Chennai vs Lucknow: శతకంతో అదరగొట్టిన స్టాయినిస్.. చెన్నైపై లఖ్నవూ థ్రిల్లింగ్ విక్టరీ
ఐపీఎల్-2024లో లఖ్నవూ ఐదో విజయాన్ని నమోదు చేసింది. చెన్నైతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచింది.
చెన్నై: ఐపీఎల్-2024లో లఖ్నవూ ఐదో విజయాన్ని నమోదు చేసింది. చెన్నైతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్నవూ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లఖ్నవూ బ్యాటర్లలో మార్కస్ స్టాయినిస్ (124*; 63 బంతుల్లో) శతకంతో అదరగొట్టాడు. పూరన్ (34; 14 బంతుల్లో), చివర్లో దీపక్ హూడా (17*; 6 బంతుల్లో) చెలరేగి ఆడారు. చెన్నై బౌలర్లలో పతిరన 2, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 1, దీపక్ చాహర్ 1 వికెట్ తీశారు.
స్టాయినిస్ అదిరిపోయే ఇన్నింగ్స్..
211 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన లఖ్నవూకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. క్వింటన్ డికాక్ను (0) చాహర్ బౌల్డ్ చేశాడు. ఇక ఐదో ఓవర్లో కెప్టెన్ కేఎల్ రాహుల్ (16: 14 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్లో గైక్వాడ్కు చిక్కాడు. అప్పటికి లఖ్నవూ స్కోర్ 33 పరుగులు. దీంతో క్రీజులోకి వచ్చిన దేవ్దత్ పడిక్కల్ (13: 19 బంతుల్లో)తో కలిసి స్టాయినిస్ (124*: 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్లు) మెళ్లిగా ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. ఆరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన స్టాయినిస్.. 8 ఓవర్లో ఒక సిక్స్, తొమ్మిదో ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టాడు. పది ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులతో నిలిచింది. అప్పటికే స్టాయినిస్ అర్ధశతకం (26 బంతుల్లో) చేశాడు. ఈ క్రమంలో పతిరన వేసిన 11 ఓవర్లో పడిక్కల్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పూరన్తో కలిసి స్టాయినిస్ ఇన్నింగ్స్ను పరుగులు పెట్టించాడు. 13వ ఓవర్లో మార్కస్ సిక్స్, ఫోర్ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. ఇక 16వ ఓవర్లో శార్దుల్ ఠాకూర్కు పూరన్ విశ్వరూపం చూపాడు. ఈ ఓవర్లో వరుసగా 6, 4, 6 కొట్టడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి.
దీంతో 4 ఓవర్లలో లఖ్నవూ విజయ లక్ష్యం 54 పరుగులుగా మారింది. 17వ ఓవర్ వేసిన పతిరన తన సూపర్ బౌలింగ్తో పూరన్ను ఔట్ చేయడమే కాకుండా కేవలం 7 పరుగులే ఇచ్చాడు. 18వ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ బౌలింగ్లో సిక్స్ బాదిన స్టాయినిస్ మరో రెండు పరుగులు చేసి ఈ సీజన్లో తొలి శతకం (56 బంతుల్లో) చేశాడు. మరో బ్యాటర్ హుడా చివరి బంతికి కొట్టడంతో ఈ ఓవర్లో 15 పరుగుల వచ్చాయి. దీంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 32గా మారింది. ఇక 19వ ఓవర్లో స్టాయినిస్ ఒక ఫోర్ కొట్టగా, హుడా రెండు ఫోర్లతో విరుచుకుపడడంతో ఈ ఓవర్లోనూ 15 పరుగుల వచ్చాయి. ఇక చివరి ఓవర్లో లఖ్నవూ లక్ష్యం 17 పరుగులుగా మారింది. స్ట్రైకింగ్లో ఉన్న స్టాయినిస్.. ముస్తాఫిజుర్ వేసిన తొలి బంతికి సిక్స్ కొట్టాడు. రెండో బంతిని ఫోర్ బాదాడు. మూడో బంతికి స్టాయినిస్ మరో ఫోర్ కొట్టడంతో పాటు అంఫైర్ దాన్ని నోబాల్గా ప్రకటించాడు. ఆ తర్వాతి బంతిని ఫోర్ కొట్టడంతో లఖ్నవూ సంబరాల్లో మునిగితేలింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (108*), శివం దుబే (66) చెలరేగి ఆడారు. లఖ్నవూ బౌలర్లలో హెన్రీ, మోసిన్ ఖాన్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అత్యుత్తమ వార్షిక జట్ల ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది. భారత్ ఎప్పటిలానే తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అగ్రస్థానంలో నిలిచింది. -
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
ముంబయితో మ్యాచ్కు ముందు ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అందరికంటే ఓ బ్యాటర్కు చాలా భయపడేవాడినని పేర్కొన్నాడు. -
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
వరల్డ్ కప్ కోసం స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడికే వైస్ కెప్టెన్సీని అప్పగించింది. -
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్ బౌలర్గా గొప్ప ప్రదర్శనేమీ ఇవ్వడం లేదు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టిన అతడు మరోసారి అవకాశం వస్తే చెలరేగుతానని వ్యాఖ్యనించాడు. -
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్పై కీలక ఇన్నింగ్స్ ఆడినా.. తన బెస్ట్ మాత్రం ఇది కాదంటున్నాడు. -
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!