WPL 2024: ఈ కప్ వారి కోసమే.. మాటలు రావడం లేదు: స్మృతి మంధాన
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి ఛాంపియన్గా నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో 16 సీజన్లలో పురుషుల జట్టుకు సాధ్యం కాని కలను రెండో సీజన్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మహిళా జట్టు నెరవేర్చింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) ఫైనల్లో దిల్లీని చిత్తు చేసి సగర్వంగా కప్ను అందుకొంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ స్మృతి మంధాన స్పందిస్తూ.. ఈ విజయం జట్టుకు అత్యంత నమ్మకమైన అభిమానుల కోసమేనని వ్యాఖ్యానించింది.
‘‘మేం విజయం సాధించామనే వాస్తవాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాం. కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఛాంపియన్గా నిలవడంపై ఎలా స్పందించాలో తెలియడం లేదు. కానీ, ఒక మాట చెబుతా. మా ఆటపై గర్వంగా ఉంది. ఎన్నో ఎత్తు పల్లాలను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చాం. గతాన్ని మరిచి ఇప్పుడు విజేతగా నిలిచాం. ఇదొక అద్భుతమైన అనుభూతి. మాకు లీగ్ దశలో చివరి మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. దానిని అధిగమించాం. తర్వాత సెమీస్, ఫైనల్లోనూ విజేతగా నిలిచాం. ఇలాంటి పెద్ద టోర్నీల్లో సరైన సమయంలో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాం. గతేడాది నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకున్నాం. మేనేజ్మెంట్ మామీద నమ్మకం ఉంచింది. జట్టుగా మేం ఆర్సీబీ తరఫున టైటిల్ సాధించాం. తప్పకుండా టాప్ -5 అద్భుత విజయాల్లో ఇదొకటి. వరల్డ్ కప్ ఎప్పటికీ టాప్. ఆర్సీబీ అభిమానుల నుంచి చాలా మెసేజ్లు వచ్చాయి. ‘ఈ సాలా కప్ నమదే’ ప్రతిసారి వినిపించే నినాదం. ఇప్పుడు దానిని నిజం చేసి నిరూపించాం’’ అని స్మృతి మంధాన వెల్లడించింది.
వీడియో కాల్లో విరాట్
తొలిసారి ఛాంపియన్ కావడంపై ఆర్సీబీపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. మ్యాచ్ అనంతరం కెప్టెన్ స్మృతి మంధానతో విరాట్ కోహ్లీ వీడియో కాల్లో మాట్లాడాడు. అందరికీ శుభాకాంక్షలు చెప్పిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అతడు తన ఇన్స్టా స్టోరీస్లోనూ ‘సూపర్ వుమెన్’ అంటూ జట్టు ఫొటోకు క్యాప్షన్ జోడించాడు.
జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా కూడా ఎక్స్లో ట్వీట్ చేశాడు. ‘‘ఆర్సీబీ మహిళా జట్టుకు అభినందనలు. డబ్ల్యూపీఎల్ విజేతగా నిలవడం అద్భుతం. పురుషుల జట్టు కూడా ఐపీఎల్ గెలిస్తే డబుల్ బొనాంజా అవుతుంది. గుడ్ లక్’’ అని ట్వీట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి