IND vs AUS: నాగ్పుర్లో ‘టెస్టు’ రికార్డులు.. ఆధిక్యం ఎవరిదంటే..?
భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) నాలుగు టెస్టుల సిరీస్కు సమయం ఆసన్నమైంది. తొలి టెస్టుకు నాగ్పుర్ (Nagpur) వేదికగా కావడం విశేషం. భారత్కు అనేక మంచి రికార్డులే ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ - పాకిస్థాన్ (IND vs PAK).. ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా (ENG vs AUS).. జట్ల మధ్య జరిగే మ్యాచ్లు రసవత్తరంగా ఉంటాయని క్రికెట్ అభిమానుల భావన. అదే కోవలోకి భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) టెస్టు సిరీస్ కూడా వచ్చి చేరింది. తాజాగా భారత్ వేదికగానే ఆసీస్తో టెస్టు సిరీస్ జరగనుంది. బోర్డర్ - గావస్కర్ పేరిట జరిగే నాలుగు టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్కు నాగ్పుర్లోని క్రికెట్ స్టేడియం (Nagpur Stadium) వేదికగా నిలవనుంది. మరి విదర్భ మైదానంలో ఆధిక్యం ఎవరిది..? గత గణాంకాలను ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దాదాపు ఐదేళ్ల తర్వాత నాగ్పుర్ స్టేడియంలో టెస్టు మ్యాచ్ జరగబోతోంది. చివరిసారిగా 2017 నవంబర్లో శ్రీలంకతో భారత్ (IND vs SL) తలపడింది. లంకపై ఇన్నింగ్స్ 239 పరుగుల భారీ తేడాతో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఆరు టెస్టులు జరిగాయి. అందులో భారత్దే పైచేయి కావడం విశేషం. నాలుగు టెస్టుల్లో విజయం సాధించగా.. ఒకే మ్యాచ్లో ఓటమిపాలైంది. మరొకటి డ్రాగా ముగిసింది. దక్షిణాఫ్రికా చేతిలో (2010)నే భారత్కు పరాభవం ఎదురైంది. తొలి రెండు రోజులు ఫాస్ట్ బౌలింగ్కు అనుకూలంగా ఉండి.. మూడో రోజు నుంచి స్పిన్నర్ల పాలిట స్వర్గధామంగా మారుతుందనేది పిచ్పై క్రికెట్ విశ్లేషకుల అంచనా.
తొలి టెస్టు ఆసీస్తోనే..
విదర్భ స్టేడియం వేదికపై భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య 2008లో జరిగిన టెస్టు మ్యాచ్కు విదర్భ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. ఇదే ఈ మైదానంలో తొలి టెస్టు కావడం విశేషం. ఇందులో భారత్ 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న నాగ్పుర్ స్టేడియంలో ఆసీస్తో జరిగిన టెస్టులో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (109)తోపాటు సౌరభ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ అర్ధ శతకాలతో అదరగొట్టేశారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 441/10 స్కోరు చేసింది. అనంతరం సైమన్ కటిచ్ (102), మైకెల్ హస్సీ (90), కామెరూన్ వైట్ (46) రాణించడంతో 355 పరుగులు చేయగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్లో భారత్ 295/10 స్కోరు చేయడంతో ఆసీస్ ఎదుట 382 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. కానీ, భారత స్పిన్నర్లు హర్భజన్ (4/64), అమిత్ మిశ్రా (3/27)తోపాటు ఇషాంత్ శర్మ (2/31) దెబ్బకు ఆసీస్ 209 పరుగులకే కుప్పకూలి 172 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ (0, 2) రెండు ఇన్నింగ్స్ల్లోనూ విఫలమై నిరాశపరిచాడు.
మరికొన్ని విశేషాలు..
* విదర్భ స్టేడియంలో అత్యధిక స్కోరు: 610/6 డిక్లేర్డ్. శ్రీలంకపై భారత్ చేసిన పరుగులు ఇవీ..
* అత్యల్ప స్కోరు: దక్షిణాఫ్రికా 2015/16 సీజన్లో భారత్పై 79 పరుగులకు ఆలౌట్.
* అత్యధిక వ్యక్తిగత స్కోరు: దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా 253* పరుగులను భారత్పై (2010/11)సాధించాడు.
* ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన : భారత్పై (2008/2009) ఆసీస్ బౌలర్ జాసన్ క్రెజా 8/215.
* అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్: టీమ్ఇండియా ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (Sehwag) 357 పరుగులతో ఉన్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (Virat kohli) 354 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఈ టెస్టులో మరో నాలుగు పరుగులు చేస్తే సెహ్వాగ్ను అధిగమించే అవకాశం ఉంది.
* అత్యధిక వికెట్ల వీరుడు: ఆసీస్ హడలెత్తిపోతున్న రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) ఇక్కడ అత్యధికంగా వికెట్లు తీసిన బౌలర్ కావడం విశేషం. ఇప్పటి వరకు 19 వికెట్లను పడగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!