Lucknow vs Punjab: ధావన్ పోరాటం వృథా.. బోణీ కొట్టిన లఖ్నవూ
ఐపీఎల్ - 2024 సీజన్లో లఖ్నవూ బోణీ కొట్టింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
లఖ్నవూ: ఐపీఎల్ - 2024 సీజన్లో లఖ్నవూ బోణీ కొట్టింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్నవూ 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో పంజాబ్కు శుభారంభమే దక్కినా చివర్లో దూకుడుగా ఆడలేక ఓటమిపాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (70; 50 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు) పోరాటం వృథా అయింది. జానీ బెయిర్స్టో (42; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం అందలేదు. ప్రభ్సిమ్రన్ సింగ్ (19; 7 బంతుల్లో) ధాటిగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. జితేశ్ శర్మ (6), సామ్ కరన్ (0) తీవ్రంగా నిరాశపర్చారు. లివింగ్స్టోన్ (28*; 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) మరింత దూకుడుగా ఆడితే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. లఖ్నవూ బౌలర్లలో అరంగేట్ర ఆటగాడు మయాంక్ యాదవ్ (3/27) అదరగొట్టాడు. మోసిన్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
లఖ్నవూ బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (54; 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకం బాదాడు. కెప్టెన్ నికోలస్ పూరన్ (42; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. చివర్లో కృనాల్ పాండ్య (43*; 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపులు మెరిపించడంతో లఖ్నవూ భారీ స్కోరు సాధించింది. స్టాయినిస్ (19), కేఎల్ రాహుల్ (15) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ 3, అర్ష్దీప్ సింగ్ 2, కగిసో రబాడ, రాహుల్ చాహర్ ఒక్కో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి