి 2/20, రషీద్ ఖాన్ 2/22, దయాల్ 2/42 అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టు 148/8 స్కోరుకే పరిమితమైంది. దీంతో గుజరాత్ 8 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ పిచ్ నెమ్మదైందే అయినా గుజరాత్ నిర్దేశించిన లక్ష్యం ఛేదించదగిందే.
కుల్దీప్సేన్, అశ్విన్ చెలరేగి..
పుణెలోని ఎంసీఏ మైదానం వేదికగా బెంగళూరుతో తలపడిన మరో మ్యాచ్లోనూ రాజస్థాన్ తక్కువ స్కోర్ సాధించి విజయం దక్కించుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బెంగళూరు బౌలర్లు విజృంభించడంతో రాజస్థాన్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. మధ్యలో రియాన్ పరాగ్ (56*) ఒక్కడే మెరిసినా ఆ జట్టు పెద్ద స్కోర్ సాధించింది లేదు. 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులే చేసింది. అయితే, బెంగళూరు కూడా అంతకుముందు 200కు పైగా స్కోర్లు సాధించడంతో ఈ స్వల్ప లక్ష్యాన్ని తేలిగ్గా ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఆ జట్టు తడబడింది. కుల్దీప్ సేన్ 4/20, అశ్విన్ 3/17, ప్రసిద్ధ్ కృష్ణ 2/23 చెలరేగడంతో బెంగళూరు మరీ దారుణంగా ఓటమిపాలైంది. కెప్టెన్ డుప్లెసిస్ (23) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చివరికి 115 పరుగులకే ఆలౌటై రాజస్థాన్ 29 పరుగులతో విజయం సాధించింది. ఇక్కడ సగటు బ్యాటింగ్ స్కోర్ 160గా ఉండగా రెండు జట్లూ తక్కువ స్కోర్లే సాధించాయని అర్థమవుతోంది.
మోహ్సిన్, కృనాల్ రాణించి..
తాజాగా గతరాత్రి పుణె వేదికగా లఖ్నవూ, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా నామమాత్రమైన స్కోర్లే నమోదు చేసింది. లఖ్నవూ తొలుత బ్యాటింగ్ చేసి 153/8 స్కోరే సాధించింది. ఓపెనర్ డికాక్ (46) టాప్ స్కోరర్గా నిలిచాడు. స్లో పిచ్పై పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లఖ్నవూ బ్యాట్స్మెన్ పరుగులు చేసేందుకు తంటాలుపడ్డారు. రబాడ 4/38 గొప్పగా బౌలింగ్ చేశాడు. మరోవైపు పంజాబ్ అంతకుముందే పలుమార్లు 180, 190, 200కి పైగా స్కోర్లు సాధించడంతో ఇది కూడా గెలుస్తుందని అనుకున్నారు. కానీ, లఖ్నవూ బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. మోహ్సిన్ ఖాన్ 3/24, చమీరా 2/17, కృనాల్ పాండ్య 2/11 అత్యుత్తమ బౌలింగ్ చేయడంతో పంజాబ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మయాంక్ (25), బెయిర్స్టో (32) మెరిసినా చివర్లో ధాటిగా ఆడే బ్యాట్స్మెన్ లేక 133/8కే పరిమితమైంది. దీంతో లఖ్నవూ 20 పరుగుల తేడాతో ఊహించని విజయం తన ఖాతాలో వేసుకుంది.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్