FIFA World Cup: ఆట మధ్యలో.. మైదానంలోకి దూసుకొచ్చి నిరసన..
సోమవారం పోర్చుగల్, ఉరుగ్వే మధ్య పోరు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకొచ్చి పలు అంశాలపై నిరసన వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్ : ఇరాన్లో హిజాబ్కు వ్యతిరేకంగా మహిళల హక్కుల కోసం జరుగుతున్న పోరాటం ఇప్పుడు ఫిఫా ప్రపంచకప్ టోర్నీకి పాకింది. సోమవారం పోర్చుగల్, ఉరుగ్వే మధ్య పోరు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకొచ్చి ఇరాన్ ఆందోళనలు సహా పలు అంశాలపై నిరసన వ్యక్తం చేశాడు.
మ్యాచ్ రెండో అర్ధభాగంలో ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకొచ్చాడు. ‘ఇరాన్ మహిళలను గౌరవించండి’ అని రాసి ఉన్న టీషర్ట్ ధరించి.. రెయిన్బో రంగుల జెండా పట్టుకుని దాదాపు 30 సెకన్లపాటు మైదానంలో పరిగెత్తాడు. అతడి టీషర్ట్ ముందుభాగంపై ‘సేవ్ ఉక్రెయిన్’ అని కూడా రాసి ఉంది. వెంటనే అప్రమత్తమైన భద్రతాసిబ్బంది అతడిని వెంబడించి మైదానం వెలుపలికి తీసుకొచ్చారు. ఈ ఘటనతో అసలు ఏం జరిగిందోనని ఆటగాళ్లు కాసేపు కంగారు పడ్డారు.
‘ఈ ప్రపంచకప్ చుట్టూ ఏం జరుగుతుందో మాకు తెలుసు..ఇలాంటి ఘటనలు మామూలే. ఆ నిరసనకారుడి ఉద్దేశాన్ని మేం అర్థం చేసుకున్నాం. మనమందరం ఇరాన్, ఇరాన్ మహిళలకు మద్దతుగా ఉన్నాం. ఇలాంటివి మరోసారి జరగవని ఆశిస్తున్నాం’ అని పోర్చుగల్ ఆటగాడు రూబెన్ అన్నాడు. మైదానంలో నిరసన చేపట్టిన వ్యక్తిని ఇటలీకి చెందిన మారియో ఫెర్రీగా గుర్తించారు. గత ప్రపంచకప్ టోర్నీల్లో కూడా అతడు ఇలాగే నిరసన ప్రదర్శనలు చేపట్టినట్లు భద్రతా సిబ్బంది తెలిపారు.
స్వలింగ సంపర్కం ఖతార్లో చట్ట విరుద్ధం. వారి హక్కుల కోసం ఇలా రెయిన్బో జెండాతో ఈ ప్రపంచకప్లో నిరసనలు చేపట్టడం నిర్వహకులకు తలనొప్పిగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం