IPL 2024 Auction: ఐపీఎల్ వేలంలో అతడు అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలుస్తాడు.. కానీ: ఆకాశ్ చోప్రా
డిసెంబరు 19 జరిగే ఐపీఎల్ మినీ వేలంలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ భారీ ధర దక్కించుకుంటాడని టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా (Aakash Chopra) అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-2024 (IPL 2024) సీజన్ కోసం డిసెంబరు 19న దుబాయ్ వేదికగా మినీ వేలం నిర్వహించనున్నారు. అన్ని ఫ్రాంఛైజీల్లో కలిపి 77 ఖాళీలు ఉండగా.. మొత్తం 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్ దేశాల నుంచి ఇద్దరు ఉన్నారు. వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ.262.95 కోట్లు ఉన్నాయి. ఆసీస్ ఆటగాళ్లు కమిన్స్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ స్టార్క్ (Mitchell Starc)లు తమ కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఈ వేలంలో మిచెల్ స్టార్క్ భారీ ధర దక్కించుకుని అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉందని టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా (Aakash Chopra) అభిప్రాయపడ్డాడు. స్టార్క్ ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్లో ఆడబోతున్నాడు. అతడు 2014, 2015 సీజన్లలో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించి 34 వికెట్లు పడగొట్టాడు. తర్వాత అంతర్జాతీయ క్రికెట్పై దృష్టిపెట్టడం కోసం ఐపీఎల్కు దూరంగా ఉన్నాడు.
‘‘ఐపీఎల్ వేలంలో మిచెల్ స్టార్క్ భారీ ధర దక్కించుకుంటాడు. ఇటీవల ఆస్ట్రేలియా తరఫున ఆడిన దాదాపు అందరూ ఐపీఎల్ వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కానీ, వారందరిలో మిచెల్ స్టార్క్ ఎక్కువ ఆకర్షిస్తున్నాడు. అతడు కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఆరంభంలో వికెట్లు పడగొట్టడంతోపాటు యార్కర్లు వేస్తాడు. మంచి డెత్ బౌలర్ కూడా. ఐపీఎల్లో స్టార్క్కు మంచి గణాంకాలు కూడా ఉన్నాయి. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) తరపున బాగా ఆడాడు. కానీ, ఆ తర్వాత అతడు లీగ్లో ఆడటానికి ఆసక్తి చూపకపోవడం ఆందోళన కలిగించే అంశం.
ఒక జట్టు అతడిని కొనుగోలు చేసిన తర్వాత యాషెస్ సిరీస్ లేదా ఏదైనా వ్యక్తిగత కారణాలతో చివరి క్షణంలో ఐపీఎల్కు దూరమైతే సదరు జట్టు ఇబ్బందుల్లో పడుతుంది. అతడు వెళ్లిపోతే ఆ ఫ్రాంఛైజీకి డబ్బు వస్తుంది. కానీ, కీలక ఆటగాళ్లు జట్టులో ఉండరు. ఈ వేలంలో స్టార్క్తో పాటు గెరాల్డ్ కొయెట్జీ, జోష్ హేజిల్వుడ్, దిల్షాన్ మధుశంక, బెన్ డ్వార్షిస్ ఇతర కీలక బౌలర్లు ఉన్నారు. కానీ, స్టార్క్ని కొనుగోలు చేసిన తర్వాత అతడు లీగ్ నుంచి వైదొలిగితే మళ్లీ కీలక బౌలర్లను తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఏది ఏమైనా ఈ వేలంలో స్టార్క్ భారీ ధర పలికితే నేను ఆశ్చర్యపోను. కానీ, లీగ్ మొత్తానికి అతడు అందుబాటులో ఉంటాడా లేదా అనే చిన్న అనుమానం ఉంది’’ అని ఆకాశ్ చోప్రా వివరించాడు.
ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్, ముక్కోణపు సిరీస్కు భారత జట్టు ప్రకటన
అండర్-19 లెవల్లో భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబరు 29 నుంచి ముక్కోణపు సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్లో ఫైనల్ మ్యాచ్ 2024, జనవరి 10న జరగనుంది. అనంతరం భారత జట్టు అండర్-19 ప్రపంచకప్లో ఆడనుంది. ఈ రెండు సిరీస్ల కోసం జూనియర్ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది.
భారత జట్టు:
ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాన్షు మోలియా, ముషీర్ ఖాన్, అరవెల్లి అన్వేష్ రావు, మురుగున్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్, ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ.
ముక్కోణపు సిరీస్కు ముగ్గురిని (ప్రేమ్ దేవ్కర్, అన్ష్ గోసాయి, ఎండీ అమన్) ట్రావెలింగ్ స్టాండ్బై ఆటగాళ్లుగా ఎంపిక చేసిన సెలక్టర్లు దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, విఘ్నేష్, కిరణ్ చోర్మలేను బ్యాకప్ ప్లేయర్లుగా తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల