Nani - Dasara: టీమ్ ఇండియా స్టార్లకు పేర్లు పెట్టిన నాని.. ఎవరికేం పేరు ఇచ్చాడంటే?
విశాఖపట్నంలో జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియాల వన్డే మ్యాచ్(Ind vs Aus 2nd ODI)కు యువ హీరో నాని (Nani) ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ఈ క్రమంలో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్లకు కొన్ని పేర్లు పెట్టాడు.
విశాఖపట్నం: ‘ధరణి’ అవతారం ఎత్తి ఈ నెల 30న థియేటర్లలో సందడి చేయడానికి రాబోతున్నాడు నాని. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన ‘దసరా’ (Dasara Movie) సినిమా ఆ రోజే వస్తోంది మరి. ఈ సినిమా ప్రచారంలో భాగంగా నాని ఆదివారం విశాఖపట్నం వచ్చాడు. భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే ప్రారంభానికి ముందు కాసేపు సందడి చేశాడు. మాజీ క్రికెటర్లు సునీల్ గావస్కర్, ఎమ్మెస్కే ప్రసాద్, ఆరోన్ ఫించ్తో మాట్లాడాడు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు నాని.
- ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్కు ‘దసరా’లోని ‘ధూమ్ ధామ్..’ సిగ్నేచర్ స్టెప్ను నాని నేర్పించాడు. ఇద్దరూ కలసి ఆ స్టెప్ వేసేసరికి స్టేడియంలో ఈలలు మోగిపోయాయి.
- తెలుగు కామెంటరీ టీమ్తో మాట్లాడుతూ తన సినిమాల పేర్లు ఏ క్రికెటర్లకు బాగుంటాయి అనే విషయాన్ని సరదాగా చెప్పాడు నాని. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు ‘జెంటిల్మెన్’ టైటిల్ ఇచ్చాడు.
- కింగ్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ ఇచ్చిన నాని, హార్దిక్ పాండ్య (Hardik Pandya)కి ‘పిల్ల జమిందార్’ టైటిల్ బాగుంటుందన్నాడు.
- ఇక బాగా ఇష్టమైన క్రికెటర్ ఎవరు అనే ప్రశ్నకు ... సచిన్ తెందుల్కర్ (Sachin Tendulkar) అని చెప్పాడు. సచిన్ ఆటకు తాను పెద్ద ఫ్యాన్ అని, అతను ఔట్ అయ్యాడు అనగానే టీవీలు ఆపేసేవాళ్లం అని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..