Virender Sehwag : 2011 వరల్డ్కప్లో ధోనీ కిచిడీ మాత్రమే తిన్నాడు.. ఎందుకో తెలుసా..? : సెహ్వాగ్
భారత్కు రెండోసారి వన్డే ప్రపంచకప్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)కున్న ఓ సెంటిమెంట్ గురించి సెహ్వాగ్(Virender Sehwag) ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్ : భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్(ODI World Cup-2023) షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 5న ఈ వన్డే మహా సమరం ప్రారంభం కానుండగా.. 8న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్తో భారత్ తన పోరును ప్రారంభించనుంది. ఇక 2011లో ధోనీ సారథ్యంలో రెండోసారి ప్రపంచకప్ను భారత్ ముద్దాడగా.. మరోసారి విజేతగా నిలిచి ఐసీసీ ట్రోఫీల కొరతను తీర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2011 ప్రపంచకప్(2011 World Cup) గెలిచిన టీమ్ గురించి మాజీ డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్(Virender Sehwag) ఓ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఆ సమయంలో ముఖ్యంగా ధోనీ(MS Dhoni) పాటించిన ఓ సెంటిమెంట్ గురించి సెహ్వాగ్ తెలిపాడు. 2011 ప్రపంచకప్ సమయంలో ధోనీ కేవలం కిచిడి మాత్రమే తినేవాడని.. ఇది అతడి సెంటిమెంటని చెప్పాడు. తన ఆటతీరు ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ.. భారత్ మ్యాచ్లు గెలుస్తుండటంతో మహీ ఈ సెంటిమెంట్నే కొనసాగించాడని సెహ్వాగ్ తెలిపాడు.
‘‘ప్రతి ఒక్కరికి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. అలాగే ధోనీకి కూడా.. అదే కిచిడి. ఆ ప్రపంచకప్ అంతా ధోనీ అదే తిన్నాడు. దీనిపై అడిగితే..‘నేను పెద్దగా స్కోరు చేయనప్పటికీ.. ఈ సెంటిమెంట్ బాగా పనిచేస్తోంది. మ్యాచ్లు గెలుస్తున్నాం’ అని చెప్పేవాడు’’ అని సెహ్వాగ్ అప్పటి మధురస్మృతులను గుర్తు చేసుకున్నాడు.
వరల్డ్ కప్ అంటే క్రికెట్ ఒలింపిక్స్..
ఇక ప్రస్తుత ప్రపంచకప్(ODI World Cup-2023) గురించి కూడా సెహ్వాగ్ స్పందించాడు. వన్డే వరల్డ్ కప్ అంటే.. క్రికెట్ ఒలింపిక్స్ అని పేర్కొన్నాడు. ప్రపంచకప్ కంటే ఏదీ పెద్దది కాదన్నాడు. ‘ప్రపంచకప్ క్షణాలు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. నేను ఆడినప్పుడు ఒకసారి ఫైనల్కు చేరాం. ఓసారి గెలిచాం. మరోసారి క్వాలిఫై కాకుండానే దారుణంగా ఓటమిపాలయ్యాం. కాబట్టి నా ప్రయాణం ఒడుదొడుకులతో సాగింది’ అంటూ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
ముంబయి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్కు రాలేదు. అతడిని ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వెల్లడించడం గమనార్హం. -
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
ఐపీఎల్ 2024 సీజన్ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?