T20 League: ప్లేఆఫ్స్.. ఘోర పరాభవాలు.. నెట్రన్రేట్పై తీవ్ర ప్రభావం!
టీ20 లీగ్ మ్యాచ్లు ఆఖరి దశకు చేరుకుంటున్నాయి. ప్లేఆఫ్స్ లెక్కలపై జట్లు కుస్తీలు పడుతున్నాయి. నాలుగు స్థానాల్లో ఇప్పటికే గుజరాత్ ఒకదానిని..
గత ఐదు మ్యాచుల్లో జట్ల ప్రదర్శనపై ప్రత్యేక కథనం
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్ మ్యాచ్లు ఆఖరి దశకు చేరుకుంటున్నాయి. ప్లేఆఫ్స్ లెక్కలపై జట్లు కుస్తీలు పడుతున్నాయి. నాలుగు స్థానాల్లో గుజరాత్ ఒకదానిని ఎగరేసుకుపోయింది. ఇక మిగిలింది మూడే బెర్తులు. అయితే ఇక్కడే నెట్రన్రేట్ కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొన్ని మ్యాచుల్లో భారీ విజయాలు నమోదు కావడంతో అంకెల గారడీ కొనసాగుతోంది. టాప్లో ఉన్న జట్ల స్థానాలు తారుమారయ్యేలా ఉన్నాయి.
ఇప్పటి వరకు టీ20 మెగా టోర్నీ లీగ్ దశలో 57 మ్యాచ్లు ముగిశాయి. ఈ క్రమంలో ప్లేఆఫ్స్ పోరు ఆసక్తికరంగా మారింది. గుజరాత్ ఇప్పటికే ప్లేఆప్స్ బెర్తు ఖరారు చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది. చెన్నై, ముంబయికి అయితే అవకాశాలు దాదాపు లేనట్లే. మరీ ముఖ్యంగా ఏడు జట్లు ఆశిస్తున్నప్పటికీ.. ఇందులో లఖ్నవూ, రాజస్థాన్, బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్, కోల్కతా, పంజాబ్ బరిలో ఉన్నాయి. అయితే గత మ్యాచుల్లో ఆయా జట్లు భారీ తేడాతో ఓటమిపాలు కావడం కలవరపెడుతోంది. నెట్రన్రేట్ మారిపోయి తమ ప్లేఆఫ్స్ ఛాన్స్లను ముంచేస్తాయేమోనని ఆందోళన చెందుతున్నాయి. లీగ్ దశలో గత ఐదు మ్యాచ్లనే పరిగణనలోకి తీసుకుంటే పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..
అగ్రస్థానం కోసం దిగి...
కొత్త జట్లు గుజరాత్, లఖ్నవూ అగ్రస్థానం కోసం హోరాహోరీగా తలపడ్డాయి. అయితే లఖ్నవూపై గుజరాత్ ఆధిపత్యం చెలాయించి ప్రస్తుతానికైతే నంబర్ వన్ స్థానానికి చేరుకొని ప్లేఆఫ్స్కు దూసుకెళ్లింది. మే 10న జరిగిన మ్యాచ్లో గుజరాత్ 144/4 స్కోరుకే పరిమితమైంది. అనంతరం లక్ష్య ఛేదనలో 82 పరుగులు మాత్రమే చేసి 62 పరుగుల తేడాతో లఖ్నవూ ఓటమిపాలైంది. దీంతో మ్యాచ్ ముందు వరకు అగ్రస్థానంలో ఉన్న లఖ్నవూ పాయింట్లను పెంచుకోకపోగా.. నెట్రన్రేట్ను బాగా తగ్గించుకుంది. ఇవాళ (మే 11) రాజస్థాన్, దిల్లీ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో సంజూ సేన ఘన విజయం సాధిస్తే మాత్రం లఖ్నవూ మూడో స్థానానికి పడిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు టాప్-4 కోసం పోరు మరింత ఆసక్తికరంగా మారుతుంది.
కోల్కతా ఆశలకు జీవం పోసి..
ప్లేఆఫ్స్ ఆశలు ఎలాగూ లేవు. అయినా ఇతర జట్ల అవకాశాలను దెబ్బకొట్టగలిగే స్థానంలో ముంబయి ఉంది. మరోవైపు ప్లేఆఫ్స్ రేసులో నిలబడాలంటే కోల్కతా కచ్చితంగా గెలవాలి. ఈ క్రమంలో ముంబయిపై కోల్కతా అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 165/9 స్కోరుకు పరిమితం కాగా.. ముంబయిని 113 పరుగులకే ఆలౌట్ చేసి 52 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 12 మ్యాచుల్లో ఐదు విజయాలతో పది పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ ఇదేవిధంగా ఘన విజయాలు నమెదు చేసి నెట్రన్రేట్ను మెరుగుపరుచుకుంటే ప్లేఆఫ్స్ బెర్తు దక్కే అవకాశం ఉంది. ముంబయి ఇప్పటి వరకు 11 మ్యాచుల్లో కేవలం రెండు విజయాలను మాత్రమే నమోదు చేసింది.
చెన్నై పరిస్థితి ఇలా..
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ఆరంభం నుంచి పోరులో వెనుకబడింది. అయితే దిల్లీపై 91 పరుగుల తేడాతో విజయం సాధించడం చెన్నై అభిమానుల్లో ఆశలు రేకెత్తించాయి. ఇదే సమయంలో దిల్లీ ఆశలకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం చెన్నై నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో ఉండగా.. దిల్లీ ఐదు విజయాలతో 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. చెన్నైపై 91 పరుగులతో ఓటమిబాట పట్టడం దిల్లీ నెట్రన్రేట్ మీద తీవ్ర ప్రభావం చూపింది. ఇంకా మూడు మ్యాచ్లు దిల్లీకి ఉన్నాయి. మూడింట్లోనూ గెలిచి ప్లేఆఫ్స్ బెర్తు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు నెట్రన్రేట్ కీలకం కానుంది. ఈ క్రమంలో చెన్నై ఘోర పరాభవం దిల్లీకి అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 208/6 స్కోరు చేయగా.. దిల్లీ 117 పరుగులకే కుప్పకూలింది. ప్రస్తుత టీ20 లీగ్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగుల తేడాతో ఓడిపోయిన జట్టు దిల్లీనే కావడం విశేషం.
హైదరాబాద్పై బెంగళూరు ప్రతీకారం
ఈ సీజన్లో తొలిసారి హైదరాబాద్తో తలపడినప్పుడు ఘోర అవమానం ఎదుర్కొన్న బెంగళూరు అందుకు ప్రతీకారం తీర్చుకుంది. తమ జట్టును ఎంతకైతే ఆలౌట్ చేసిందో (68/10) దానికి ఒక్క పరుగు తక్కువతో (67) హైదరాబాద్పై బెంగళూరు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ను 125 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో బెంగళూరు (14) తన ప్లేఆఫ్స్కు చేరువగా వచ్చింది. అప్పటికీ నెట్రన్రేట్లో బాగా వెనుకబడిన బెంగళూరు ఈ విజయంతో బాగా మెరుగుపరుచుకుంది. మరోవైపు వరుసగా ఐదు గెలిచిన హైదరాబాద్ (10) ఆ తర్వాత నాలుగు ఓటములతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక మిగిలిన మూడు మ్యాచుల్లోనూ ఘన విజయం సాధిస్తేనే ప్లేఆఫ్స్ బెర్తు దక్కుతుంది. ఈ మ్యాచ్ ముందు వరకు ‘+’ల్లో ఉన్న నెట్రన్రేట్ ‘-’ల్లోకి పడిపోయింది.
ఇలాంటి ఓటములు వద్దు..
హ్యాట్రిక్ విజయాలతో సూపర్ ఫామ్లో ఉన్న లఖ్నవూను కోల్కతా ఢీకొట్టింది. అయితే లఖ్నవూ ముందు కోల్కతా ఏమాత్రం పోరాడలేక చేతులెత్తేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్నవూ ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్కతా 101 పరుగులకే కుప్పకూలి 75 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదే టోర్నీలో రెండో అత్యధిక పరుగుల తేడాతో ఓడిపోయిన జట్టు కోల్కతా. ఈ విజయంతో లఖ్నవూకు నెట్రన్రేట్పరంగా బాగా కలిసొచ్చింది. కానీ ఆ తర్వాత గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఘోర ఓటమితో మళ్లీ రన్రేట్ను తగ్గించుకుంది. మరోవైపు కోల్కతా కూడా అంతకుముందు మ్యాచ్లో రాజస్థాన్పై విజయం సాధించి ఊపు మీదున్నప్పటికీ లఖ్నవూను అడ్డుకోవడంలో విఫలమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్