Hyderabad vs Gujarat: వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు.
గుజరాత్తో సన్రైజర్స్ మ్యాచ్ వర్షార్పరణం
ప్లేఆఫ్స్కు హైదరాబాద్
ఈనాడు - హైదరాబాద్
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. గురువారం వర్షం కారణంగా గుజరాత్తో సన్రైజర్స్ మ్యాచ్ రద్దయింది. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ దక్కింది. 15 పాయింట్లతో సన్రైజర్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. ఇప్పటికే కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో జట్టుకు మాత్రమే గరిష్ఠంగా 16 పాయింట్లు సాధించే అవకాశం ఉండటంతో సన్రైజర్స్ మూడో జట్టుగా ముందంజ వేసింది. గత మూడు సీజన్లలో తీవ్రంగా నిరాశపర్చిన సన్రైజర్స్.. 2020 తర్వాత తొలిసారి ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది. హైదరాబాద్లో ఓ ఐపీఎల్ మ్యాచ్ రద్దవడం ఇదే తొలిసారి. ఉప్పల్లో మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మొదలైన వర్షం సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసింది. ఆ తర్వాత ఓ రెండు గంటలు తెరిపినివ్వడంతో మ్యాచ్ కోసం మైదానాన్ని సిద్ధం చేసేందుకు సిబ్బంది కృషి చేశారు. ముఖ్యంగా ఔట్ఫీల్డ్ను ఆరబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అప్పటికే టాస్ ఆలస్యమైంది. 8 గంటలకు టాస్ వేసేందుకు అంతా సిద్ధమవుతోందని అనుకునేలోపే వరుణుడు మళ్లీ వచ్చాడు. ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ సారి వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో చివరికి 10:10 గంటలకు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. ఈ మ్యాచ్ టికెట్ల ధరను తిరిగి చెల్లిస్తామని ఫ్రాంఛైజీ ప్రకటించింది. మధ్యలో డీజే పాటలు, లైట్ల వెలుగుల్లో స్టేడియం హోరెత్తింది.
ఆ మూడు మ్యాచ్లు: లీగ్ దశలో ఇంకా నాలుగు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. దిల్లీ ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించింది. శుక్రవారం ముంబయితో మ్యాచ్లో లఖ్నవూ విజయం సాధించినా.. చెన్నై, బెంగళూరు రన్రేట్ను అధిగమించే అవకాశం లేనందున ఆ మ్యాచ్ నామమాత్రమే. కానీ మిగతా మూడు మ్యాచ్లు కీలకమైనవి. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్తో ప్లేఆఫ్స్ చేరే చివరిదైన నాలుగో జట్టేదో తేలిపోతుంది. ఇక ఆదివారం సన్రైజర్స్తో పంజాబ్, రాజస్థాన్తో కోల్కతా మ్యాచ్లతో వరుసగా టాప్-4 స్థానాలు ఖరారు కానున్నాయి. మరే జట్టు కూడా 18 పాయింట్ల కంటే ఎక్కువ సాధించే అవకాశం లేకపోవడంతో 19 పాయింట్లతో ఉన్న కోల్కతా అగ్రస్థానం పదిలమైంది. కోల్కతాపై రాజస్థాన్ గెలిస్తే 18 పాయింట్లతో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంటుంది. ఒకవేళ రాజస్థాన్ ఓడి.. పంజాబ్పై సన్రైజర్స్ గెలిస్తే అప్పుడు హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకుతుంది. దీంతో నేరుగా ఫైనల్లో చోటు కోసం తొలి క్వాలిఫయర్లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంటుంది. సన్రైజర్స్ ఓడి.. ఆర్సీబీపై చెన్నై గెలిస్తే 16 పాయింట్లతో సీఎస్కే పట్టికలో పైకి వెళ్తుంది. అప్పుడు సన్రైజర్స్ నాలుగో స్థానంతో ముగిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్