IND vs NZ: బ్యాటర్లకు ‘పిచ్’ ఎక్కించింది.. ‘సుడులు’ తిప్పిన బౌలర్లు
భారత్ - న్యూజిలాండ్ (IND vs NZ) జట్ల మధ్య లఖ్నవూ వేదికగా (Lucknow) రెండో టీ20 మ్యాచ్ ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. చివరికి టీమ్ఇండియా (Team India) విజయం సాధించింది. అయితే పిచ్ విపరీతంగా స్పిన్నర్లకు సహకరించడంతో స్వల్ప స్కోర్లు నమోదు కావడం అభిమానులకు రుచించలేదు.
ఇంటర్నెట్ డెస్క్: లఖ్నవూ పిచ్.. బ్యాటర్ల గుండెల్లో ‘సుడులు’ తిప్పేసింది. వంద పరుగుల లక్ష్యమే కదా.. టీ20ల్లో ఆడుతూ పాడుతూ ఛేదించేస్తారని అంతా అనుకొన్నారు. కానీ, బ్యాటర్ల సామర్థ్యానికి సవాల్ విసురుతూ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపింది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో విజయం భారత పక్షమైనా.. చిన్న లక్ష్యాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నించిన న్యూజిలాండ్ పోరాటం కూడా ప్రశంసలు కురిపించింది. మరి ఇలాంటి పిచ్ పరిస్థితిపై ఇరు జట్ల సారథులు ముందే అంచనాకు వచ్చినప్పటికీ.. మరీ ఇలా ఉంటుందని మాత్రం వారు కూడా ఊహించలేకపోయారు.
‘‘ఇక్కడి పిచ్ గణాంకాలను పరిశీలిస్తే ఛేదన కష్టంగా మారే అవకాశం ఉంది. అందుకే తొలుత మేం బ్యాటింగ్ ఎంచుకొన్నాం’’.. ఇదీ కివీస్ సారథి మిచెల్ శాంట్నర్ టాస్ నెగ్గిన తర్వాత చెప్పిన మాట. అక్షరాలా పిచ్ స్వభావం చివరి వరకూ అలాగే సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ వంద లోపు స్కోరుకే పరిమితం కావడంతో సరిపోయింది. కనీసం మరో 10 నుంచి 20 పరుగులు చేసినా పరిస్థితి వేరేలా ఉండేదని భారత అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్ఇండియా కెప్టెన్ హార్దిక్ పాండ్య ‘‘ ఈ పిచ్ మమ్మల్ని షాక్కు గురి చేసింది. టర్నింగ్ మరీ విపరీతంగా ఉంది. టీ20లకు సరిపోయే వికెట్ మాత్రం కాదు. అందుకే క్యురేటర్ మంచి పిచ్ తయారీపై మరింత దృష్టిపెట్టాలి’’ అని వ్యాఖ్యానించాడు.
పిచ్ రిపోర్ట్ ఏం చెప్పింది..?
క్యురేటర్, క్రికెట్ విశ్లేషకుల అంచనాలను బట్టి లఖ్నవూ పిచ్ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోరు 157 కాగా.. రెండో ఇన్నింగ్స్లో 129 మాత్రమే. అందుకే టాస్ నెగ్గే జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకొంటుంది. పిచ్ మీద పగుళ్లు ఎక్కువగా ఉండటం వల్ల బంతి టర్నింగ్ ఎక్కువైంది. స్లో బౌలర్లకు సహకారం లభించింది. అందుకే కివీస్ ఎక్కువగా స్పిన్నర్లను ప్రయోగించిన విషయం గమనార్హం. అయితే బ్యాటింగ్లో కుదురుకుంటే మాత్రం భారీ ఇన్నింగ్స్లూ ఆడొచ్చని క్రీడా పండితుల విశ్లేషణ. లక్ష్యం తక్కువగా ఉంది కాబట్టి.. సూర్య (31 బంతుల్లో 26*), ఇషాన్ (32 బంతుల్లో 19) కొన్ని బంతులను వృథా చేసినా ఇబ్బంది లేకుండాపోయింది. అదే టార్గెట్ 120 పరుగులు ఉంటే మాత్రం భారత్కు కష్టంగానే మారేది. టీ20ల్లో క్రీజ్లో పాతుకుపోయేందుకు సమయం తీసుకోవడం కుదరదు. అందుకే భారత్ - కివీస్ రెండో టీ20 మ్యాచ్ చూశాక.. ఇలాంటి పిచ్ పొట్టి ఫార్మాట్కు పనికిరాదనే అభిప్రాయం అభిమానుల్లో నెలకొంది.
భారత బౌలింగ్ కోచ్ ఏమన్నాడంటే?
లఖ్నవూ పిచ్ గురించి కెప్టెన్ హార్దిక్ చేసిన వ్యాఖ్యలపై భారత బౌలింగ్ కోచ్ స్పందించాడు. ‘‘పిచ్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు సరైన వ్యక్తి క్యురేటర్ మాత్రమే. అతడే సమాధానం ఇవ్వగలడు. అయితే ఇలాంటి పిచ్ మీద ఆడటం మాత్రం పెద్ద సవాలే. అదృష్టవశాత్తూ మ్యాచ్ను మనం నియంత్రించాం. ఈ పిచ్ మీద 120-130 టార్గెట్ను ఛేదించడం చాలా కష్టంగా ఉండేది. టీమ్ఇండియా బౌలర్లు అద్భుతంగా బంతులను సంధించి కివీస్ను 99కే కట్టడి చేశారు. తొలుత పిచ్ను చూసినప్పుడు చాలా పొడిగా ఉంది. మధ్యలోనే కాస్త గ్రాస్ ఉంది. కానీ, వికెట్కు రెండు వైపులా పగుళ్లు వచ్చాయి. మ్యాచ్కు ముందు రోజే పిచ్ను చూడగానే.. ఇక్కడ టర్నింగ్ బాగుంటుందని, సవాల్ తప్పదని అనుకొన్నాం’’ అని పరాస్ మాంబ్రే వెల్లడించాడు.
అందరిలోనూ ఉత్కంఠ రేపింది..: వాషింగ్టన్
‘‘మాతోపాటు స్టేడియంలో, టీవీల్లో వీక్షించిన అభిమానులు.. అలాగే మీరు (కామెంటేటర్లు) కూడా ఉత్కంఠను అనుభవించారు. మ్యాచ్లో విజయం సాధించే వరకు కుదురుగా ఉండలేకపోయాం. ఇలాంటి పిచ్పై ఆడటం చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అన్ని జట్లూ ఇతర దేశాలకు పర్యటించినప్పుడు కావాల్సినన్ని బౌలింగ్ వనరులతో వస్తాయి. అయితే ఇలా ఎక్కువగా స్పిన్ పిచ్ల మీద ఆడేటప్పుడు నైపుణ్యమంతా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చివరికి విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఇక మ్యాచ్లో రనౌట్లు జరగడం సర్వసాధారణం. అయితే క్రీజ్లో సీనియర్ ఆటగాడు సూర్యకుమార్ ఉండటం చాలా ముఖ్యమనిపించింది’’ అని సుందర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు