Neeraj Chopra: ఒలింపిక్స్ ముంగిట భారీ షాక్.. నీరజ్ చోప్రాకు గాయం
ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా గాయపడ్డాడు. మరో రెండు రోజుల్లో చెక్ రిపబ్లిక్ వేదికగా జరగనున్న పోటీల్లో పాల్గొనడం లేదు.
ఇంటర్నెట్ డెస్క్: భారత జావెలిన్ త్రో అభిమానులకు షాక్కు గురిచేసే వార్త. స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) గాయపడ్డాడు. పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympic Games) మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న క్రమంలో నీరజ్ గాయపడటం ఫ్యాన్స్ను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన ఫెడరేషన్ కప్లో పోటీ పడిన సంగతి తెలిసిందే. చెక్ రిపబ్లిక్లో మే 28న జరగనున్న ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్లో పాల్గొనడం దాదాపు కష్టమే. ఈ మేరకు నిర్వాహకులు ఓ ప్రకటన జారీ చేశారు.
‘‘ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా సందేశాన్ని మేం పరిశీలించాం. రెండు వారాల కిందట గజ్జల్లో గాయం కారణంగా ఇబ్బంది పడ్డాడు. ఆస్ట్రావాలో అతడు విసరడం కష్టమే. అయితే, ఈ ఈవెంట్కు అతిథిగా వస్తాడు’’ అని ప్రకటనలో పేర్కొంది.
ఫెడరేషన్ కప్లో..
మే 15న భువనేశ్వర్ వేదికగా జరిగిన ఫెడరేషన్ కప్లో చోప్రా 82.27 మీటర్లు విసిరి స్వర్ణం గెలిచాడు. అయితే, అతడి బెస్ట్ 88.94 కంటే చాలా తక్కువే. రెండేళ్ల కిందట స్టాక్లోమ్ డైమండ్ లీగ్లో ఈ ఫీట్ను సాధించాడు. త్వరలోనే 90 మీటర్ల దూరం త్రో చేయడానికి సిద్ధమవుతున్న క్రమంలో గాయపడటం ఇబ్బందికరంగా మారింది. జులై 26 నుంచి పారిస్ వేదికగా ఒలింపిక్స్ 2024 పోటీలు ప్రారంభం కానున్నాయి. సరిగ్గా రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. నీరజ్ ఫిట్నెస్ సాధించి మెరుగైన ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. అదే సమయంలో 90 మీటర్లు ఘనతను సాధించాలనేది వారి ఆకాంక్ష.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం