Amol Kale: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ చూసొచ్చి..

ముంబయి క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు అమోల్‌ కాలె (47) కన్నుమూశారు. న్యూయార్క్‌లో భారత్, పాకిస్థాన్‌ మధ్య టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌కు హాజరైన కాలె గుండె పోటుతో తుది శ్వాస విడిచారు.

Published : 11 Jun 2024 03:17 IST

ముంబయి: ముంబయి క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు అమోల్‌ కాలె (47) కన్నుమూశారు. న్యూయార్క్‌లో భారత్, పాకిస్థాన్‌ మధ్య టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌కు హాజరైన కాలె గుండె పోటుతో తుది శ్వాస విడిచారు. ఆదివారం ఎంసీఏ కార్యదర్శి ఆజింక్య నాయక్, ఎపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుడు సూరజ్‌ సమత్‌తో కలిసి కాలె నాసా కౌంటీ క్రికెట్‌ స్టేడియంలో దాయాదుల మ్యాచ్‌ చూశారు. 2022 అక్టోబరులో జరిగిన ఎంసీఏ ఎన్నికల్లో భారత మాజీ ఆటగాడు సందీప్‌ పాటిల్‌పై కాలె విజయం సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు