Mumbai Indians: జస్ప్రీత్ బుమ్రా స్థానంలో డొమిస్టిక్ ప్లేయర్.. ఎవరంటే?
గాయపడి సీజన్కు దూరమైన బుమ్రా స్థానంలో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) కీలక నిర్ణయం తీసుకుంది. టీ20ల్లో అనుభవం ఉన్న మీడియం పేసర్ను తీసుకుంది. ఈ మేరకు ఐపీఎల్ (IPL 2023) నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) ప్రారంభానికి ముందే ఆయా ఫ్రాంచైజీలకు గాయాల బెడద తప్పలేదు. కొందరు కీలక ఆటగాళ్లు సీజన్ మొత్తం మిస్ అవుతుండగా.. మరికొందరు కొన్ని మ్యాచ్ల తర్వాత జట్టుతో పాటు చేరిపోతారు. భారత స్టార్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ ఐపీఎల్ 16వ సీజన్కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రిషభ్ పంత్ స్థానంలో దిల్లీ క్యాపిటల్స్ అభిషేక్ పోరెల్ను ఎంపిక చేసుకుంది. తాజాగా బుమ్రా స్థానంలో సందీప్ వారియర్ను ముంబయి ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది.
ఏప్రిల్ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్లో తలపడనుంది. ఈ క్రమంలో బుమ్రా రిప్లేస్మెంట్కు సంబంధించి ముంబయి నిర్ణయం తీసుకుంది. గతేడాది ఆసియా కప్ నుంచే అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంటున్న బుమ్రాకు మరింత విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావించింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఉంది. ఆ తర్వాత కీలకమైన వన్డే ప్రపంచకప్ ఉండటంతో బుమ్రా విషయంలో రిస్క్ తీసుకొనేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో ముంబయి ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్ నాయకత్వంలోని పేస్ దళంతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో భారత్ తరఫున రెండేళ్ల కిందట అరంగేట్రం చేసి ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన అనుభవం ఉన్న సందీప్ వారియర్ను తీసుకుంది. అయితే దేశవాళీలో 68 టీ20లను ఆడాడు. 2012లో ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి అడుగు పెట్టిన 31 ఏళ్ల మీడియం పేసర్ అయిన సందీప్ డొమిస్టిక్ క్రికెట్లో 62 వికెట్లు తీశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్