Virat - Naveen ul: ఆర్సీబీ ఎలిమినేట్.. నవీనుల్ హక్ ఇన్స్టా స్టోరీ వైరల్!
ఐపీఎల్ 2023 సీజన్లో(IPL 2023) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కథ ముగిసింది. ప్లేఆఫ్స్కు చేరాలనే ఆశలకు గుజరాత్ టైటాన్స్ అడ్డుకట్ట వేసింది. విరాట్ సెంచరీ సాధించినా బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో లఖ్నవూ ఆటగాడు నవీనుల్ హక్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ సాధించినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు (RCB) ఓటమి తప్పలేదు. గుజరాత్ యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ కూడా శతకం బాది ఆర్సీబీని ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో బెంగళూరు లీగ్ స్టేజ్కే పరిమితమై ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో లఖ్నవూ సూపర్జెయింట్స్ ఆటగాడు నవీనుల్ హక్ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ వైరల్గా మారింది. మే 9న ముంబయితో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ త్వరగా పెవిలియన్కు చేరాడు. ఆ సంఘటనపై నవీనుల్ హక్ ‘స్వీట్ మ్యాంగోస్’అంటూ పోస్టు చేశాడు.
ఇప్పుడు ఐపీఎల్ 2023 సీజన్ నుంచి బెంగళూరు ఎలిమినేట్ కావడం.. అంతకుముందు లఖ్నవూ ప్లేఆఫ్స్కు దూసుకెళ్లడంతో నవీనుల్ చేసిన పోస్టుకు ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో లఖ్నవూ-బెంగళూరు మ్యాచ్ సందర్భంగా విరాట్, నవీనుల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి బెంగళూరు మ్యాచ్లకు సంబంధించి మరీ ముఖ్యంగా విరాట్ను ఉద్దేశించి నవీనుల్ హక్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నాడు. దీంతో కోహ్లీ అభిమానులు తీవ్రంగా స్పందించారు.
• ‘‘నవీనుల్ హక్ తన పరిధులను అతిక్రమించాడు’’
• ‘‘ఇదే నవీనుల్కు చివరి ఐపీఎల్ సీజన్’’
• ‘‘విరాట్ కోహ్లీ కనీసం రెండు సెంచరీలు అయినా సాధించాడు. నవీనుల్ హక్ ఏం చేశాడు..?’’
• ‘‘నవీనుల్కు తన కామెంట్ సెక్షన్ను టర్న్ఆన్ చేయమని ఎవరైనా చెప్పండి ప్లీజ్..’’
• ‘‘రోహిత్ సేన తర్వాతి మ్యాచ్లో నవీనుల్ హక్ ఐపీఎల్ కెరీర్ను ముగిస్తుందిలే!’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..