IPL 2024 Auction: ఐపీఎల్ వేలంలో అతడు అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలుస్తాడు.. కానీ: ఆకాశ్ చోప్రా
డిసెంబరు 19 జరిగే ఐపీఎల్ మినీ వేలంలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ భారీ ధర దక్కించుకుంటాడని టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా (Aakash Chopra) అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-2024 (IPL 2024) సీజన్ కోసం డిసెంబరు 19న దుబాయ్ వేదికగా మినీ వేలం నిర్వహించనున్నారు. అన్ని ఫ్రాంఛైజీల్లో కలిపి 77 ఖాళీలు ఉండగా.. మొత్తం 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్ దేశాల నుంచి ఇద్దరు ఉన్నారు. వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ.262.95 కోట్లు ఉన్నాయి. ఆసీస్ ఆటగాళ్లు కమిన్స్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ స్టార్క్ (Mitchell Starc)లు తమ కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఈ వేలంలో మిచెల్ స్టార్క్ భారీ ధర దక్కించుకుని అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉందని టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా (Aakash Chopra) అభిప్రాయపడ్డాడు. స్టార్క్ ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్లో ఆడబోతున్నాడు. అతడు 2014, 2015 సీజన్లలో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించి 34 వికెట్లు పడగొట్టాడు. తర్వాత అంతర్జాతీయ క్రికెట్పై దృష్టిపెట్టడం కోసం ఐపీఎల్కు దూరంగా ఉన్నాడు.
‘‘ఐపీఎల్ వేలంలో మిచెల్ స్టార్క్ భారీ ధర దక్కించుకుంటాడు. ఇటీవల ఆస్ట్రేలియా తరఫున ఆడిన దాదాపు అందరూ ఐపీఎల్ వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కానీ, వారందరిలో మిచెల్ స్టార్క్ ఎక్కువ ఆకర్షిస్తున్నాడు. అతడు కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఆరంభంలో వికెట్లు పడగొట్టడంతోపాటు యార్కర్లు వేస్తాడు. మంచి డెత్ బౌలర్ కూడా. ఐపీఎల్లో స్టార్క్కు మంచి గణాంకాలు కూడా ఉన్నాయి. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) తరపున బాగా ఆడాడు. కానీ, ఆ తర్వాత అతడు లీగ్లో ఆడటానికి ఆసక్తి చూపకపోవడం ఆందోళన కలిగించే అంశం.
ఒక జట్టు అతడిని కొనుగోలు చేసిన తర్వాత యాషెస్ సిరీస్ లేదా ఏదైనా వ్యక్తిగత కారణాలతో చివరి క్షణంలో ఐపీఎల్కు దూరమైతే సదరు జట్టు ఇబ్బందుల్లో పడుతుంది. అతడు వెళ్లిపోతే ఆ ఫ్రాంఛైజీకి డబ్బు వస్తుంది. కానీ, కీలక ఆటగాళ్లు జట్టులో ఉండరు. ఈ వేలంలో స్టార్క్తో పాటు గెరాల్డ్ కొయెట్జీ, జోష్ హేజిల్వుడ్, దిల్షాన్ మధుశంక, బెన్ డ్వార్షిస్ ఇతర కీలక బౌలర్లు ఉన్నారు. కానీ, స్టార్క్ని కొనుగోలు చేసిన తర్వాత అతడు లీగ్ నుంచి వైదొలిగితే మళ్లీ కీలక బౌలర్లను తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఏది ఏమైనా ఈ వేలంలో స్టార్క్ భారీ ధర పలికితే నేను ఆశ్చర్యపోను. కానీ, లీగ్ మొత్తానికి అతడు అందుబాటులో ఉంటాడా లేదా అనే చిన్న అనుమానం ఉంది’’ అని ఆకాశ్ చోప్రా వివరించాడు.
ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్, ముక్కోణపు సిరీస్కు భారత జట్టు ప్రకటన
అండర్-19 లెవల్లో భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబరు 29 నుంచి ముక్కోణపు సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్లో ఫైనల్ మ్యాచ్ 2024, జనవరి 10న జరగనుంది. అనంతరం భారత జట్టు అండర్-19 ప్రపంచకప్లో ఆడనుంది. ఈ రెండు సిరీస్ల కోసం జూనియర్ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది.
భారత జట్టు:
ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాన్షు మోలియా, ముషీర్ ఖాన్, అరవెల్లి అన్వేష్ రావు, మురుగున్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్, ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ.
ముక్కోణపు సిరీస్కు ముగ్గురిని (ప్రేమ్ దేవ్కర్, అన్ష్ గోసాయి, ఎండీ అమన్) ట్రావెలింగ్ స్టాండ్బై ఆటగాళ్లుగా ఎంపిక చేసిన సెలక్టర్లు దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, విఘ్నేష్, కిరణ్ చోర్మలేను బ్యాకప్ ప్లేయర్లుగా తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?