Virender Sehwag : 2011 వరల్డ్కప్లో ధోనీ కిచిడీ మాత్రమే తిన్నాడు.. ఎందుకో తెలుసా..? : సెహ్వాగ్
భారత్కు రెండోసారి వన్డే ప్రపంచకప్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)కున్న ఓ సెంటిమెంట్ గురించి సెహ్వాగ్(Virender Sehwag) ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్ : భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్(ODI World Cup-2023) షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 5న ఈ వన్డే మహా సమరం ప్రారంభం కానుండగా.. 8న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్తో భారత్ తన పోరును ప్రారంభించనుంది. ఇక 2011లో ధోనీ సారథ్యంలో రెండోసారి ప్రపంచకప్ను భారత్ ముద్దాడగా.. మరోసారి విజేతగా నిలిచి ఐసీసీ ట్రోఫీల కొరతను తీర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2011 ప్రపంచకప్(2011 World Cup) గెలిచిన టీమ్ గురించి మాజీ డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్(Virender Sehwag) ఓ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఆ సమయంలో ముఖ్యంగా ధోనీ(MS Dhoni) పాటించిన ఓ సెంటిమెంట్ గురించి సెహ్వాగ్ తెలిపాడు. 2011 ప్రపంచకప్ సమయంలో ధోనీ కేవలం కిచిడి మాత్రమే తినేవాడని.. ఇది అతడి సెంటిమెంటని చెప్పాడు. తన ఆటతీరు ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ.. భారత్ మ్యాచ్లు గెలుస్తుండటంతో మహీ ఈ సెంటిమెంట్నే కొనసాగించాడని సెహ్వాగ్ తెలిపాడు.
‘‘ప్రతి ఒక్కరికి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. అలాగే ధోనీకి కూడా.. అదే కిచిడి. ఆ ప్రపంచకప్ అంతా ధోనీ అదే తిన్నాడు. దీనిపై అడిగితే..‘నేను పెద్దగా స్కోరు చేయనప్పటికీ.. ఈ సెంటిమెంట్ బాగా పనిచేస్తోంది. మ్యాచ్లు గెలుస్తున్నాం’ అని చెప్పేవాడు’’ అని సెహ్వాగ్ అప్పటి మధురస్మృతులను గుర్తు చేసుకున్నాడు.
వరల్డ్ కప్ అంటే క్రికెట్ ఒలింపిక్స్..
ఇక ప్రస్తుత ప్రపంచకప్(ODI World Cup-2023) గురించి కూడా సెహ్వాగ్ స్పందించాడు. వన్డే వరల్డ్ కప్ అంటే.. క్రికెట్ ఒలింపిక్స్ అని పేర్కొన్నాడు. ప్రపంచకప్ కంటే ఏదీ పెద్దది కాదన్నాడు. ‘ప్రపంచకప్ క్షణాలు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. నేను ఆడినప్పుడు ఒకసారి ఫైనల్కు చేరాం. ఓసారి గెలిచాం. మరోసారి క్వాలిఫై కాకుండానే దారుణంగా ఓటమిపాలయ్యాం. కాబట్టి నా ప్రయాణం ఒడుదొడుకులతో సాగింది’ అంటూ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ