Mohammed Kaif: షమి తమ్ముడొస్తున్నాడు.. ఎవరీ కైఫ్
మహమ్మద్ షమి కుటుంబం నుంచి మరో పేసర్ దూసుకొస్తున్నాడు. అన్నకు తగ్గ తమ్ముడిగా పేరు తెచ్చుకుంటూ.. అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనే లక్ష్యంతో సాగుతున్నాడు.
మహమ్మద్ షమి (Mohammed Shami).. టీమ్ఇండియాలో ప్రధాన బౌలర్. గతేడాది భారత్లో జరిగిన వన్డే ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శనతో చెలరేగాడు. భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టెస్టులు, టీ20ల్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు అతను గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో అతడు లేని లోటు కనిపించింది. ఇప్పుడు షమి బాటలోనే సాగుతూ.. అతడి కుటుంబం నుంచి మరో పేసర్ దూసుకొస్తున్నాడు. అన్నకు తగ్గ తమ్ముడిగా పేరు తెచ్చుకుంటూ.. అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనే లక్ష్యంతో సాగుతున్నాడు. బెంగాల్ తరపున రంజీ అరంగేట్రం చేశాడు. అతనే.. మహమ్మద్ కైఫ్ (Mohammed Kaif).. షమి లాగే ఫాస్ట్బౌలర్ అయిన కైఫ్.. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.
అన్న స్ఫూర్తితో..
అన్న షమి లాగే కైఫ్కు కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. తనకంటే ఆరేళ్ల పెద్దవాడైన షమి.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శనతో సాగుతుండటం చూసి అతడు స్ఫూర్తి పొందుతున్నాడు. టీమ్ఇండియాకు ఆడాలనే లక్ష్యంతో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. 27 ఏళ్ల కైఫ్.. మంచి వేగం, సీమ్, స్వింగ్తో ఆకట్టుకుంటున్నాడు. ఈ రైటార్మ్ పేసర్ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకూ తొమ్మిది లిస్ట్- ఎ మ్యాచ్ల్లో 26.33 సగటుతో 12 వికెట్లు పడగొట్టాడు. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో పుట్టిన అతడు.. 2021లో జమ్ముకశ్మీర్తో మ్యాచ్తో బెంగాల్ తరఫున లిస్ట్- ఎ అరంగేట్రం చేశాడు. గతేడాది విజయ్ హజారే టోర్నీలో 7 మ్యాచ్ల్లో 12 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. గోవాపై మూడు వికెట్లు రాబట్టాడు. బరోడా, తమిళనాడు, పంజాబ్, హరియాణాపై రెండు వికెట్ల చొప్పున సాధించాడు. అంతకంటే ముందు 2021 బెంగాల్ టీ20 ఛాలెంజ్ టోర్నీలో ఖరగ్పూర్ బ్లాస్టర్స్ తరపున 25.85 సగటుతో 7 వికెట్లతో రాణించాడు. గత నెలలో జరిగిన ఐపీఎల్ వేలంలో అతడు అమ్ముడుపోలేదు. కానీ ఇప్పుడు రంజీ అరంగేట్రంతో అతని కెరీర్ పుంజుకునే అవకాశముంది. గురువారం విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఆంధ్రాతో ఆరంభమైన రంజీ మ్యాచ్తో ఫస్ట్క్లాస్ క్రికెట్లో కైఫ్ అడుగుపెట్టాడు.
అండగా షమి..
టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలనే చిన్న తమ్ముడు కైఫ్ కల నెరవేరే దిశగా షమి అండగా నిలుస్తున్నాడు. కలిసి సాధన చేయడంతో పాటు, అవసరమైన సలహాలు, సూచనలిస్తూ తమ్ముడి బౌలింగ్ మెరుగవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అన్ని వేళలా మద్దతునిస్తున్నాడు. కరోనా లాక్డౌన్ సమయంలో సోదరులు ఇద్దరు కలిసి స్వగ్రామంలో ప్రాక్టీస్ చేశారు. దీంతో ప్రపంచ స్థాయి పేసర్గా ఎదిగిన అన్నతో కలిసి సాధన చేయడం అతడికి ఎంతగానో కలిసొచ్చింది. అతని వేగం పెరిగింది. కచ్చితత్వంతో సరైన లెంగ్త్లో బంతులు వేయడంపై పట్టు చిక్కింది. బ్యాటింగ్ కూడా చేయగల నైపుణ్యాలున్న అతను ఆల్రౌండర్గానూ సత్తాచాటేందుకు చూస్తున్నాడు. తన ప్రతిభ, కష్టం చూస్తుంటే అత్యున్నత స్థాయికి వెళ్లేలాగే కనిపిస్తున్నాడు. ‘‘సుదీర్ఘ కాలం పోరాటం తర్వాత నువ్వు ఎట్టకేలకు బెంగాల్ తరపున రంజీ ట్రోఫీ అరంగేట్రం చేశావు. ఛీర్స్! ఇదో గొప్ప ఘనత. నీకు అభినందనలు. నీ భవిష్యత్ గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా. వంద శాతం ప్రదర్శన ఇవ్వు. కష్టపడుతూనే ఉండూ. మెరుగ్గా ఆడు’’ అని కైఫ్ను ఉద్దేశించి అతడితో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షమి పోస్టు చేశాడు. షమి స్థాయి కారణంగా కలిగే ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోగలిగితే కైఫ్కు మంచి భవిష్యత్ ఉంటుందనే చెప్పాలి. అన్న అంతర్జాతీయ బౌలర్ కాబట్టి, అతడు ఏ మాత్రం పేలవ ప్రదర్శన చేసినా ట్రోలింగ్, విమర్శలు తప్పకవపోచ్చు. అందుకే ఇతర విషయాలను పక్కనపెట్టి, కేవలం బౌలింగ్పైనే దృష్టి సారిస్తే అనుకున్న గమ్యానికి చేరొచ్చు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు