Most Expensive Bowlers : ఐపీఎల్లో బ్యాటర్ల ఊచకోతకు బలైన బౌలర్లు వీరే..
ఐపీఎల్(IPL) చరిత్రలోనే ఒకే ఓవర్లో, 4 ఓవర్ల స్పెల్లో అత్యధిక పరుగులు సమర్పించుకుని బ్యాటర్ల ఊచకోతకు గురైన బౌలర్ల (Most Expensive bowlers) గురించి తెలుసుకుందామా..
ఇంటర్నెట్ డెస్క్ : ఐపీఎల్ (IPL) అంటేనే ధనాధన్ ఆట. ఓవైపు బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి ఆడాలి. మరోవైపు అదే స్థాయిలో బౌలర్లు చురకత్తుల్లాంటి బంతులతో వారిని నిలువరిస్తూ ఉండాలి. అయితే.. ఒక్కోసారి బౌలర్లు.. బ్యాటర్ల ఊచకోతకు గురవుతూ ఉంటారు. శనివారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి యువ పేసర్ అర్జున్ తెందూల్కర్ ఒకే ఓవర్లో 31 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో మ్యాచ్ గమనమే మారిపోయి.. ముంబయి ముందు పంజాబ్ భారీ టార్గెట్ను ఉంచింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చి బ్యాడ్ రికార్డు నమోదు చేసిన బౌలర్ల (Most Expensive Bowlers) గురించి తెలుసుకుందామా..
ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు..
- హర్షల్ పటేల్ : ఈ బెంగళూరు బౌలర్ 2021లో చెన్నైతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 37 పరుగులు ఇచ్చి ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో ఎక్కువ పరుగులు ఇచ్చిన చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ ఓవర్లో అతడు ఇచ్చిన పరుగులు 6 6 nb6 6 2 6 4. ఈ ఓవర్లో రవీంద్ర జడేజా 36 పరుగులను సాధించగా.. ఒక పరుగు నో బాల్ రూపంలో వచ్చింది.
- ప్రశాంత్ పరమేశ్వరన్ : 2011లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కొచ్చి టస్కర్స్ జట్టు బౌలర్ పరమేశ్వరన్ బౌలింగ్ను భారీ హిట్టర్ క్రిస్గేల్ ఊచకోత కోశాడు. దీంతో ఒకే ఓవర్లో 37 (6 nb 6 4 4 6 6 4) పరుగులు వచ్చాయి.
- డేనియల్ సామ్స్ : 2022లో ముంబయి ఇండియన్స్ బౌలర్ డేనియల్ సామ్స్ కోల్కతాపై ఒకే ఓవర్లో 35 పరుగులు (6 4 6 6 nb2 4 6) ఇచ్చి ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఆ ఓవర్లో ప్యాట్ కమిన్స్ దంచి కొట్టి 34 పరుగులు రాబట్టాడు.
- రవి బొపారా : 2010లో కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఈ పంజాబ్ కింగ్స్ బౌలర్ 33 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్లో క్రిస్ గేల్ 25, మనోజ్ తివారి 2 పరుగులు చేయగా.. మిగతావి వైడ్ల రూపంలో వచ్చాయి.
- పర్విందర్ ఆవానా : 2014లో చెన్నైతో జరిగిన ఓ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బౌలర్ పర్విందర్ 33 పరుగులు (6 6 4 4 nb4 4 4) ఇచ్చాడు. సురేశ్ రైనా ఈ ఓవర్లో 32 పరుగులు సాధించాడు.
- యశ్ దయాల్ : ప్రస్తుత సీజన్ (IPL 2023)లోనే కోల్కతా ఆటగాడు రింకూ సింగ్ చివరి ఓవర్లో వరుసగా 5 సిక్స్లు బాది.. ఆ జట్టుకు గొప్ప విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఆ ఓవర్ బాధితుడు యశ్ దయాల్ (31 పరుగులు). తొలి బంతికి సింగిల్ రాగా.. మిగిలిన ఐదు బంతులు మైదానం ఆవల పడ్డాయి.
- అర్జున్ తెందూల్కర్ : శనివారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి బౌలర్ అర్జున్ ఒకే ఓవర్లో 31 పరుగులు ఇచ్చాడు. రెండు సిక్స్లు, నాలుగు ఫోర్లు సహా ఒక నోబాల్, ఒక వైడ్, సింగిల్ ఇచ్చేశాడు.
ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు..
- బాసిల్ థంపి.. : సన్రైజర్స్ హైదరాబాద్ ఎన్నోసార్లు చిన్న లక్ష్యాలనూ కాపాడుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఒక స్పెల్లో ఎక్కువ పరుగులు ఇచ్చిన చెత్త రికార్డు కూడా ఆ జట్టు బౌలర్పైనే ఉంది. బాసిల్ థంపి.. తన 4 ఓవర్ల స్పెల్లో ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. 2018వ సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఇది చోటుచేసుకుంది.
- యశ్ ధయాల్..: ఈ గుజరాత్ బౌలర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుత ఐపీఎల్లోనే ఇది చోటుచేసుకుంది. కోల్కతా బ్యాటర్ రింకు సింగ్ ఊతకోతకు బలై ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్స్లు సమర్పించుకున్నాడు. ఇలా మొత్తం 4 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
- ఇషాంత్ శర్మ : అప్పట్లో సన్రైజర్స్కు ఆడిన ఇషాంత్ శర్మ కూడా అత్యధిక పరుగులు ఇచ్చి ఈ జాబితాలో చేరాడు. 2013లో చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన ఓ మ్యాచ్లో 4 ఓవర్ల స్పెల్లో 66 పరుగులు ఇచ్చాడు.
- ముజ్బిర్ రహ్మాన్ : 2019 సీజన్లో జరిగిన ఓ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బౌలర్ రహ్మాన్ను సన్రైజర్స్ బ్యాటర్లు ఉతికారేశారు. ఇలా అతడు తన 4 ఓవర్ల కోటాలో 16.50 ఎకానమీతో మొత్తం 66 పరుగులు ఇచ్చేశాడు.
- ఉమేశ్ యాదవ్ : దిల్లీకి ఆడిన సమయంలో ఉమేశ్ యాదవ్.. ఆర్సీబీకి తన 4 ఓవర్ల స్పెల్లో 65 పరుగులు సమర్పించుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి