WPL 2024: ఈ కప్ వారి కోసమే.. మాటలు రావడం లేదు: స్మృతి మంధాన
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి ఛాంపియన్గా నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో 16 సీజన్లలో పురుషుల జట్టుకు సాధ్యం కాని కలను రెండో సీజన్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మహిళా జట్టు నెరవేర్చింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) ఫైనల్లో దిల్లీని చిత్తు చేసి సగర్వంగా కప్ను అందుకొంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ స్మృతి మంధాన స్పందిస్తూ.. ఈ విజయం జట్టుకు అత్యంత నమ్మకమైన అభిమానుల కోసమేనని వ్యాఖ్యానించింది.
‘‘మేం విజయం సాధించామనే వాస్తవాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాం. కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఛాంపియన్గా నిలవడంపై ఎలా స్పందించాలో తెలియడం లేదు. కానీ, ఒక మాట చెబుతా. మా ఆటపై గర్వంగా ఉంది. ఎన్నో ఎత్తు పల్లాలను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చాం. గతాన్ని మరిచి ఇప్పుడు విజేతగా నిలిచాం. ఇదొక అద్భుతమైన అనుభూతి. మాకు లీగ్ దశలో చివరి మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. దానిని అధిగమించాం. తర్వాత సెమీస్, ఫైనల్లోనూ విజేతగా నిలిచాం. ఇలాంటి పెద్ద టోర్నీల్లో సరైన సమయంలో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాం. గతేడాది నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకున్నాం. మేనేజ్మెంట్ మామీద నమ్మకం ఉంచింది. జట్టుగా మేం ఆర్సీబీ తరఫున టైటిల్ సాధించాం. తప్పకుండా టాప్ -5 అద్భుత విజయాల్లో ఇదొకటి. వరల్డ్ కప్ ఎప్పటికీ టాప్. ఆర్సీబీ అభిమానుల నుంచి చాలా మెసేజ్లు వచ్చాయి. ‘ఈ సాలా కప్ నమదే’ ప్రతిసారి వినిపించే నినాదం. ఇప్పుడు దానిని నిజం చేసి నిరూపించాం’’ అని స్మృతి మంధాన వెల్లడించింది.
వీడియో కాల్లో విరాట్
తొలిసారి ఛాంపియన్ కావడంపై ఆర్సీబీపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. మ్యాచ్ అనంతరం కెప్టెన్ స్మృతి మంధానతో విరాట్ కోహ్లీ వీడియో కాల్లో మాట్లాడాడు. అందరికీ శుభాకాంక్షలు చెప్పిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అతడు తన ఇన్స్టా స్టోరీస్లోనూ ‘సూపర్ వుమెన్’ అంటూ జట్టు ఫొటోకు క్యాప్షన్ జోడించాడు.
జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా కూడా ఎక్స్లో ట్వీట్ చేశాడు. ‘‘ఆర్సీబీ మహిళా జట్టుకు అభినందనలు. డబ్ల్యూపీఎల్ విజేతగా నిలవడం అద్భుతం. పురుషుల జట్టు కూడా ఐపీఎల్ గెలిస్తే డబుల్ బొనాంజా అవుతుంది. గుడ్ లక్’’ అని ట్వీట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్