Mumbai vs Chennai: ధోనీ ఆట.. సూర్య వేట చూస్తామా?
వాంఖడే వేదికగా కీలక సమరం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో టాప్ జట్లు ముంబయి, చెన్నై తలపడనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో ఐదేసి సార్లు విజేతగా నిలిచిన జట్లు రెండు.. 17వ సీజన్లో తొలిసారి ఇరు జట్ల మధ్య పోరు జరగనుంది. ఓ వైపు కోల్కతాను ఓడించి దూకుడు మీదున్న చెన్నై.. మరోవైపు లేటుగా విజయాల ఖాతా తెరిచిన ముంబయి రాత్రి 7.30గంటలకు వాంఖడే స్టేడియం వేదికగా తలపడనున్నాయి.
వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిపాలై విమర్శలకు గురైన ముంబయి జట్టు.. అనూహ్యంగా పుంజుకొంది. రెండు విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ రేసులో తామున్నామంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేసింది. తొలి దశలో సొంతమైదానం వేదికగా ముంబయి ఆడనున్న చివరి మ్యాచ్ ఇదే కావడం విశేషం. సూర్య మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ జోడీ తొలి వికెట్కు అద్భుతమైన ఆరంభం ఇస్తుండటం ముంబయికి కలిసొచ్చే అంశం. కెప్టెన్ హార్దిక్ పాండ్య కూడా దిల్లీపై చెలరేగాడు. బౌలింగ్లో స్టార్ పేసర్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. గెరాల్డ్ కోయిట్జీ వికెట్లను తీస్తున్నా పరుగులు ధారాళంగా సమర్పించడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఆకాశ్ మధ్వాల్ కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. స్పిన్ విభాగంలో సీనియర్ ఆటగాడు పీయూష్ చావ్లా ప్రభావం చూపించలేదు. వాంఖడేలో స్పిన్కు పెద్దగా సహకారం లభించడం లేదు. ఆల్రౌండర్ నబీ స్పిన్నర్గా అక్కరకొస్తాడు. ఆఖరి ఓవర్లో సిక్స్లతో విరుచుకుపడే రొమారియో షెఫర్డ్ నుంచి మరోసారి అలాంటి ఇన్నింగ్స్ను చూడాలనేది ముంబయి అభిమానుల ఆకాంక్ష.
చెన్నై బౌలింగ్ గాడిన పడితేనే..!
యువ పేసర్ పతిరన లేకపోవడం చెన్నై జట్టుకు ఇబ్బందికరంగా మారింది. పవర్ ప్లేతోపాటు డెత్ ఓవర్లలో ప్రత్యర్థిని అద్భుతంగా కట్టడి చేయడం అతడి స్పెషాలిటీ. గత రెండు మ్యాచుల్లో పతిరన ఆడలేదు. ముంబయితో కూడా కష్టమేనని చెన్నై కోచ్ ఫ్లెమింగ్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. దీపక్ చాహర్ మాత్రం పరుగులను కట్టడి చేయలేకపోతున్నాడు. వికెట్లు తీస్తున్నా పరుగుల నియంత్రణ కూడా కీలకమే. టాప్ వికెట్ టేకర్ జాబితాలో ఉన్న ముస్తాఫిజుర్ మంచి ఫామ్లో ఉన్నాడు. తుషార్ దేశ్ పాండే, తీక్షణ, శార్దూల్ ఠాకూర్, మొయిన్ అలీ (తుది జట్టులో ఉంటే)తోకూడిన బౌలింగ్ దళం రాణించాలి. ముంబయి జట్టులో దాదాపు అందరూ హార్డ్ హిట్టర్లే. ఏమాత్రం అలసత్వంగా ఉన్నా.. బౌలర్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. బ్యాటింగ్లో రుతురాజ్ ఇంకాస్త దూకుడుగా ఆడాల్సి ఉంది. వాంఖడేలో మరోసారి ధోనీ బ్యాటింగ్ చూసే అవకాశం వస్తే బాగుండని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. రచిన్, అజింక్య రహానె మరింత బాధ్యతాయుతంగా ఆడాలి.
పిచ్ రిపోర్ట్
ముంబయి - చెన్నై ఇప్పటి వరకు 36 మ్యాచుల్లో తలపడ్డాయి. ముంబయి 20, చెన్నై 16 మ్యాచుల్లో గెలిచాయి. వాంఖడేలో 7-4 లీడ్లో ఆతిథ్య జట్టు కొనసాగుతోంది. గతేడాది మాత్రం చెన్నైనే విజయం సాధించింది. వాంఖడే మైదానంలో టాస్ నెగ్గే కెప్టెన్ తొలుత బౌలింగ్నే ఎంచుకుంటాడు. లక్ష్య ఛేదన సమయంలో మంచు ప్రభావం ఉంటుంది. అప్పుడు ఛేజింగ్ చేసే జట్టుకు అనుకూలంగా మారుతుంది.
తుది జట్లు (అంచనా)
ముంబయి: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, నబీ, శ్రేయస్ గోపాల్, బుమ్రా, గెరాల్డ్ కోయిట్జీ, ఆకాశ్ మధ్వాల్
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానె, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తుషార్ దేశ్పాండే, మతీశా తీక్షణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?