NO Balls: ‘నో బాల్స్’.. అర్ష్దీప్ చెత్త రికార్డు.. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రత్యేకతదే..!
కీలక బౌలర్గా రాణిస్తున్న యువ ఆటగాడు అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh) శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్లో (IND vs SL T20) లయ తప్పాడు. ఏకంగా ఐదు నోబాల్స్ వేసి చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఒకే ఓవర్లో మూడు (హ్యాట్రిక్).. ఆ పై మరో రెండు మొత్తం ఐదు నోబాల్స్ (NO-BALLS).. ఇదంతా ఒక్క బౌలర్ మాత్రమే వేశాడు. అతడికి తోడుగా మరో ఇద్దరు బౌలర్లు చెరొక నో బాల్ను సంధించడంతో.. ఒకే మ్యాచ్లో ఏకంగా ఏడు నో బాల్స్ వేసిన జట్టుగా హార్దిక్ పాండ్య నాయకత్వంలోని టీమ్ఇండియా (team india) మరో మూడు టీమ్ల సరసన చేరింది. ఇక నో బాల్స్ను ఎలా ప్రకటిస్తారు.. దాని వల్ల బౌలింగ్ జట్టుకు కలిగే నష్టాలేంటి..? బ్యాటర్లకు చేకూరే ప్రయోజనాలేంటి..? ఇప్పటి వరకూ అత్యధికంగా నో బాల్స్ వేసిన బౌలర్లు ఎవరు..? ఒక్కటీ వేయని బౌలర్లు ఎవరనేది చూద్దాం..
ఇప్పుడివే ఎక్కువ..
ప్రస్తుతం క్రికెట్లో ‘నో బాల్’కు సంబంధించి ఎక్కువగా మూడింటిని మాత్రమే తరచుగా చూస్తుంటాం. బౌలర్ తన క్రీజ్ను దాటి అడుగు ముందుకేసినప్పుడు.. బ్యాటర్ నడుము కంటే ఎక్కువ ఎత్తుతో బంతి వేసినప్పుడు.. బౌన్సర్ వేసినప్పుడు బ్యాటర్ భుజాల కంటే ఎత్తుగా వచ్చిన బంతిని నో బాల్గా పరిగణిస్తారు. నిర్దిష్ట సమయంలో సర్కిల్ లైన్ అవతల ఎక్కువగా ఫీల్డర్లను మోహరించినా ఫీల్డ్ అంపైర్ నో బాల్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇలా జరిగే ఛాన్స్లు చాలా తక్కువ. తరచూ బీమర్లు (బ్యాటర్ను గాయపరిచేలా) వేసినా నో బాల్గా ప్రకటించి.. ఆ బౌలర్ను బౌలింగ్ వేయకుండా చేసే అధికారమూ ఫీల్డ్ అంపైర్లకు ఉంటుంది. అయితే 1984 వరకు నో బాల్స్/వైడ్లు వేసినా బౌలర్ ఖాతాలో అదనంగా పరుగులు చేరేవి కావు. కానీ ఎంసీసీ మారిన రూల్స్ ప్రకారం ఇప్పుడు బౌలర్ ఖాతాలో పడిపోతున్నాయి. అలాగే నో బాల్ వల్ల పరుగుతోపాటు అదనంగా ఫ్రీ హిట్ రూపంలో బ్యాటర్కు అవకాశం దొరుకుతుంది. ఒక వేళ ఆ బంతికి రనౌట్ మినహా ఎలా ఔటైనా.. నాటౌట్గానే పరిగణిస్తారు.
బౌలింగ్ జట్టుకు భారీ నష్టం..
నో బాల్స్ వల్ల ఫలితమే మారిపోయే పరిస్థితులు ఉంటాయి. దీనికి ఉదాహరణ తాజాగా భారత్ -శ్రీలంక రెండో టీ20 మ్యాచ్ (ind vs sl 2023 second t20). ఒక్క నోబాల్ పడితేనే అదనంగా పరుగుతోపాటు మరొక బంతిని ఎక్కువగా వేయాల్సి ఉంటుంది. అలాంటిది శ్రీలంకతో మ్యాచ్లో ఏకంగా ఏడు బంతులు ఇలా పడటంతో భారత్ ఓటమికి ప్రధాన కారణమైంది. నో బాల్ వేయడం వల్ల బ్యాటర్లకు మరింత స్వేచ్ఛ ఇచ్చినట్లు అవుతుంది. ఫ్రీ హిట్ కారణంగా భారీ షాట్ కొట్టి పరుగులు రాబడతారు. కీలకమైన సమయంలో ఇలా వేయడం వల్ల బౌలర్ల లయ కూడా దెబ్బతింటుంది. ఆత్మవిశ్వాసం తగ్గి సరైన ప్రాంతంలో బంతులను సంధించడంలో విఫలమవుతారు.
అత్యధికంగా నో బాల్స్ వేసినవారు..
తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఐదు నో బాల్స్ వేసిన ఆ బౌలర్ అర్ష్దీప్ సింగ్ అని తెలిసిందే. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురైన అర్ష్దీప్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకొన్నాడు. ఒకే మ్యాచ్లో అత్యధికంగా నో బాల్స్ వేసిన బౌలర్గా తన రికార్డును అతడే అధిగమించాడు. గతంలో ఒకే మ్యాచ్లో నాలుగు నోబాల్స్ వేశాడు. అరంగేట్రం చేసిన ఆరు నెలల్లోనే 21 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లను ఆడిన అర్ష్దీప్ 33 వికెట్లు తీశాడు. అయితే కీలక బౌలర్గా మారిన అర్ష్దీప్ అప్పుడే 14 నో బాల్స్ కూడా వేయడం గమనార్హం. ఇలా పొట్టి ఫార్మాట్లో అత్యధికంగా ‘నో బాల్స్’ను వేసిన బౌలర్గా అవతరించాడు. అర్ష్దీప్ తర్వాత బుమ్రా (8), యుజ్వేంద్ర చాహల్ (5) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
భారత్ నుంచి కపిల్ మాత్రమే పొదుపు..
దాదాపు 350కిపైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అతి తక్కువగా అదనపు పరుగులు ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో కపిల్ కాకుండా ఇయాన్ బోథమ్ (ఇంగ్లాండ్), ఇమ్రాన్ ఖాన్ (పాకిస్థాన్), డెన్నిస్ లిల్లీ (ఆస్ట్రేలియా), లాన్స్ గిబ్స్ (విండీస్) వారు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
* ఒకే మ్యాచ్లో అత్యధికంగా నోబాల్స్ వేసిన నాలుగో జట్టు టీమ్ఇండియా (7). అంతకుముందు శ్రీలంక, అఫ్గానిస్థాన్, ఐర్లాండ్ కూడా ఏడేసి నోబాల్స్ను వేశాయి. అయితే 10 నోబాల్స్తో ఘనా పేరిట ఈ రికార్డు ఉంది. ఉగాండా మీద అత్యంత చెత్త బౌలింగ్ ఆ జట్టు వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు