Hardik Pandya: దటీజ్ హార్దిక్ పాండ్య.. వద్దనుకున్న వాళ్లే వెంటపడేలా చేసిన ఆల్రౌండర్
ఎట్టకేలకు ముంబయి ఇండియన్స్కు హార్దిక్ పాండ్య (Hardik Pandya) తిరిగొచ్చేశాడు. ఎంత మొత్తం అనేది చెప్పకపోయినా.. భారీగానే చెల్లించినట్లు సమాచారం.
ప్రతి ఐపీఎల్ (IPL) సీజన్కు కొన్ని నెలల ముందు ఆటగాళ్లను జట్లు ఇటు అటు మార్చుకోవడం మామూలే. వేలానికి కొందరు ఆటగాళ్లను అట్టిపెట్టుకుని కొంతమందిని వదిలేస్తుంటాయి జట్లు. ఆ సమయంలోనే ఆటగాళ్ల ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంటుంది. మామూలుగా దీని గురించి మీడియాలో పెద్ద చర్చేమీ జరగదు. వేలం టైంలో ఉండే హడావుడి ఇందులో కనిపించదు. కానీ ఈసారి మాత్రం ఒక ఆటగాడి జట్టు మార్పు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను (Hardik Pandya) ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ముందు ఇది కేవలం రూమర్ లాగా కనిపించినప్పటికీ.. చివరికి ఈ ప్రచారమే నిజమైంది. తనను వద్దనుకున్న ముంబయి ఇండియన్స్ జట్టే తన కోసం ఎగబడేలా చేయడంతో హార్దిక్ పాండ్య పేరు మార్మోగుతోంది.
హార్దిక్ పాండ్య అనే పేరు ఐపీఎల్ అభిమానులకు పరిచయం అయింది.. అతను ఆటగాడిగా ఒక స్థాయి అందుకుంది ముంబయి ఇండియన్స్ ద్వారానే. 2015లో ఈ బరోడా ఆటగాడి ఐపీఎల్ కెరీర్ మొదలైంది. తొలి సీజన్లోనే చక్కటి ప్రదర్శన చేశాడు. రెండో సీజన్కల్లా జట్టుకు కీలకంగా మారాడు. దీంతో పాటు రోహిత్ శర్మ సహా ముంబయి ఇండియన్స్ అట్టిపెట్టుకునే ముఖ్య ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. ఐపీఎల్ మెరుపులతో భారత జట్టులోనూ చోటు దక్కించుకుని అక్కడ కూడా ప్రధాన ఆటగాళ్లలో ఒకడిగా మారాడు. కపిల్ దేవ్ తర్వాత భారత్కు దక్కిన మేటి ఆల్రౌండర్గా కితాబులందుకున్నాడు. మూడు ఫార్మాట్లలో జట్టు తన మీద ఎంతో ఆధారపడే స్థాయికి చేరుకున్నాడు. ఐతే తర్వాత గాయాల సమస్యతో టెస్టులకు దూరమయ్యాడు. కానీ వన్డేలు, టీ20ల్లో మాత్రం కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే.. కొన్ని సీజన్ల పాటు హార్దిక్ను కోర్ గ్రూప్లో భాగంగా చూస్తూ అతణ్ని అట్టిపెట్టుకుంటూ వచ్చిన 2022 సీజన్కు ముందు అతణ్ని విడిచిపెట్టింది. రోహిత్, బుమ్రా, సూర్యకుమార్, పొలార్డ్లను మాత్రమే అట్టిపెట్టుకుని హార్దిక్ను వదిలేసింది. అప్పటికి హార్దిక్ ఫామ్ అంత గొప్పగా లేకపోవడం కూడా అతణ్ని విడిచిపెట్టడానికి ఒక కారణం. ఐతే మెగా వేలంలోకి వచ్చిన హార్దిక్ను కొనేందుకు మిగతా జట్లు ఎగబడ్డాయి. కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ అతణ్ని రూ.15 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఐతే తనను విడిచిన ముంబయి ఇండియన్స్కు తన విలువను ఆ సీజన్లోనే చాటి చెప్పాడు హార్దిక్. గుజరాత్ను కెప్టెన్గా గొప్పగా నడిపించి తొలి సీజన్లోనే విజేతగా నిలబెట్టాడు. కెప్టెన్గానే కాక ఆటగాడిగా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. రెండో సీజన్లోనూ గుజరాత్ను ఫైనల్కు చేర్చాడు. మరోవైపు హార్దిక్ లేని ముంబయి ఇండియన్స్ గత రెండు సీజన్లలోనూ పేలవ ప్రదర్శన చేసింది. హార్దిక్ను కాదని ఎంచుకున్న పొలార్డ్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. కామెరూన్ గ్రీన్ లాంటి ఆటగాళ్లు కూడా జట్టుకు సమతూకం తేలేకపోయారు. దీంతో ముంబయి ప్రదర్శన దారుణంగా దెబ్బ తింది.
ఎవ్వరూ ఊహించని విధంగా..
హార్దిక్ను గుజరాత్ టైటాన్స్ ఎంతగానో గౌరవించింది. అతనూ జట్టును గొప్పగా నడిపించాడు. ఒక కొత్త జట్టును తొలి సీజన్లోనే విజేతగా నిలపడం సామాన్యమైన విషయం కాదు. జట్టుగా చూస్తే టైటాన్స్ మరీ గొప్పగా ఏమీ అనిపించదు. కానీ హార్దిక్ వ్యక్తిగత ప్రదర్శన, జట్టును సమష్టిగా నడిపించిన తీరు టైటాన్స్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. ఇలాంటి ఆటగాడిని గుజరాత్ వదులుకుంటుందని ఎవ్వరూ అనుకోలేదు. హార్దిక్ కూడా ఈ జట్టును వీడతాడని ఊహించలేదు. కానీ హార్దిక్ అవసరం తమ జట్టుకు ఎంత ఉందో ముంబయి ఇండియన్స్ గుర్తించింది. అతణ్ని ఎలాగైనా తిరిగి తమ జట్టులోకి తేవాలనుకుంది. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్తో, హార్దిక్ పాండ్యతో సంప్రదింపులు జరిపింది. తనను వద్దనుకున్న జట్టే ఏరి కోరి తిరిగి తనను తీసుకోవడానికి ముందుకు రావడం, అందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడటంతో హార్దిక్ పాండ్య ఆలోచన మార్చుకున్నాడు.
గుజరాత్కు ఎలాంటి ఆఫర్ ఇచ్చి ముంబయి ఒప్పించిందో కానీ.. వాళ్లూ తలొగ్గారు. ఈ ఒప్పందం అనధికారికంగా జరుగుతుంది. ఇది ఐపీఎల్ నిబంధనలకు లోబడే చేస్తారు. కాకపోతే ఇలా ఆటగాడిని మార్చుకునేందుకు ఎంత చెల్లించేది బయటికి చెప్పాల్సిన పని లేదు. ముంబయి.. గుజరాత్కు ఎంత చెల్లించినప్పటికీ.. అందులోంచి సగం హార్దిక్కు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాక వేలంలో అతనికి పలికిన రూ.15 కోట్ల ధర వార్షిక ఫీజుగా వస్తుంది. ఏదేమైనప్పటికీ.. తనను దూరం చేసుకున్న జట్టే తన కోసం ఎగబడేలా చేసిన ఘనత హార్దిక్దే అంటూ అతడిని అభిమానులు కొనియాడుతున్నారు. మరి హార్దిక్ రాకతో ముంబయి రాత మారుతుందేమో చూడాలి. రోహిత్ శర్మ కెరీర్ చరమాంకంలో ఉన్న నేపథ్యంలో ముంబయికి భావి కెప్టెన్ హార్దిక్ పాండ్యనే కావచ్చనే చర్చ జరుగుతోంది. మరోవైపు హార్దిక్ దూరం కావడం టైటాన్స్కు పెద్ద దెబ్బే అవుతుందని భావిస్తున్నారు. అతడి స్థానంలో శుభ్మన్ గిల్కు జట్టు పగ్గాలను గుజరాత్ ఫ్రాంచైజీ అప్పగించింది.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!