MIw vs UPw: నాట్సీవర్ బ్రంట్ అర్ధ శతకం.. యూపీ లక్ష్యం 183
యూపీ వారియర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబయి ఇన్నింగ్స్ ముగిసింది. 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ముంబయి: యూపీ వారియర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. నాట్సీవర్ బ్రంట్ (72 నాటౌట్; 38 బంతుల్లో 9×4, 2×6) అర్ధ శతకంతో చెలరేగగా.. ఓపెనర్లు యాస్తికా భాటియా (21), హెయిలీ మ్యాథ్యూస్ (26), హర్మన్ ప్రీత్ కౌర్ (14), కేర్ (29) పరుగులు చేశారు. యూపీ బౌలర్లలో సోఫీ రెండు వికెట్లు పడగొట్టగా.. అంజలి శ్రావణి, పర్షవి చోప్రా చెరో వికెట్ తీశారు.
బ్యాటింగ్ ప్రారంభించిన ముంబయి.. ఆది నుంచే ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలు పెట్టింది. ఓపెనర్లు భాటియా, మ్యాథ్యూస్ ఆచితూచి ఆడుతూ.. ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని అంజలి శ్రావణి విడగొట్టింది. ఐదో ఓవర్ రెండో బంతికి కిరణ్ నవగిరేకి క్యాచ్ ఇచ్చి భాటియా వెనుదిరిగింది. తర్వాత క్రీజులోకి వచ్చిన బ్రంట్తో కలిసి మ్యాథ్యూస్ ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించింది. కానీ, జట్టు స్కోరు 69 పరుగుల వద్ద చోప్రా బౌలింగ్లో కిరణ్ నవగిరే చేతికే చిక్కింది.
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరగడంతో జట్టు భారాన్ని బ్రంట్ తనపై వేసుకుంది. క్రీజులో నిలదొక్కుకుంటూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించింది. థర్డ్ డౌన్లో వచ్చిన కేర్తో కలిసి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టింది. అవతలి ఎండ్లో వస్తున్నవారు తక్కువ పరుగులకే వెనుదిరుగుతున్నా.. బ్రంట్ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడింది. దీంతో ముంబయి 183 పరుగుల లక్ష్యాన్ని యూపీ ముందు ఉంచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం