MS Dhoni: త్వరలో ఆస్పత్రిలో చేరనున్న ఎంఎస్ ధోనీ.. కారణం ఏంటంటే?
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) త్వరలో ఆస్పత్రిలో చేరతాడని తెలుస్తోంది. తన మోకాలి గాయానికి సంబంధించి టెస్టులు చేయించుకుంటాడని సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) 41 ఏళ్ల వయసులోనూ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ను విజయవంతంగా ముందుండి నడిపించాడు. తన వ్యూహాలతో మేటి జట్లను సైతం మట్టికరిపించి సీఎస్కేకు ఐదో టైటిల్ను అందించాడు. మోకాలి గాయంతో బాధపడుతున్నా అన్ని మ్యాచ్ల్లో వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడంతోపాటు జట్టుకు అవసరమైన సందర్భాల్లో బ్యాటింగ్కు దిగాడు. మూడు నెలల నుంచి ఐపీఎల్తో తీరిక లేకుండా గడిపిన కెప్టెన్ కూల్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ధోనీ త్వరలోనే ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరి తన మోకాలి గాయానికి సంబంధించి పలు టెస్టులు చేయించుకుంటాడని తెలుస్తోంది. టెస్టులకు సంబంధించిన రిపోర్టులు వచ్చిన తర్వాత ధోనీ సర్జరీ చేయించుకుంటాడా లేదా అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఈ సీజన్లో చెపాక్ మైదానంలో సీఎస్కే చివరి లీగ్ మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ మైదానం అంతా కలియతిరిగాడు. అభిమానుల వైపు సీఎస్కే జెర్సీలు విసిరాడు. ఈ క్రమంలో ధోనీ తన మోకాలికి ఓ క్యాప్ (మోకాలికి సపోర్ట్ కోసం వాడతారు) ధరించి కన్పించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ మధ్య మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓసారి ధోనీని మర్యాదపూర్వకంగా కలిశాడు. అప్పుడు కూడా మిస్టర్ కూల్ తన మోకాలికి క్యాప్ ధరించి కనిపించాడు. ఏది ఏమైనా గాయం నుంచి ధోనీ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ సీజన్తో ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరిగింది. అయితే, శరీరం సహకరిస్తే.. వచ్చే సీజన్కు అందుబాటులో ఉంటానని సూచనప్రాయంగా తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే