Team India: పొట్టి టోర్నీలో కథ ముగిసింది.. టీమ్ఇండియా ఓటమికి కీలక కారణాలు ఇవేనా!
టీ20 ప్రపంచకప్లో భారత్ సెమీస్లోనే పోరాటం ముగించింది. ఇంగ్లాండ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. కనీసం పోరాటం చేయకుండా చేతులెత్తేయడంతో టీమ్ఇండియా అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ఫార్మాట్ అంటేనే అనిశ్చితికి మారుపేరు. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అంచనా వేయడం చాలా కష్టం. తాజాగా టీ20 ప్రపంచకప్లోనే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. సెమీస్కు వస్తుందని భావించిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు గ్రూప్ స్టేజ్లోనే ఇంటిముఖం పట్టాయి. వరుసగా నాలుగు మ్యాచ్లు గెలవడంతోపాటు అదృష్టం తోడై పాకిస్థాన్ ఫైనల్కు వెళ్లింది. ఫేవరేట్గా బరిలోకి దిగిన టీమ్ఇండియా మాత్రం కీలకమైన సెమీస్లో బొక్కబోర్లాపడింది. ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. పొట్టి కప్ సెమీస్ టీమ్ఇండియా ఓటమితోపాటు టోర్నీలో ప్రదర్శనపై ప్రభావం చూపిన అంశాలు చాలానే ఉన్నాయి. అందులో మరీ ముఖ్యమైనవి ఏంటో ఓ సారి గమనిద్దాం..
పవర్ప్లేలో దూకుడు ఎక్కడ..?
టీ20 ఫార్మాట్లో ప్రతి బంతి.. ప్రతి ఓవరూ కీలకం. కానీ తొలి ఆరు ఓవర్లు అవేనండి పవర్ప్లే చాలా కీలకం. ఎందుకంటే ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించాలంటే.. ఆ 6 ఓవర్లలో వారి బౌలర్లను ఊచకోత కోయాలి. అప్పుడు తదుపరి వచ్చే బ్యాటర్లపైనా ఒత్తిడి పెద్దగా ఉండదు. కానీ టీమ్ఇండియా పరిస్థితిని చూస్తే.. ఒక్కసారంటే ఒక్కసారి కూడా 50 పరుగులు దాటిన పాపాన పోలేదు. భారత టీ20 లీగ్లో అయితే మన స్టార్ బ్యాటర్లు భారీ స్కోర్లతో విరుచుకుపడతారని.. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ఆడరనే విమర్శలు అభిమానుల నుంచి వస్తున్నాయి. లీగ్ స్టేజ్లో జింబాబ్వే మీదనే భారత్ అత్యధికంగా 46/1 స్కోరు చేసింది. ఇక సెమీస్లో అయితే కేవలం 38 పరుగులే చేసింది. ఇదే క్రమంలో ఇంగ్లాండ్ అయితే ఏకంగా 63 పరుగులు చేసి విజయం ఖరారు చేసుకొంది. ఇక ఓపెనర్ల సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి సాధికారికంగా ఒక్క ఇన్నింగ్సూ ఆడకపోవడం గమనార్హం.
బౌలింగ్లో ‘పేస్’ పసలేదు
ఆస్ట్రేలియా పిచ్లు అంటేనే ఫాస్ట్బౌలర్లకు స్వర్గధామం. అలాంటిది టీమ్ఇండియాకు టోర్నీకి ముందే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా గాయపడటంతో అతడు లేకుండా జట్టు ఆసీస్కు వచ్చేసింది. సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ ఉన్నా.. అతడికి టీ20ల్లో సాధన లేకపోవడం ఈ ప్రపంచకప్లో స్పష్టంగా కనిపించింది. పొట్టి కప్ ముందు వరకు ఎక్కువగా వన్డేల్లోనే ఆడిన షమీ.. అంతర్జాతీయ స్థాయిలో టీ20 మ్యాచ్ ఆడి దాదాపు సంవత్సరమైంది. అందుకే చాలా మంది సీనియర్లు, మాజీలు ఆసీస్ పేస్ పిచ్ల కోసం ఉమ్రాన్ మాలిక్ను తీసుకొంటే బాగుండేదని సూచనలు చేశారు. అర్ష్దీప్ సింగ్ ఫర్వాలేదనిపించినా.. భువీ, షమీ తమ స్థాయి ఆటను మాత్రం ప్రదర్శించలేదు. మరో పేసర్ హర్షల్ పటేల్ను జట్టుతోపాటు తీసుకెళ్లినా ఒక్క మ్యాచ్లోనూ ఆడించలేదు. పేస్ ఆల్రౌండర్గా అక్కరకొస్తాడని భావించిన హార్దిక్ పాండ్య.. ఒకటీఅరా మ్యాచ్ల్లో తప్ప కీలక పాత్ర పోషించిన దాఖలాలు తక్కువే.
చురుకైన ఫీల్డింగూ కరవు..
టీ20ల్లో చిరుతల్లా మైదానంలో తిరగాలి. ఎటు నుంచి బంతి వచ్చినా అందుకొనేలా పరుగెత్తాలి. టీమ్ఇండియా స్క్వాడ్లో విరాట్ కోహ్లీ మినహా ఎవరూ కూడా ఫీల్డింగ్లో మెప్పించలేదు. అయితే అలాంటి విరాట్ కూడా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా చేతిలో పడిన క్యాచ్ను వదిలి తీవ్ర విమర్శలపాలయ్యాడు. అయితే ఇక్కడ వయస్సు ప్రభావం కూడా టీమ్ఇండియాపై ఉందనేది విశ్లేషకుల వాదన. ఫినిషర్గా జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తిక్ (37) వయస్సు అందరికంటే ఎక్కువ. 15 మంది సభ్యుల్లో ఇద్దరు ముగ్గురు తప్పితే మిగతావారంతా 32 దాటినవారే కావడం గమనార్హం. ఇలాంటి ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ఫీల్డింగ్ను ఆశించడం అత్యాశే అవుతుందని క్రీడా పండితులు వ్యాఖ్యలు. ఆటపరంగా వీరంతా స్టార్లే.
రిస్ట్ స్పిన్నర్ లేకుండా..
టీ20 ప్రపంచకప్లో భారత్ ఆరు మ్యాచ్లను ఆడింది. ఇందులో ఐదు గ్రూప్ స్టేజ్లో కాగా.. మరొకటి సెమీస్లో తలపడంది. కానీ ఒక్క మ్యాచ్లోనూ వెంట తీసుకెళ్లిన యుజ్వేంద్ర చాహల్కు అవకాశం కల్పించకపోవడం గమనార్హం. అతడొక్కడే రిస్ట్ స్పిన్నర్. కానీ చాహల్కు బదులు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్కు ఎక్కువగా అవకాశాలు ఇచ్చింది. టీ20 ఫార్మాట్లో రిస్ట్ స్పిన్నర్లు రాణించిన దాఖలాలు అధికం. ఆస్ట్రేలియాలోనూ ప్రభావం చూపే ఆస్కారం ఎక్కువ. అంతేకాకుండా తాజాగా ఇంగ్లాండ్తో సెమీస్లోనూ ఆడించలేదు. ఇంగ్లాండ్పై చాహల్కు మంచి రికార్డే ఉంది. 11 టీ20ల్లో 16 వికెట్లు తీసి అదరహో అనిపించాడు. ఎకానమీ కూడా 8 మాత్రమే. ఇక టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు (6/25) కూడా ఇంగ్లాండ్పైనే చేశాడు. కానీ అతడికి అవకాశం ఇవ్వకుండా అక్షర్, అశ్విన్ను మాత్రమే కెప్టెన్ రోహిత్ శర్మ నమ్ముకోవడం కూడా భారత్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.
నిర్ణయాల్లో దూకుడు లేదు..
గతంలో చెప్పినట్లు ద్వైపాక్షిక సిరీసుల్లో జట్టును నడిపించడం పెద్ద విషయమే కాదు. అన్ని ఫార్మాట్లకు ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్. కానీ జట్టును ఆయా సందర్భాల్లో నడిపించేందుకు సిద్ధంగా అరడజను మంది కెప్టెన్లు రెడీగా ఉన్నారు. కానీ ఐసీసీ మెగా టోర్నీల్లో టీమ్కు నాయకత్వం వహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. జట్టుపై ఒత్తిడి, అంచనాలు భారీగా ఉంటాయి. మన సారథి రోహిత్ శర్మ విషయానికొస్తే.. కానీ మెగా టోర్నీల్లో మాత్రం మరోసారి విఫలమయ్యాడు. తుది జట్టు ఎంపిక నుంచి మైదానంలో ఎవరిని ఎప్పుడు వాడుకోవాలో అనే విషయాలపై పట్టును కోల్పోయినట్లు అనిపించింది. పరిస్థితికి తగ్గట్లుగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా అదే రొటీన్ ఫార్ములాను నమ్ముకోవడంతో కీలక సమయాల్లో పాలుపోని పరిస్థితి వచ్చేసింది. దీపక్ హుడా బ్యాటింగ్తోపాటు బౌలింగ్ చేయగలడు. అలాగే యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్కు ఒక్క అవకాశం ఇవ్వలేదు. ఫలితం ఎలా ఉన్నా జట్టులోని ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం మంచిదే కానీ.. కీలకమైన టోర్నీల్లో అది వర్కౌట్ కాదు.
‘‘ఎంఎస్ ధోనీ తర్వాత భారత్కు ఇద్దరు ప్రధాన సారథులు వచ్చారు. గత టీ20 ప్రపంచకప్ వరకు టీమ్ను అద్భుతంగా నడిపిన విరాట్ కోహ్లీ కూడా.. ఐసీసీ టోర్నీని గెలవలేదనే కారణంతో విమర్శలు ఎదుర్కొని మరీ కెప్టెన్సీని వదిలిపెట్టేశాడు. ఇప్పుడు రోహిత్ కూడా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమై విమర్శలపాలువుతున్నాడు. ఇప్పటికప్పుడు అతడి పదవికి పెద్ద ప్రమాదం ఏమీ లేకపోయినా.. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్లోనూ ఇలాంటి ప్రదర్శనే పునరావృతమైతే కెప్టెన్సీగండం తప్పదు’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్