IPL Technology: ఇది ఐపీఎల్ టెక్నాలజీ బాస్.. భలే కొత్తగా ఉంటుంది!
అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఐపీఎల్(IPL) ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. ఐపీఎల్లో వాడే సాంకేతికతను పరిశీలిస్తే..
ఇంటర్నెట్ డెస్క్ : ఐపీఎల్(IPL) మ్యాచ్లు ఎంతో రసవత్తరంగా సాగుతున్నాయి. మ్యాచ్ మ్యాచ్కు ఉత్కంఠ పెరుగుతూ.. అసలు సిసలు క్రికెట్ మజాను అందిస్తున్నాయి. అయితే.. స్టేడియంలో వీక్షించే ప్రేక్షకుల కంటే.. టీవీలు, మొబైళ్లలో మ్యాచ్లను చూసే వారి సంఖ్యే ఎక్కువన్న విషయం తెలిసిందే. అందుకే ప్రేక్షకులకు అద్వితీయమైన అనుభూతి అందించేందుకు ఉత్తమ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి ప్రసార మధ్యమాలు. ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీని వాడుతూ.. అత్యంత సూక్ష్మ సమాచారాన్ని కూడా ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఆట తీరే మారిపోతోంది. ఇక ఐపీఎల్లో వాడుతున్న అధునాతన సాంకేతికతల్లో కొన్నింటిపై ఓ లుక్కేస్తే..
- అంపైర్ క్యామ్లు (umpire camera).. మైదానంలో ఆటను చిత్రీకరించేందుకు వివిధ ప్రదేశాల్లో కెమెరాలను అమర్చే విషయం తెలిసిందే. అయితే మైదానం లోపల అంపైర్ల క్యాప్లపై అమర్చే కెమెరాలు ప్రత్యేకం. ఐసీసీ ఈవెంట్లలో ఇలాంటి కెమెరాలు మనకు కనబడవు. ఐపీఎల్లాంటి వాటిలోనే వీటిని వాడుతున్నారు.
- బగ్గీక్యామ్ (BuggyQam).. ఈ టెక్నాలజీని టెన్నిస్ నుంచి స్వీకరించారు. గతంలో అథ్లెట్ల కోసం వీటిని వాడేవారు. ఆటగాళ్లతోపాటే పరుగెత్తుతూ ఇవి వారి కదలికలను షూట్ చేస్తాయి. మైదనాంలో బౌండరీ లైన్ వద్ద అటూ ఇటూ తిరుగుతూ ఆటగాళ్ల ప్రతీ మూమెంట్ను ఇవి రికార్డు చేస్తాయి. ఓవర్ల మధ్యలో మైదానంలోపలికి వస్తుంటాయి. తక్కువ ఎత్తులోని దృశ్యాలను కూడా ఇవి చిత్రీకరిస్తాయి.
- 360 డిగ్రీల కెమెరాలు (360° Cameras).. కోహ్లీ చూడచక్కటి కవర్ డ్రైవ్ ఆడితే.. రోహిత్ అద్భుతమైన పుల్ షాట్ ఆడితే.. షాట్ మాత్రమే కాదు.. వాళ్లు పోస్చర్ కూడా అదిరిపోతుంది. బ్యాటర్ను 360 డిగ్రీల్లో చూపిస్తూ.. షాట్ స్పెషాలిటీ చెబుతారు. 360 డిగ్రీల కెమెరాలతోనే ఇది సాధ్యం. అలాగే ఒక బ్యాటర్కు ఫీల్డ్ సెట్టింగ్ కూడా అలానే విశ్లేషించి చూపిస్తారు. ఈ అధునాతన టెక్నాలజీని 2021 సీజన్ నుంచి ఐపీఎల్లో వాడుతున్నారు.
- స్పైడర్ కెమెరాలు (Spider Camera).. ఇవి మైదానంలో కొంత ఎత్తులో తిరుగుతూ దృశ్యాలను చిత్రీకరిస్తుంటాయి. కేబుళ్ల సహాయంతో ఇవి ఆటు ఇటు చక్కర్లు కొడుతాయి. స్టేడియం పైనుంచి దృశ్యాలను చిత్రీకరిస్తూ.. ఆటకు సంబంధించి సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచుతాయి. అయితే ఇవి ఆటగాళ్లను అప్పుడప్పుడు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ఈ కెమెరా మైదానంలోనే తిరుగుతుండటంతో.. ఒక్కోసారి బంతి కెమెరాకో, దాని తీగలతో తాకి దిశను మార్చుకుంటాయి. దీంతో ఫీల్డర్లు ఇబ్బందికి గురవుతారు. స్పైడర్క్యామ్కు తాకితే.. ఆ బంతిని అంపైర్ డెడ్ బాల్గా ప్రకటిస్తాడు. ఐపీఎల్తోపాటు చాలా లీగుల్లో ఈ సాంకేతికతను చాలా కాలంగా వినియోగిస్తున్నారు.
- రియల్ టైమ్ అనలిటిక్స్ (Real-Time Analytics).. క్రికెట్లో ఆటతోపాటు సమాచారం కూడా ఎంతో ముఖ్యం. చాలా జట్లు ఈ సమాచారంపై ఆధారపడతాయి. కోచ్లు, కెప్టెన్లు.. తమ ఆటగాళ్లకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి.. ఎక్కడ మెరుగుపడాలో సూచిస్తుంటారు. బౌలర్ల ఏ లెంగ్త్లో బంతులేస్తున్నారు.. బ్యాటర్లు ఎలాంటి షాట్లు ఆడి ఔటవుతున్నారు. ఇలాంటి సమస్త సమాచారాన్ని రియల్ టైమ్ అనలిటిక్స్ అందిస్తాయి.
- ఎల్ఈడీ స్టంప్స్, బెయిల్స్ (LED Stumps and Bails).. రనౌట్లు, స్టంపింగ్ విషయంలో అంపైర్లకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గతంలో బెయిల్స్ కిందపడ్డాయో లేదో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఈ సాంకేతికతతో బంతి వికెట్లను తాకగానే లైట్లు వెలుగుతాయి. బెయిల్స్ కిందపడ్డ విషయం కూడా సులువుగా తెలుస్తుంది. రనౌట్లు, స్టంపింగ్ నిర్ణయాల్లో ఇవి కచ్చితత్వాన్ని పెంచుతున్నాయి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి.
- డాల్బీ అట్మాస్ (Dolby Atmos).. స్టేడియంలో మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేప్పుడు కలిగే అనుభూతిని.. టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులకు అందించడానికి డాల్బీ అట్మాస్తో ప్రసారాలను అందిస్తున్నాయి. ఇవి చిన్న శబ్దాన్ని కూడా ఎంతో స్పష్టంగా ప్రేక్షకులకు అందిస్తాయి.
- స్పీడ్ గన్ (Speed Gun).. ఈ టెక్నాలజీని క్రికెట్లో ఎప్పటి నుంచో వాడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బౌలర్లు ఎంత వేగంతో బంతులను విసురుతున్నారనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. ఈ సీజన్లో కోల్కతా బౌలర్ లాకీ ఫెర్గుసన్ ఓ మ్యాచ్లో 154 కి.మీ వేగంతో బంతిని సంధించాడు. ఇక సన్రైజర్స్ బౌలర్, జమ్ము ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ 150 కి.మీకుపైగా వేగంతో బంతులను వేస్తుంటాడు. ఇవన్నీ స్పీడ్ గన్తోనే రికార్డు చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్. -
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కాలంటే దేశవాళీ క్రికెట్లో ఆడాలనే సూత్రాన్ని పక్కన పెట్టడంతో ఇషాన్, శ్రేయస్పై వేటుపడిన సంగతి తెలిసిందే. -
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
ఈ ఏడాది ఐపీఎల్ (IPL)లో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాంటి కొన్ని సంఘటనలు, విమర్శలు ఇవిగో... -
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
చెన్నై ఎక్కడ మ్యాచ్ ఆడినా ప్రత్యేక ఆకర్షణ ఎంఎస్ ధోనీ. రెండు మ్యాచుల్లో మినహా ప్రతిసారీ అతడి బ్యాట్ నుంచి బౌండరీల వర్షం కురిసింది. మరోసారి అలాంటి ఇన్నింగ్స్లను చూడాలనేది అభిమానుల ఆకాంక్ష. -
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఎట్టకేలకు మళ్లీ జాతీయజట్టులోకి వచ్చాడు. పొట్టి కప్ కోసం ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కిన విషయం తెలిసిందే. -
మా కొంప ముంచిందవే.. భారీ మూల్యం చెల్లించాం: పంజాబ్ కోచ్
కీలకమైన ఆటగాళ్ల క్యాచ్లను వదిలేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో పంజాబ్ ఆటగాళ్లకు తెలిసొచ్చింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఆరు క్యాచ్లను చేజార్చారు. -
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
క్రికెటర్ పట్ల ప్రాంచైజీ ఓనర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. అందులోనూ అతడు కెప్టెన్ కావడంతో విషయం సీరియస్గా మారింది. -
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
ద్రవిడ్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇంపాక్ట్ రూల్పైనా మాట్లాడారు. -
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు