MS Dhoni: మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
ఇంటర్నెట్ డెస్క్: డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై జట్టు ఐపీఎల్ 17వ సీజన్లోనూ దూసుకుపోతోంది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు తరఫున తొలిసారి మెగా టోర్నీలో అడుగు పెట్టిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అయితే, గుజరాత్తో జరిగిన మ్యాచ్లో క్యాచ్ను డ్రాప్ చేశాడు. ఇదే విషయాన్ని ఓ కార్యక్రమంలో రచిన్ వద్ద యాంకర్ ప్రస్తావించింది. ‘‘మీరు క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత ధోనీ వైపు చూశారా? అప్పుడు అతడు ఎలా రియాక్ట్ అయ్యాడు? మీకేమైనా చెప్పాడా?’’ అని అడిగింది. ఆ ఈవెంట్లోనే ఉన్న ధోనీ (MS Dhoni) వెంటనే మైక్ అందుకొని సమయస్ఫూర్తి ప్రదర్శించాడు.
‘‘మాకు కొత్త కెప్టెన్ (రుతురాజ్ను చూపిస్తూ) ఉన్నాడు’’ అంటూ చెప్పడంతో నవ్వులు విరిశాయి. ఆ తర్వాత ధోనీ కొనసాగిస్తూ.. ‘‘మెగా లీగ్లో తొలిసారి ఆడుతున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. అయితే. నేను ఇలాంటి వాటికి రియాక్ట్ కాను. ఇప్పుడు నేనెవరిని? నాకు తెలిసి రుతురాజ్ కూడా ఇలానే ఆలోచిస్తాడు. రచిన్ ఆటను చూస్తుంటే ముచ్చటేస్తోంది’’ అని వ్యాఖ్యానించాడు. ఇప్పుడీ వీడియో వైరల్గా మారింది.
మరోసారి అలా ఔటైతే.. అప్పుడు చెప్తా: యువీ
ముంబయిపై రికార్డు హాఫ్ సెంచరీ సాధించిన హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడే క్రమంలో చెత్త షాట్కు యత్నించి పెవిలియన్కు చేరాడు. దీనిపై భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ స్పందించాడు. ఒకవైపు అభినందిస్తూనే.. సున్నితంగా హెచ్చరించాడు. ‘‘అభిషేక్ సూపర్ ఇన్నింగ్స్ ఆడావు. కానీ, అంతటి చెత్త షాట్కు ఔట్ కావడం మంచిది కాదు. మరోసారి పునరావృతమైతే మాత్రం నీ కోసం దెబ్బలు సిద్ధంగా ఉంటాయి. క్లాసెన్ సూపర్ క్లాస్ గేమ్’’ అని యువీ పోస్టు పెట్టాడు.
ఐపీఎల్ రూల్స్తో గంగూలీ, రికీ పాంటింగ్ గందరగోళం
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో దిల్లీ మెంటార్ సౌరభ్ గంగూలీ, ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ కాస్త గందరగోళానికి గురయ్యారు. విదేశీ క్రికెటర్ను వాడుకొనే క్రమంలో రాజస్థాన్ నిర్ణయంపై ఫోర్త్ అంపైర్తో గంగూలీ, పాంటింగ్ తీవ్రంగా చర్చలు జరిపిన వీడియోలు వైరల్గా మారాయి. రోవ్మన్ పావెల్ను ఫీల్డింగ్ సబ్స్టిట్యూట్గా తీసుకొనేందుకు రాజస్థాన్ నిర్ణయం తీసుకుంది. ఇలా చేస్తే ఐదుగురు ఓవర్సీస్ ప్లేయర్లను ఆడించినట్లు అవుతుందనేది దిల్లీ వాదన. కానీ, ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఏ సమయంలోనూ మైదానంలో నలుగురికి మించి విదేశీ క్రికెటర్లు ఆడకూడదు. ఒకవేళ ఎవరినైనా సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా తీసుకోవాలంటే మరొక ఓవర్సీస్ ప్లేయర్ స్థానంలోనే భర్తీ చేయాలి. అలాగే ఫైనల్ 11లో నలుగురికి మించి విదేశీ క్రికెటర్లు జట్టులో ఉండకూడదు. ఇప్పుడు రాజస్థాన్ విషయానికొస్తే.. తొలుత ముగ్గురు విదేశీ ప్లేయర్లను తుది జట్టులోకి తీసుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా హెట్మయర్ స్థానంలో నాండ్రీ బర్గర్ను తీసుకుంది. అప్పుడు ఫీల్డింగ్ సమయంలోనూ మైదానంలో ముగ్గురు విదేశీ క్రికెటర్లే ఉన్నారు. దీంతో రోవ్మన్ పావెల్ను సబ్స్టిట్యూట్గా తీసుకొనేందుకు రాజస్థాన్కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం