MS Dhoni: ఒక్కోసారి ఒక్కోలా.. అసలు ధోనీ మనసులో ఏముంది?
ప్రతి సీజన్కు ముందు ధోనీ(MS Dhoni)కిదే చివరి ఐపీఎల్ అంటూ వార్తలు రావడం చూస్తూనే ఉంటాం. అయితే.. ఈ సీజన్లో ధోనీ పలుసార్లు తన రిటైర్మెంట్ వార్తలపై స్పందించారు.
ఇంటర్నెట్డెస్క్ : ఈ ఐపీఎల్(IPL 2023) సీజన్ చివరి దశకు చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లింది. ఇక ఇదే సమయంలో ఎప్పుడూ జరిగే చర్చ ఒకటి ముందుకు వచ్చింది. అదే ధోనీ(MS Dhoni) రిటైర్మెంట్ అంశం. ఈ సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో వచ్చే సీజన్లో మహీ ఆడతాడా? లేదా? అనే చర్చ కొనసాగుతోంది. దీనిపై క్వాలిఫయర్ 1 మ్యాచ్లో విజయం అనంతరం ధోనీ తాజాగా స్పందించాడు కూడా. అయితే.. ఈ ఐపీఎల్ సీజన్లో ధోనీ తన రిటైర్మెంట్ గురించి ఎప్పుడేమన్నాడో ఓసారి పరిశీలిస్తే..
- నాకు కావాల్సినంత సమయం ఉంది.. గుజరాత్ (Qualifier 1)పై విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లిన అనంతరం ధోనీ మాట్లాడాడు. చెపాక్లో మళ్లీ ఆడే అవకాశాలు ఉన్నాయా..? అనే ప్రశ్నకు స్పందిస్తూ ‘‘ఇప్పుడే చెప్పలేను. ఇంకా 8-9 నెలల సమయం ఉంది. డిసెంబర్లో మళ్లీ మినీ వేలం ఉంటుంది. కాబట్టి, ఆ తలనొప్పిని ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు కావాల్సినంత సమయం ఉంది. సీఎస్కే కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. అది జట్టు కోసం ఆడటమా..? బయట కూర్చోవడమా..? అనేదానిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం ఉంది’’ అని చెప్పాడు.
- అది మీరే డిసైడ్ చేసేశారా..? లీగ్ దశలో లఖ్నవూతో మ్యాచ్ సందర్భంగా టాస్ వేసే సమయంలో ‘మీ చివరి సీజన్ను ఆస్వాదిస్తున్నారా?’ అని కామెంటేటర్ డానీ మారిసన్(Danny Morrison) అడిగాడు. దీనికి మహీ స్పందిస్తూ.. ‘ఇది నా చివరి ఐపీఎల్ అంటూ మీరే డిసైడ్ చేసేశారా?’ అంటూ నవ్వుతూ కౌంటర్ ఇచ్చాడు. అనంతరం కామెంటేటర్.. స్టేడియంలో ధోనీ కోసం భారీగా వచ్చిన ప్రేక్షకులను చూపిస్తూ.. ‘మహీ వచ్చే ఏడాది కూడా ఆడేందుకు వస్తాడు’ అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు ధోనీ అభిమానుల్లో జోష్ నింపాయి.
- నా ఫేర్వెల్కు వచ్చినట్లుంది.. ఈడెన్గార్డెన్స్లో కోల్కతా (kolkata knight riders)తో జరిగిన మ్యాచ్లో కూడా ధోనీ తన ఫేర్వెల్పై సరదా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో కోల్కతా సొంత మైదానం అయినప్పటికీ.. భారీగా అభిమానులు ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని సీఎస్కేకు మద్దతుగా నిలిచారు. మ్యాచ్ అనంతరం ధోనీ (MS Dhoni) ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. తనకు ఫేర్వెల్ ఇచ్చేందుకు వీరంతా సీఎస్కే జెర్సీలో వచ్చినట్లుందని నవ్వుతూ అన్నాడు.
- సొంత మైదానంలో పరేడ్ నిర్వహించి.. లీగ్ దశలో సొంత మైదానం చెపాక్ వేదికగా చివరి మ్యాచ్ను ఆడిన అనంతరం ధోనీ.. స్టేడియంలో తోటి ఆటగాళ్లతో కలిసి పరేడ్ నిర్వహించాడు. అభిమానుల వైపు జెర్సీలు విసిరి.. వారు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గావస్కర్ పరుగున వచ్చి.. తన షర్ట్పై ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం మరో విశేషం. ఈ నేపథ్యంలో తన ఫేర్వెల్పై ధోనీ ఏదైనా సూచనలు చేస్తున్నాడా.. అనే అనుమానం అభిమానుల్లో కలిగింది.
- కెరీర్ చివరి దశలో ఉన్నాను.. ‘ఇప్పటికే చాలామంది నా కెరీర్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఎంతకాలం ఆడినా సరే.. ఇప్పుడు కెరీర్ చివరి దశలో ఉన్నాను. ఇప్పుడు దానిని ఎంజాయ్ చేస్తున్నా. వయసు పెరుగుతుందంటే మరింత అనుభవం వచ్చి చేరినట్లే. నేను ఎప్పుడూ వయసు పెరిగిపోతుందని చెప్పడానికి అస్సలు సిగ్గుపడను’ అని సన్రైజర్స్తో మ్యాచ్ అనంతరం ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పలు సందర్భాల్లో మాజీ ఆటగాళ్లు ఏమన్నారంటే..
‘ఎప్పుడు రిటైర్ అవుతాడో ధోనీకి మాత్రమే తెలుసు. నేను గతేడాదే చెప్పాను.. ఈ ఏడాది మహీ ఆడతాడని. అయితే.. వచ్చే ఏడాది ఆడతాడో లేదో నాకు తెలియదు. అతడు వచ్చే ఏడాది కూడా కొనసాగితే.. అతడి అభిమానులు ఎంతో సంతోషిస్తారు. అతడు ఆడటమే అభిమానులకు కావాలి’
- మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్
‘ధోనీ ఆటగాడిగా కాకుండా మెంటార్గా కొనసాగుతాడు. అతడు జట్టును ఎంచుకుంటాడు. యువ ఆటగాళ్లకు మెళకువలు నేర్పుతూనే ఉంటాడు. తన కింద ఆడే ప్రతి ఒక్కరూ బాగా రాణించాలని కోరుకుంటాడు’
- మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్
‘ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత.. నేను మరో ఏడాది పాటు ఆడతాను’ అని మహీ ఓ సందర్భంలో తనతో అన్నట్లు సురేశ్ రైనా చెప్పాడు.
ఇక.. మహేంద్రుడు లేని చెన్నై జట్టును ఊహించుకోవడం కష్టమే. అతడు తర్వాతి సీజన్లలో కూడా తన సేవలు కొనసాగించాలని అభిమానులు కోరుతున్నారు. అయితే.. రిటైర్మెంట్ గురించి ధోనీ ఇప్పటి వరకూ ఎక్కడా స్పష్టంగా చెప్పనప్పటికీ.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని అభిమానులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే.. ఎవరూ ఊహించని విధంగా ఆగస్టు 15, 2020లో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత