Lucknow vs Punjab: ధావన్ పోరాటం వృథా.. బోణీ కొట్టిన లఖ్నవూ
ఐపీఎల్ - 2024 సీజన్లో లఖ్నవూ బోణీ కొట్టింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
లఖ్నవూ: ఐపీఎల్ - 2024 సీజన్లో లఖ్నవూ బోణీ కొట్టింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్నవూ 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో పంజాబ్కు శుభారంభమే దక్కినా చివర్లో దూకుడుగా ఆడలేక ఓటమిపాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (70; 50 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు) పోరాటం వృథా అయింది. జానీ బెయిర్స్టో (42; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం అందలేదు. ప్రభ్సిమ్రన్ సింగ్ (19; 7 బంతుల్లో) ధాటిగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. జితేశ్ శర్మ (6), సామ్ కరన్ (0) తీవ్రంగా నిరాశపర్చారు. లివింగ్స్టోన్ (28*; 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) మరింత దూకుడుగా ఆడితే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. లఖ్నవూ బౌలర్లలో అరంగేట్ర ఆటగాడు మయాంక్ యాదవ్ (3/27) అదరగొట్టాడు. మోసిన్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
లఖ్నవూ బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (54; 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకం బాదాడు. కెప్టెన్ నికోలస్ పూరన్ (42; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. చివర్లో కృనాల్ పాండ్య (43*; 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపులు మెరిపించడంతో లఖ్నవూ భారీ స్కోరు సాధించింది. స్టాయినిస్ (19), కేఎల్ రాహుల్ (15) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్ 3, అర్ష్దీప్ సింగ్ 2, కగిసో రబాడ, రాహుల్ చాహర్ ఒక్కో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర